ఓ పెళ్లి వేడుకకు హాజరైన ప్రముఖ సింగర్(గాయకుడు) సుధీర్ యదువంశీకి అత్యంత కఠిన మైన అనుభవం ఎదురైంది. తుపాకీ గురి పెట్టి మరీ ఓ వ్యక్తి తనను పాట పాడమని ఒత్తిడి చేసినట్టు సుధీర్ తాజాగా వెల్లడించాడు. సాధారణంగా ఉన్నత స్థాయి వర్గాల కుటుంబాల్లో ఏదైనా వేడుక జరిగితే.. దీనికి ముందు సంగీత్ ను నిర్వహించడం కామనే.
కుటుంబ సభ్యులు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆటపాటలతో వేడుకకు శ్రీకారం చుడతారు. ఈ కార్యక్రమానికి అభిమానులు కూడా ఎంతో ఉత్సాహంగా హాజరవుతారు. ఇలానే ఒక వివాహ వేడుకకు ప్రముఖ గాయకుడు సుధీర్ యదువంశీ కూడా హాజరయ్యారు. ఈయన ప్రముఖ గాయకుడనే విషయం తెలిసిందే. అయితే.. ఈయన ఆ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత.. ఒక వ్యక్తి ఆయన పట్ల అత్యంత అనుచితంగా వ్యవహరించాడట.
“నేను రాసిన పాటను పాడు. అని ఆ వ్యక్తి అడిగాడు. అయితే.. నేను నిరాకరించాను. ఇక్కడకు కుదరదు అని చెప్పాను. కానీ, అతను నన్ను వేధించడం ప్రారంభించాడు. అయినా తట్టుకున్నాను. కానీ, కొంత సేపటికి వివాహ వేదికను దిగిపోతున్న నన్ను అతను అనుసరించాడు. నాకు దగ్గరగా వచ్చాడు. హఠాత్తుగా తుపాకీని బయటకు తీశాడు. నాకు గురి పెట్టాడు. పాట పాడతావా లేదా! అని ఒత్తిడి చేశాడు. నేను హడలి పోయాను” అని సుధీర్ తెలిపారు.
“అంతేకాదు.. తుపాకీ నావైపు గురి పెట్టి.. పాట పాడితేనే వివాహ వేదికను దిగి కిందకి లేకపోతే.. అంటూ తీవ్రంగా హెచ్చరించాడు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఒక్కసారిగా భయపడిపోయాను. ఏమీ ఆలోచించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇక, చేసేది ఏమీలేక.. అతనీ ఈగోను సంతృప్తి పరిచేందుకు.. ఆ పాటను పాడాను. ఒక్కసారికాదు.. ఏకంగా మూడు సార్లు” అని సుధీర్ వివరించారు.
This post was last modified on July 21, 2023 2:40 pm
హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగాక.. ఏదో ఒక దశలో డౌన్ కావాల్సిందే. హీరోల మాదిరి దశాబ్దాల తరబడి కెరీర్లో పీక్స్లో…
టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండో అమెరికన్ బసవతారకం…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, తన ఆటపై అభిమానుల ప్రేమ మాత్రం ఏమాత్రం…
ఈ సంవత్సరం ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్ గా ట్రేడ్ అభివర్ణిస్తున్న ఆగస్ట్ 14 జరిగే కూలీ వర్సెస్ వార్…
ఏపీ ప్రజలకు కూటమి సర్కారు మంగళవారం శుభవార్తను చెప్పింది. రాష్ట్రంలో ఉంటూ ఇప్పటిదాకా రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కొత్తగా…
కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల వ్యవహారం.. అంతా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ల కనుసన్నల్లోనే జరుగుతోంది. ఇది…