శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా సినిమా రానున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితమే అనౌన్స్మెంట్ వచ్చిన ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశాడు శేఖర్ కమ్ముల. కొన్ని నెలలుగా ఈ సినిమా కోసం స్క్రిప్టింగ్ చేస్తున్న కమ్ముల ఇందులో ఒక గెస్ట్ రోల్ క్రియేట్ చేశారట. సినిమాలో ఒక ఇంపార్టెంట్ సిట్యువేషన్ లో ఆ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుందట.
ఆ క్యామియో నాగార్జునతో చేయించాలని భావిస్తున్నారట. గతంలో కార్తీతో కలిసి ఊపిరి సినిమాలో నటించాడు నాగ్. ఇప్పుడు మరో తమిళ హీరో తో కలిసి నటించినున్నాడు. శేఖర్ కమ్ముల, నిర్మాత సునీల్ ఇప్పటికే నాగార్జున ని కలిసి ఈ కామియో గురించి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారట. ప్రస్తుతం బిగ్ బాస్ షో తో బిజీగా ఉన్నాడు నాగార్జున.
సార్ తో తెలుగులో మంచి విజయం అందుకున్న ధనుష్ ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందకు స్ట్రెయిట్ సినిమాతో రాబోతున్నాడు. అన్ని భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో ధనుష్ కి హీరోయిన్ గా రష్మిక ని తీసుకోనున్నారని తెలుస్తుంది. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తాడని టాక్.
This post was last modified on July 25, 2023 8:54 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…