బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యూహాత్మకంగా వెళుతున్నట్లున్నారు. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. అన్నీ సవ్యంగా కుదిరితే డిసెంబర్లోనే ఎన్నికలు జరగాలి. బండి సంజయ్ నుండి కిషన్ బాధ్యతలు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. కిషన్ ప్రెసిడెంట్ గా నియమితులైనప్పటినుండి చాలామంది బండితో పోలికి చూసి చప్పరించేస్తున్నారు. దాంతో కిషన్ కు బాగా మండినట్లుంది. అందుకనే బాధ్యతలు తీసుకోగానే గోల మొదలుపెట్టేశారు.
బాటసింగారంలో కేసీయార్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూంల ఇళ్ళని పరిశీలించే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. కిషన్ వెంట సీనియర్ నేతలు, కార్యకర్తలు చాలామందే బయలుదేరారు. అయితే అందరినీ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో కిషన్ రోడ్డుమీద బైఠాయించారు. ఒకవైపు భారీ వర్షం మరోవైపు పోలీసులు అడ్డగింత కారణంగా కిషన్ రోడ్డుమీద కూర్చునేశారు. ఫలితంగా ఏమైందంటే రెండువైపులా ట్రాఫిక్ భారీగా జామ్ అయిపోయింది. కిషన్ బృందం డబుల్ బెడ్ రూం ఇళ్ళ పరిశీలనా రాజకీయమే.
కిషన్ ను అడ్డుకోవటమూ కేసీయార్ ప్రభుత్వం రాజకీయమే. ఎందుకంటే కేంద్రమంత్రి హోదాలో కిషన్ రెడ్డి డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణాలను పరిశీలించాలంటే ఉన్నతాధికారులను తీసుకెళ్ళచ్చు. అలాకాకుండా అంతా పార్టీ నేతలు, కార్యకర్తలనే తీసుకెళ్ళాలని అనుకున్నారు. అంటే డబుల్ బెడ్ రూం ఇళ్ళ పరిశీలన పేరుతో ఫక్తు రాజకీయం చేయటమే చేయటమే కిషన్ ప్లాన్ గా కనబడుతోంది. ఇదే సమయంలో వీళ్ళని అడ్డుకోవటం ద్వారా పోలీసులను ముందుపెట్టి అంతే రాజకీయానికి కేసీయార్ ప్రభుత్వం కూడా తెరలేపింది.
కిషన్ ప్లాన్ చూస్తుంటే బండి మరో నాలుగైదు మాసాలు ఇలాంటి గొడవలే చేయాలని అనుకుంటున్నట్లు అనుమానంగా ఉంది. కిషన్ ముందున్న సమస్య ఏమిటంటే బండికన్నా తాను ఎందులోను తీసిపోనని నిరూపించుకోవటమే. అందులో భాగంగానే ముందుగా డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణాల పరిశీలన అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం ఎందుకు వివాదాస్పదమవుతుందంటే ఈ నిర్మాణాల్లో ఇటు కేంద్ర అటు రాష్ట్రప్రభుత్వ నిధులన్నాయి కాబట్టే. అందుకనే ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ వివాదంలో నడుస్తునే ఉంటుంది. మరి కిషన్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమిటో చూడాలి.
This post was last modified on July 21, 2023 10:53 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…