ఒకప్పుడు టాలీవుడ్లో నంబర్ వన్ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ఒక వెలుగు వెలిగాడు. మణిశర్మ తర్వాత అతడికి దీటుగా నిలిచే సంగీత దర్శకుడే కనిపించలేదు. తమన్ నుంచి కొంత పోటీ ఉన్నా.. దేవిశ్రీ రేంజ్ వేరు అన్నట్లే ఉండేది. ఒక దశాబ్దానికి పాటు అతను తెలుగు సినిమా సంగీతాన్ని మామూలుగా ఏలలేదు. కానీ గత ఐదారేళ్లలో మాత్రం దేవి తనపై పెట్టుకున్న ఆశలు, అంచనాలను అందుకోలేకపోయాడనే చెప్పాలి.
ఈ టైంలో కూడా టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగానే ఉన్నాడు కానీ.. తన మ్యూజిక్లో మునుపటి ఫైర్ మాత్రం మిస్సయింది. చాలా సినిమాల్లో దేవి పాటలు అంచనాలను అందుకోలేకపోయాయి. నేపథ్య సంగీతం కూడా ఎగ్జైటింగ్గా అనిపించలేదు. అదే సమయంలో తమన్ రైజ్ అయ్యాడు. అరవింద సమేత, అల వైకుంఠపురములో, అఖండ లాంటి చిత్రాల్లో తన పాటలకు, నేపథ్య సంగీతానికి ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు తమిళంలో అనిరుధ్ లాంటి వాళ్ల దూకుడు మామూలుగా లేదు.
‘పుష్ప’ లాంటి ఒకటీ అరా చిత్రాల్లో మాత్రమే దేవిశ్రీ తన ముద్రను చూపించగలిగాడు. దేవి అభిమానులు అతడి పాత సినిమాల పాటలు, ఆర్ఆర్ బిట్స్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నోస్టాల్జిగ్గా ఫీల్ అవుతూ అప్పటి దేవి ఏమైపోయాడు అని ఫీలయ్యే పరిస్థితి నెలకొంది. ఐతే చాన్నాళ్ల తర్వాత ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఓ సినిమా టీజర్తో బలమైన ముద్ర వేయగలిగాడు. అందరూ తన మ్యూజిక్ గురించి చర్చించుకునేలా చేయగలిగాడు.
ఆ చిత్రమే.. కంగువా. సూర్య హీరోగా శివ రూపొందిస్తున్న ‘కంగువా’ టీజర్ శనివారం అర్ధరాత్రి విడుదలైంది. అది చూసి తమిళ, తెలుగు ప్రేక్షకులు మెస్మరైజ్ అయిపోయారు. అందులో విజువల్స్ మామూలుగా లేవు. అదే సమయంలో బ్యాగ్రౌండ్ స్కోర్ మంటలు పుట్టించేసింది. టీజర్లో ఇంటెన్సిటీని ఇంకో లెవెల్కు తీసుకెళ్లింది ఆర్ఆర్. ఆరంభం నుంచి చివరి వరకు ఒక లెవెల్లో సాగింది బ్యాగ్రౌండ్ స్కోర్. ఈ సినిమాతో పాత బాకీలన్నీ తీర్చేస్తూ.. తన మీద ఉన్న విమర్శలన్నింటికీ దేవి బదులు చెప్పబోతున్నట్లే కనిపిస్తోంది.
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…