ప్రస్తుతం ఇండియాలో బిగ్గెస్ట్ హీరో ఎవరంటే ప్రభాస్ అనే చెప్పాలి. ‘బాహుబలి’ తర్వాత అతను చేసిన మూడు సినిమాలూ డిజాస్టర్లే అయినా సరే.. వాటి బడ్జెట్, బిజినెస్, ఇతర విషయాలు చూస్తే తన రేంజ్ ఏంటో అర్థం అవుతుంది. మూడు డిజాస్టర్ల తర్వాత కూడా నిర్మాతలు, ట్రేడ్ వర్గాలు ప్రభాస్ మీద నమ్మకం కోల్పోలేదు. ‘సలార్’కు 700-800 కోట్ల మధ్య బిజినెస్ జరిగే రేంజ్ కనిపిస్తోంది. ‘ప్రాజెక్ట్-కే’ మీద అంచనాలు ఇంకా ఎక్కువే ఉన్నాయి.
అది ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కబోయే చిత్రం. బిజినెస్ కూడా అందుకు తగ్గట్లే రికార్డు స్థాయిలో జరిగేలాగే కనిపిస్తోంది. ఇంత బడ్జెట్, ఇంత అంచనాలతో ముడిపడ్డ సినిమా నుంచి నిన్న రిలీజ్ చేసిన ప్రభాస్ ఫస్ట్ లుక్ చూసి అభిమానులే కాక అందరూ షాకైపోయారు. టీంలో ఏ ఒక్కరికీ ఇది బాగా లేదు అనిపించలేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
‘ప్రాజెక్ట్-కే’లో ప్రభాస్ ఫస్ట్ లుక్ ఎంతమాత్రం రియల్గా అనిపించడం లేదు. దాన్ని ఎవరు డిజైన్ చేశారో కానీ.. ఏమాత్రం ప్రొఫెషనలిజం కనిపించడం లేదు. ప్రాజెక్ట్-కే మీద అభిమానులు తమకు ఉన్న అంచనాలతో తమ క్రియేటివిటీ చూపిస్తూ గత కొన్ని నెలల్లో ప్రభాస్ లుక్ను రకరకాలుగా డిజైన్ చేశారు. కొందరు అతణ్ని సైంటిస్ట్ అవతారంలో చూపిస్తే.. ఇంకొందరు హాలీవుడ్ సూపర్ హీరో క్యారెక్టర్లలోకి మార్చారు. ఐరెన్ మ్యాన్ అవతారంలో ప్రభాస్ను చూపిస్తూ చేసిన ఫ్యాన్ ఎడిట్స్ చూస్తే ఔరా అనిపించకమానదు.
ఇప్పుడు ‘ప్రాజెక్ట్-కే’ టీం వదిలిన లుక్ను… ఫ్యాన్ మేడ్ పోస్టర్లను పక్కన పెట్టి చూస్తే వాటి ముందు ఇది తేలిపోతోంది. నిన్న రాత్రి నుంచి అభిమానులు ఫీలవుతున్న విషయం ఇదే. ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్లు వందల సంఖ్యలో ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ‘ఆదిపురుష్’కు సంబంధించి టీజర్ రిలీజైనపుడు ఎలాంటి నెగెటివిటీ కనిపించిందో.. ఇప్పుడు ‘ప్రాజెక్ట్-కే’ ఫస్ట్ లుక్ విషయంలోనూ అలాంటి వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. ఇక ముందు రిలీజ్ చేసే ప్రోమోలతో మెప్పించకుంటే మాత్రం ‘ఆదిపురుష్’లా ఇదీ నెగెటివిటీని ఎదుర్కోక తప్పదు.
This post was last modified on July 20, 2023 6:05 pm
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…