Movie News

ప్రతినిధి 2 ఎవరిని ప్రశ్నించబోతున్నాడు

టాలెంట్ పుష్కలంగా ఉంటూ సబ్జెక్ట్ సెలక్షన్ లో ప్రత్యేక శైలిని అనుసరించే నారా రోహిత్ తెరమీద కనిపించి చాలా గ్యాప్ వచ్చేసింది. తనకు బాగా పేరు తెచ్చిన సినిమాల్లో ప్రతినిధి ముందు వరుసలో ఉంటుంది. 2014లో వచ్చిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేయడం ద్వారా సమాజంపై సమస్యల వర్షం కురిపించే బాధ్యతాయుతమైన యువకుడి పాత్ర బాగా గుర్తుండిపోయింది. ప్రశాంత్ మండవ దర్శకత్వం వహించగా కమర్షియల్ గానూ బాగా పే చేసింది. తిరిగి తొమ్మిదేళ్ల తర్వాత ప్రతినిధి 2తో నారా రోహిత్ మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.

టీవీ 5 మూర్తి దీనికి డైరెక్షన్ చేయనుండటంతో ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం చాలా వేడెక్కిపోయి ఉంది. అధికార పార్టీ  పాలన పట్ల ప్రజలు, ప్రతిపక్షం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని ఎండగట్టేలా ప్రతినిధి 2లో చాలా అంశాలు ఉంటాయని ఇన్ సైడ్ టాక్. చాలా వేగంగా షూటింగ్ చేయబోతున్నారు. 2024 జనవరి 25 విడుదల తేదీ కూడా పోస్టర్ లోనే ఇచ్చేశారు. అంటే ఆరు నెలల లోపే చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి సంక్రాంతి లోపే ఫస్ట్ కాపీ సిద్ధం చేస్తారన్న మాట. అంతా ప్లాన్డ్ గా జరుగుతోందని సమాచారం.

ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబునాయుడుకు మద్దతుగానే నారా రోహిత్ గళం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సిఎం జగన్  మీద సైటైర్లు, మూడు రాజధానుల వ్యవహారం, ఎమ్మెల్యే మంత్రుల అవినీతి తదితర అంశాలు ఉండొచ్చని తెలుస్తోంది. ఇటీవలే చిరంజీవి భోళా శంకర్ రూపంలో ప్రమోషన్ అందుకున్న మహతి స్వరసాగర్ దీనికి సంగీతం సమకూర్చబోతున్నాడు. ఎన్నికలు మరికొన్ని నెలల్లో రాబోతుండగా ప్రతినిది 2 రావడం, అది కూడా యాత్ర 2 కన్నా ముందు ప్లాన్ చేసుకోవడం ప్రత్యర్థికి తగిన బాణమేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

This post was last modified on July 24, 2023 4:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

4 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

5 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

5 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

5 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

6 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

6 hours ago