శుభామా అని బేబీ బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతూ ఈ గురు శుక్రవారాలు బోలెడు కొత్త సినిమాలు రిలీజవుతుంటే టాలీవుడ్ నెత్తి మీద వర్షం పిడుగు పడింది. ఎడతెరిపి లేని కుంభవృష్టితో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. హైదరాబాద్ పరిస్థితి మరీ అన్యాయంగా ఉంది. నిన్న కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామైపోయి గంటల కొద్దీ జనం రోడ్ల మీద వాహనాల్లో ఎదురు చూడాల్సి వచ్చింది. తెలంగాణలోనే కాదు ఏపీలోనూ గట్టి జల్లులే పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అదే పనిగా హోరు వానలో తడుచుకుంటూ థియేటర్లకు వెళ్లే మూడ్ లో అధిక శాతం ప్రేక్షకులు ఉండరు.
ఇవాళ చాలా సినిమాలు విడుదలయ్యాయి. హత్య, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, హర్ చాఫ్టర్ వన్, డిటెక్టివ్ కార్తిక్, నాతో నేను, ఒక్కడే వీరుడు, కాజల్ కార్తీక, అలా ఇలా ఎలాతో పాటు హాలీవుడ్ మూవీస్ ఓపెన్ హెయిమర్, బార్బీలు వచ్చాయి. హిడింబ నిన్నే దిగాడు. వీటికి షోల సర్దుబాటు చేయడమే డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద సవాల్ గా మారింది. బేబీ స్ట్రాంగ్ రన్ వల్ల అధిక శాతం థియేటర్లలో ఇంకా కొనసాగుతోంది. అయినా సరే కొత్తగా వచ్చిన పదకొండు చిత్రాలకు షోలు ఇవ్వక తప్పని పరిస్థితి. సరే ఏదోలా అడ్జస్ట్ మెంట్లు చేశారు కానీ ఇప్పుడీ వరుణ దేవుడి దెబ్బకు వసూళ్లకు కోత పడేలా ఉన్నాయి.
ఎందుకంటే ఏ సినిమాకైనా మొదటి రోజు ఓపెనింగ్స్ చాలా కీలకం. ఆడియన్స్ లో ఆసక్తి రేపడానికి టాక్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. పైగా వచ్చినవన్నీ దాదాపు చిన్న చిత్రాలే. స్టార్ క్యాస్టింగ్ లేనివి. కేవలం కంటెంట్ ని నమ్ముకుని వచ్చాయి. ఇలాంటి టైంలో జనం బయటికి రావడం అవసరం. వాతావరణం చూస్తుంటే ఇంకో రెండు మూడు రోజులు ఇదే సీన్ ఉండేలా కనిపిస్తోంది. అసలే వచ్చే వారం పవన్ కళ్యాణ్ బ్రో ఉంటుంది. ఆలోగానే వీలైనంత రాబట్టుకోవాలి. ఎలాగూ అగ్రిమెంట్లు, స్క్రీన్ కౌంట్ తగ్గిపోతుంది. అందుకే నిర్మాతల గుండెల్లో కలెక్షన్ల పరంగా రైళ్లు పరిగెడుతున్నాయి.
This post was last modified on July 21, 2023 10:11 am
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…