బాలకృష్ణ భగవంత్ కేసరి విడుదల అక్టోబర్ 19కి లాక్ చేస్తూ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ముందు అనుకున్న తేదీ కన్నా ఒక రోజు ముందుకు జరిగింది. అదే రోజు విజయ్ లియో ఆల్రెడీ కర్చీఫ్ వేసింది. సితార సంస్థ 21 కోట్ల భారీ మొత్తానికి దీన్ని కొన్నట్టు వచ్చిన వార్త ఆల్రెడీ వైరల్ అయ్యింది. ఎంత ఇమేజ్ ఉన్నా విజయ్ స్టామినా టాలీవుడ్ వరకు పరిమితంగానే ఉంటూ వస్తోంది. ఒకప్పుడు బొటాబొటీగా ఉండేది కానీ తుపాకీ నుంచి క్రమంగా పెరుగుతూ పోయింది. రొటీన్ సినిమాలు సైతం బాగానే డబ్బులు తెచ్చేంత సేఫ్ జోన్ లోకి ఎప్పుడో వెళ్ళిపోయాడు.
ఇదంతా బాగానే ఉంది కానీ బాలయ్యని ఫేస్ చేయడం విజయ్ కు అంత సులభంగా ఉండదు. ఎందుకంటే బిసి మాస్ సెంటర్స్ లో పట్టున్న నందమూరి సీనియర్ హీరోతో తలపడటం కమర్షియల్ కోణంలో రిస్కే. పైగా అపజయమే ఎరుగని అనిల్ రావిపూడి దర్శకుడు. కళ్యాణ్ రామ్ నే పటాస్ లో ఊర మాస్ గా చూపించి మెప్పించిన ట్రాక్ రికార్డు తనది. సో ఈ కాంబో అంటే బయ్యర్లలో సహజంగానే విపరీతమైన క్రేజ్ నెలకొంది. పైగా శ్రీలీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రామ్ పాల్, తమన్ లాంటి ఆకర్షణీయమైన టీమ్ ఎలాగూ ఉంది. ట్రైలర్ వచ్చాక హైప్ రెట్టింపవుతుంది.
లియోకి సంబంధించి ప్రధానమైన సెల్లింగ్ ఫ్యాక్టర్ లోకేష్ కనగరాజ్. కమల్ హాసన్ విక్రమ్ ని హ్యాండిల్ చేసిన తీరు, దానికి తెలుగు రాష్ట్రాల్లో దక్కిన ఆదరణ బ్రాండ్ వేల్యూని పెంచింది. అంతమాత్రాన ఒకేసారి డబుల్ ట్రిపుల్ అయ్యిందని కాదు. అయినా సరే సితార అంత మొత్తానికి సిద్ధపడిందంటే ప్లాన్ పెద్దదే ఉంది. ఇదిలా ఉంటే రవితేజ టైగర్ నాగేశ్వరరావు కూడా 20న దిగుతున్నాడు. తేదీలో ఎలాంటి మార్పు ఉండదని యూనిట్ అంటోంది. మరి బాలయ్య, మాస్ మహారాజాలను కాచుకోవడం అసలు ప్రమోషన్లకే రాని విజయ్ కి పెద్ద సవాళ్ళే తీసుకురావడం పక్కా.
This post was last modified on July 22, 2023 4:57 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…