ఓ పెళ్లి వేడుకకు హాజరైన ప్రముఖ సింగర్(గాయకుడు) సుధీర్ యదువంశీకి అత్యంత కఠిన మైన అనుభవం ఎదురైంది. తుపాకీ గురి పెట్టి మరీ ఓ వ్యక్తి తనను పాట పాడమని ఒత్తిడి చేసినట్టు సుధీర్ తాజాగా వెల్లడించాడు. సాధారణంగా ఉన్నత స్థాయి వర్గాల కుటుంబాల్లో ఏదైనా వేడుక జరిగితే.. దీనికి ముందు సంగీత్ ను నిర్వహించడం కామనే.
కుటుంబ సభ్యులు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆటపాటలతో వేడుకకు శ్రీకారం చుడతారు. ఈ కార్యక్రమానికి అభిమానులు కూడా ఎంతో ఉత్సాహంగా హాజరవుతారు. ఇలానే ఒక వివాహ వేడుకకు ప్రముఖ గాయకుడు సుధీర్ యదువంశీ కూడా హాజరయ్యారు. ఈయన ప్రముఖ గాయకుడనే విషయం తెలిసిందే. అయితే.. ఈయన ఆ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత.. ఒక వ్యక్తి ఆయన పట్ల అత్యంత అనుచితంగా వ్యవహరించాడట.
“నేను రాసిన పాటను పాడు. అని ఆ వ్యక్తి అడిగాడు. అయితే.. నేను నిరాకరించాను. ఇక్కడకు కుదరదు అని చెప్పాను. కానీ, అతను నన్ను వేధించడం ప్రారంభించాడు. అయినా తట్టుకున్నాను. కానీ, కొంత సేపటికి వివాహ వేదికను దిగిపోతున్న నన్ను అతను అనుసరించాడు. నాకు దగ్గరగా వచ్చాడు. హఠాత్తుగా తుపాకీని బయటకు తీశాడు. నాకు గురి పెట్టాడు. పాట పాడతావా లేదా! అని ఒత్తిడి చేశాడు. నేను హడలి పోయాను” అని సుధీర్ తెలిపారు.
“అంతేకాదు.. తుపాకీ నావైపు గురి పెట్టి.. పాట పాడితేనే వివాహ వేదికను దిగి కిందకి లేకపోతే.. అంటూ తీవ్రంగా హెచ్చరించాడు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఒక్కసారిగా భయపడిపోయాను. ఏమీ ఆలోచించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇక, చేసేది ఏమీలేక.. అతనీ ఈగోను సంతృప్తి పరిచేందుకు.. ఆ పాటను పాడాను. ఒక్కసారికాదు.. ఏకంగా మూడు సార్లు” అని సుధీర్ వివరించారు.
సోషల్ మీడియాలో హడావిడి తగ్గింది కానీ వీక్ డేస్ లో కూడా మా ఇంటి బంగారంకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి.…
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…