బ్రో వేడుకలో సోషల్ మీడియాకు కావాల్సిన మీమ్స్ స్టఫ్ పుష్కలంగా దొరికేసింది. కొన్ని సరదా సన్నివేశాలు, ఫన్నీ మూమెంట్స్ వీడియోల రూపంలో వాడేసుకుని సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. నిర్మాత విశ్వప్రసాద్ కు బంధువైన టిజి వెంకటేష్ తన ప్రసంగంలో టీమ్ ని ఉద్దేశించి మాట్లాడుతూ పొరపాటున సముతిరఖనిని సముద్రాలు, తమన్ ని తమన్నా, సాయి తేజ్ ని ధర్మతేజ, కేతిక శర్మని కీర్తి శర్మగా సంబోధించడంతో నవ్వులు విరిశాయి. కిందపడ్డ మైకుని తీసుకోబోతున్న సాయితేజ్ పక్కనే ఉన్న తమన్ తనకు నమస్కారం చేయబోతున్నట్టు ఫీలై వారించడం పేలింది.
ఇవే కాదు తమన్ ప్రాంగణంలోకి వచ్చాక వెరైటీగా నమస్కారం పెట్టడం, బ్రహ్మానందం మాట్లాడుతూ పవన్ ని ఐ లవ్ బ్రో అంటూ పదే పదే చెబుతూ నవ్వులు పూయించడం ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాయి. పవన్ స్పీచ్ మధ్యలో వైష్ణవ్ తేజ్ వెనుక నుంచి చెవిలో ఏదో చెప్పబోతే నాకు గుర్తుందంటూ పవన్ కాసింత సీరియస్ గా చూడటం బాగుంది. ఇలా ఆహ్లాదకమైన హాస్యంతో వేడుక చక్కని టైం పాస్ చేయించింది. పవన్, తేజు, తమన్ ముగ్గురు కలిసి తమ్ముడు పంచె గెటప్ లో కిల్లి కిల్లి సాంగ్ కి డాన్సు చేసిన వీడియోని ప్లే చేయడం ఊహించని స్పెషల్ సర్ప్రైజ్.
క్షణాల్లో ఇవన్నీ ట్విట్టర్ అదే ప్రస్తుతం ఎక్స్ గా పేరు మార్చుకున్న సోషల్ మీడియాలో దిగిపోయాయి. ఆలస్యంగా ప్రారంభమై బయట వర్షం పడుతున్నా అభిమానులు లెక్క చేయకుండా తండోప తండాలుగా వచ్చారు. వాళ్ళను నిరాశ పరచకుండా పవన్ అరగంటకు పైగానే మాట్లాడ్డం మంచి జోష్ ఇచ్చింది. వరుణ్ తేజ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపారు. ఇంకో రెండే రోజుల్లో విడుదల ఉన్న నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్ల ఒప్పందాల కారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ కొంత ఆలస్యంగా మొదలుపెట్టడం షాక్. తెలంగాణ, ఏపీలో క్రమంగా ఆన్ లైన్ బుకింగ్ లో స్క్రీన్లు పెంచుతున్నారు.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…