బాలకృష్ణ భగవంత్ కేసరి విడుదల అక్టోబర్ 19కి లాక్ చేస్తూ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ముందు అనుకున్న తేదీ కన్నా ఒక రోజు ముందుకు జరిగింది. అదే రోజు విజయ్ లియో ఆల్రెడీ కర్చీఫ్ వేసింది. సితార సంస్థ 21 కోట్ల భారీ మొత్తానికి దీన్ని కొన్నట్టు వచ్చిన వార్త ఆల్రెడీ వైరల్ అయ్యింది. ఎంత ఇమేజ్ ఉన్నా విజయ్ స్టామినా టాలీవుడ్ వరకు పరిమితంగానే ఉంటూ వస్తోంది. ఒకప్పుడు బొటాబొటీగా ఉండేది కానీ తుపాకీ నుంచి క్రమంగా పెరుగుతూ పోయింది. రొటీన్ సినిమాలు సైతం బాగానే డబ్బులు తెచ్చేంత సేఫ్ జోన్ లోకి ఎప్పుడో వెళ్ళిపోయాడు.
ఇదంతా బాగానే ఉంది కానీ బాలయ్యని ఫేస్ చేయడం విజయ్ కు అంత సులభంగా ఉండదు. ఎందుకంటే బిసి మాస్ సెంటర్స్ లో పట్టున్న నందమూరి సీనియర్ హీరోతో తలపడటం కమర్షియల్ కోణంలో రిస్కే. పైగా అపజయమే ఎరుగని అనిల్ రావిపూడి దర్శకుడు. కళ్యాణ్ రామ్ నే పటాస్ లో ఊర మాస్ గా చూపించి మెప్పించిన ట్రాక్ రికార్డు తనది. సో ఈ కాంబో అంటే బయ్యర్లలో సహజంగానే విపరీతమైన క్రేజ్ నెలకొంది. పైగా శ్రీలీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రామ్ పాల్, తమన్ లాంటి ఆకర్షణీయమైన టీమ్ ఎలాగూ ఉంది. ట్రైలర్ వచ్చాక హైప్ రెట్టింపవుతుంది.
లియోకి సంబంధించి ప్రధానమైన సెల్లింగ్ ఫ్యాక్టర్ లోకేష్ కనగరాజ్. కమల్ హాసన్ విక్రమ్ ని హ్యాండిల్ చేసిన తీరు, దానికి తెలుగు రాష్ట్రాల్లో దక్కిన ఆదరణ బ్రాండ్ వేల్యూని పెంచింది. అంతమాత్రాన ఒకేసారి డబుల్ ట్రిపుల్ అయ్యిందని కాదు. అయినా సరే సితార అంత మొత్తానికి సిద్ధపడిందంటే ప్లాన్ పెద్దదే ఉంది. ఇదిలా ఉంటే రవితేజ టైగర్ నాగేశ్వరరావు కూడా 20న దిగుతున్నాడు. తేదీలో ఎలాంటి మార్పు ఉండదని యూనిట్ అంటోంది. మరి బాలయ్య, మాస్ మహారాజాలను కాచుకోవడం అసలు ప్రమోషన్లకే రాని విజయ్ కి పెద్ద సవాళ్ళే తీసుకురావడం పక్కా.
This post was last modified on July 22, 2023 4:57 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…