మూడేళ్ళ క్రితం వచ్చిన పలాస 1978తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్ మళ్ళీ ఆ స్థాయి సినిమా చేయలేదు. వెబ్ మూవీ మెట్రో కథలు నిరాశ పరచగా సుధీర్ బాబుతో చేసిన శ్రీదేవి సోడా సెంటర్ భారీ అంచనాల మధ్య ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. తక్కువ బడ్జెట్ తో తీసిన కళాపురం సైతం తీవ్రంగా నిరాశపరిచింది. అయినా సరే మెగా ఆఫర్ వరించడం అంటే మాటలు కాదు. వరుణ్ హీరోగా విజేందర్ రెడ్డి-మోహన్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించబోయే భారీ బడ్జెట్ చిత్రం కరుణ కుమార్ చేతికి వచ్చింది. వచ్చే వారం ప్రారంభించబోతున్నారు.
ఏడు దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనలు ఆధారంగా చేసుకుని కరుణ కుమార్ ఈ వరుణ్ తేజ్ 14ని ప్లాన్ చేసుకున్నారు. బ్యాక్ డ్రాప్ తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గని డిజాస్టర్ తర్వాత వరుణ్ ఆశలన్నీ వచ్చే నెల 25న విడుదల కాబోతున్న గాండీవధారి అర్జున మీదే ఉన్నాయి. స్క్రిప్ట్ ల విషయంలో తాను వేస్తున్న తప్పటడుగులను తొందరగానే గుర్తించి రెగ్యులర్ కథలకు నో చెబుతున్నాడు. ఈ క్రమంలోనే కరుణ కుమార్ చెప్పిన లైన్ చాలా డిఫరెంట్ గా అనిపించడంతో పాటు మంచి బ్రేక్ ఇచ్చేలా ఉండటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా కరుణ కుమార్ కు ఇంత పెద్ద అవకాశం రావడం విశేషమే. పలాసలో తన పనితనం తాలూకు ప్రభావం ఆ స్థాయిలో ఉంది. తనకు పట్టున్న జానర్ ని వదిలేసి ఇతర ప్రయోగాలకు రావడం వల్ల దెబ్బ తిన్నట్టు గుర్తించిన ఈ దర్శకుడు ఇప్పుడీ ఛాన్స్ ని సరిగ్గా వాడుకుని బ్లాక్ బస్టర్ కొడితే మెయిన్ లీగ్ లోకి వచ్చేసి స్టార్ హీరోలను పట్టొచ్చు. వచ్చే నెల నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి 2024 వేసవిలో రిలీజ్ చేసేలా టార్గెట్ పెట్టుకున్నారు. అప్పటికి ఉన్న పోటీ పరిస్థితులను విశ్లేషించుకున్నాక విడుదల తేదీని ఫైనల్ చేయబోతున్నారు.
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…