ఓ పెళ్లి వేడుకకు హాజరైన ప్రముఖ సింగర్(గాయకుడు) సుధీర్ యదువంశీకి అత్యంత కఠిన మైన అనుభవం ఎదురైంది. తుపాకీ గురి పెట్టి మరీ ఓ వ్యక్తి తనను పాట పాడమని ఒత్తిడి చేసినట్టు సుధీర్ తాజాగా వెల్లడించాడు. సాధారణంగా ఉన్నత స్థాయి వర్గాల కుటుంబాల్లో ఏదైనా వేడుక జరిగితే.. దీనికి ముందు సంగీత్ ను నిర్వహించడం కామనే.
కుటుంబ సభ్యులు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆటపాటలతో వేడుకకు శ్రీకారం చుడతారు. ఈ కార్యక్రమానికి అభిమానులు కూడా ఎంతో ఉత్సాహంగా హాజరవుతారు. ఇలానే ఒక వివాహ వేడుకకు ప్రముఖ గాయకుడు సుధీర్ యదువంశీ కూడా హాజరయ్యారు. ఈయన ప్రముఖ గాయకుడనే విషయం తెలిసిందే. అయితే.. ఈయన ఆ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత.. ఒక వ్యక్తి ఆయన పట్ల అత్యంత అనుచితంగా వ్యవహరించాడట.
“నేను రాసిన పాటను పాడు. అని ఆ వ్యక్తి అడిగాడు. అయితే.. నేను నిరాకరించాను. ఇక్కడకు కుదరదు అని చెప్పాను. కానీ, అతను నన్ను వేధించడం ప్రారంభించాడు. అయినా తట్టుకున్నాను. కానీ, కొంత సేపటికి వివాహ వేదికను దిగిపోతున్న నన్ను అతను అనుసరించాడు. నాకు దగ్గరగా వచ్చాడు. హఠాత్తుగా తుపాకీని బయటకు తీశాడు. నాకు గురి పెట్టాడు. పాట పాడతావా లేదా! అని ఒత్తిడి చేశాడు. నేను హడలి పోయాను” అని సుధీర్ తెలిపారు.
“అంతేకాదు.. తుపాకీ నావైపు గురి పెట్టి.. పాట పాడితేనే వివాహ వేదికను దిగి కిందకి లేకపోతే.. అంటూ తీవ్రంగా హెచ్చరించాడు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఒక్కసారిగా భయపడిపోయాను. ఏమీ ఆలోచించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇక, చేసేది ఏమీలేక.. అతనీ ఈగోను సంతృప్తి పరిచేందుకు.. ఆ పాటను పాడాను. ఒక్కసారికాదు.. ఏకంగా మూడు సార్లు” అని సుధీర్ వివరించారు.
This post was last modified on July 21, 2023 2:40 pm
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…
సక్సెస్ మాత్రమే మాట్లాడే ఇండస్ట్రీలో కొందరికి అవకాశాలు ఒక సినిమాతో సృష్టించుకున్న బ్రాండ్ వల్ల వస్తాయి. జాతిరత్నాలు దర్శకుడు కెవి…
తమిళనాడు రాజకీయాల్లో చిత్రమైన వైఖరి కనిపిస్తోంది. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ట్రైలర్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. సభా వేదికపై ఉన్న 98 ఏళ్ల…