హిరణ్యకశ్యప.. టాలీవుడ్లో చాలా ఏళ్ల నుంచి చర్చల్లో ఉన్న సినిమా. ‘రుద్రమదేవి’ లాంటి భారీ చిత్రం తీసి మెప్పించిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్.. దాని తర్వాత చేయాలనుకున్న ప్రాజెక్టు ‘హిరణ్య కశ్యప’నే.. ఈ చిత్రాన్ని ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్లో తీయబోతున్నట్లు, అందుకోసం ప్రి ప్రొడక్షన్ పనులు కూడా చేస్తున్నట్లు కూడా చాన్నాళ్ల పాటు చెబుతూ వచ్చాడు గుణ.
కానీ ఈ సినిమాను గుణశేఖర్ దర్శకత్వంలో నిర్మించడానికి ముందు బాగా ఆసక్తి చూపించిన సురేష్ బాబు తర్వాత ఎందుకో వెనక్కి తగ్గారు. గుణశేఖర్ శాకుంతలం మీదికి వెళ్లిపోయాడు. కట్ చేస్తే తర్వాత సురేష్ బాబు తర్వాత పెద్ద షాక్ ఇచ్చారు. హిరణ్య కశ్యప సినిమా తమ ప్రొడక్షన్లోనే తెరకెక్కుతుందని.. కానీ దర్శకుడు వేరు అని ఆయన వెల్లడించారు. ఆ తర్వాత నెలలు గడిచినా ఈ ప్రాజెక్టుపై ఏ అప్డేట్ లేదు.
ఐతే ఇప్పుడు ఎట్టకేలకు హిరణ్యకశ్యపపై కీలక అప్డేట్ బయటికి వచ్చింది. రానానే ఇందులో హిరణ్యకశ్యపుడి పాత్ర పోషించబోతున్నాడు. స్వయంగా అతనే ఈ ప్రాజెక్టును ప్రకటించాడు. హాలీవుడ్ వేదికగా జరుగుతున్న కామిక్ కాన్ ఫెస్టివల్ కోసం యుఎస్ వెళ్లిన రానా.. అక్కడే హిరణ్యకశ్యప సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాలో తనే లీడ్ రోల్ చేయనున్నట్లు చెప్పాడు.
ఈ సినిమా అమర్ చిత్రకథల స్ఫూర్తితో తెరకెక్కనున్నట్లు వెల్లడించాడు. అన్నింటికీ మించి పెద్ద విశేషం ఏంటంటే.. ఈ సినిమాకు స్క్రిప్టు అందిస్తున్నది స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అట. ఆ విషయం కూడా రానానే ప్రకటించాడు. మరి ఈ మెగా మూవీకి దర్శకుడు ఎవరు అన్నది ఆసక్తికరం. ఈ ప్రాజెక్ట్ స్కేల్ ప్రకారం చూస్తే ఎవరైనా పెద్ద దర్శకుడు తీస్తేనే దాని స్థాయి వేరుగా ఉంటుంది. మరి ఆ బాధ్యత ఎవరు చేపడతారో చూడాలి.
This post was last modified on July 19, 2023 11:25 pm
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…