అఖండ, వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్స్ తర్వాత హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్న బాలయ్య అభిమానులకు భగవంత్ కేసరి మీద మాములు అంచనాలు లేవు. టీజర్ వచ్చాక రెట్టింపయ్యాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ ఎంటర్ టైనర్ లో కాస్త వయసు మళ్ళిన పాత్రలో బాలకృష్ణ విశ్వరూపం చూస్తారని ఆల్రెడీ టాక్ ఉంది. వరుసగా మూడో ఛాన్స్ కొట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ హైప్ కు ఏ మాత్రం తగ్గకుండా స్కోర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే కథకు సంబంధించిన క్లూస్ మాత్రం ఇప్పటిదాకా బయటికి రాకుండా టీమ్ జాగ్రత్త పడింది.
తాజాగా ఒక లీక్ ఆసక్తి రేపేలా ఉంది. భగవంత్ కేసరి స్టోరీ లైన్ 1992లో వచ్చిన బాలీవుడ్ మూవీ ఖుదా గవాకు కొంత దగ్గరగా ఉంటుందని వినికిడి. ఆ సినిమాలో నాగార్జున కూడా నటించారు. అందులో ప్రేయసికిచ్చిన మాట కోసం శత్రువుని చంపిన అమితాబ్ బచ్చన్ మరో ప్రాణ స్నేహితుడి కోసం జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఇతనెవరో తెలియకుండానే కూతురు ఇంకో చోట పెరిగి పెద్దవుతుంది. బయటికొచ్చాక ఆమెను కాపాడటమే పెద్ద సవాల్ గా మారుతుంది. ఈ పాత్రను శ్రీదేవి చేసింది. వచ్చిన న్యూస్ ప్రకారం ఈ రెండు పాత్రల్లో బాలయ్య, శ్రీలీల కనిపిస్తారట.
నిజమో కాదో తెలియదు కానీ బాలకృష్ణ జైలుకు వెళ్లే ఎపిసోడ్స్, బయటికి వచ్చాక అడుగడుగునా శత్రువులతో ఫైట్ చేసే సన్నివేశాలు దగ్గరి పోలికనైతే చూపిస్తున్నాయి. అప్పట్లో ఇది పెద్ద హిట్టు. పాటలు ఛార్ట్ బస్టర్ అయ్యాయి. తెలుగులో కొండవీటి సింహంగా డబ్బింగ్ చేశారు. అక్టోబర్ మూడో వారంలో దసరా పండక్కు విడుదల కాబోతున్న భగవంత్ కేసరి టైగర్ నాగేశ్వరరావు, లియోలతో పోటీ పడనుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ భగవంత్ కేసరి ద్వారా అర్జున్ రామ్ పాల్ టాలీవుడ్ విలన్ గా పరిచయం కాబోతున్నాడు. బిజినెస్ సైతం బాలయ్య కెరీర్ హయ్యెస్ట్ కానుంది.
This post was last modified on July 21, 2023 10:01 am
https://www.youtube.com/watch?v=ddmpaI3WTvc
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ వేగంగా జరిగిపోతోంది. మార్చి 26 రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ హఠాత్తుగా మార్చి…
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మూవీస్ లో ఒకటిగా నిర్మాణంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్యాన్ ప్యాన్…
విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పీజీ వైద్య విద్యార్థిని బత్తుల దీపిక ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది.…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న జనసేన పార్టీ.. ఈ ఏడాది పార్టీ సభ్యత్వాన్ని గత నెలలోనే ప్రారంభించిన…
పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా నాయకులు పనిచేయాలని.. ఎమ్మెల్యేలు-ఎంపీలు కలివిడిగా ఉండాలని సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులకు సూచించారు. నంద్యాల…