ఇంకో బాక్సాఫీస్ సమరానికి తెరలేచింది. రేపు జూలై 21 కౌంట్ భారీగా ఉండబోతోంది. ఇది ముందుగానే గుర్తించిన ‘హిడింబ’ ఒక రోజు ముందుగా గురువారమే తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఒక డిఫరెంట్ హారర్ థ్రిలరనే టాక్ ప్రీమియర్ల నుంచి వచ్చింది కానీ అసలైన పబ్లిక్ తీర్పు ఇవాళ రానుంది. మిగిలినవి మాత్రం క్లాష్ కి సై అంటూ రంగంలోకి దిగుతున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోదగినది విజయ్ ఆంటోనీ ‘హత్య’. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ నెలల తరబడి వాయిదా పడుతూ ఎట్టకేలకు రిలీజ్ కు వచ్చింది. ఈ టీమ్ బిచ్చగాడు బ్రాండ్ నే నమ్ముకుంటోంది.
‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ మీద అంచనాలేం లేవు కానీ యూనిట్ మాత్రం అన్ని వర్గాలను మెప్పిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తోంది. సురేష్ సంస్థ అండదండలు ఉండటంతో థియేటర్ల పరంగా మద్దతు దక్కింది. రుహాని శర్మ ప్రధాన పాత్రలో రూపొందిన ‘హర్ చాఫ్టర్ 1′ రేపే రానుంది. తనే విశ్వక్ సేన్ తో నటించిన హిట్ ఛాయలు కనిపిస్తున్నాయి. పబ్లిసిటీ వీక్ గా జరుగుతోంది.’అలా ఇలా ఎలా’ అంటూ వెరైటీ టైటిల్ తో మరో సినిమా బరిలో దిగుతోంది. నాతో నేను, ఒక్కడే వీరుడు, డిటెక్టివ్ కార్తిక్ వస్తున్న విషయమే జనాలకు తెలియదు. కాజల్ అగర్వాల్ ని నమ్ముకుని డబ్బింగ్ మూవీ ‘కార్తీక’ను తెస్తున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే మూవీ లవర్స్ మాత్రం ‘ఒప్పెన్ హెయిమర్’ మీద కన్నేశారు. బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి. ‘బార్బీ’ మీద కూడా ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఆసక్తి కనిపిస్తోంది. ఈ రెండు ఇండియా వైడ్ అడ్వాన్స్ సేల్స్ లో ముందున్నాయి. ఇన్ని ఆప్షన్లు ఉన్నప్పటికీ టాలీవుడ్ జనాలు మాత్రం రివ్యూలు, టాక్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కేవలం వారం గ్యాప్ లో పవన్ కళ్యాణ్ బ్రో పెట్టుకుని ఆలోగానే వీలైనంత రాబట్టుకోవాలని చిన్న సినిమాలన్నీ ఇలా పోటెత్తున్నాయి. వీటిలో రెండో మూడో బాగున్నాయనిపించుకుంటే థియేటర్లు కళకళలాడతాయి.
This post was last modified on July 20, 2023 12:08 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…