హిరణ్యకశ్యప.. టాలీవుడ్లో చాలా ఏళ్ల నుంచి చర్చల్లో ఉన్న సినిమా. ‘రుద్రమదేవి’ లాంటి భారీ చిత్రం తీసి మెప్పించిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్.. దాని తర్వాత చేయాలనుకున్న ప్రాజెక్టు ‘హిరణ్య కశ్యప’నే.. ఈ చిత్రాన్ని ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్లో తీయబోతున్నట్లు, అందుకోసం ప్రి ప్రొడక్షన్ పనులు కూడా చేస్తున్నట్లు కూడా చాన్నాళ్ల పాటు చెబుతూ వచ్చాడు గుణ.
కానీ ఈ సినిమాను గుణశేఖర్ దర్శకత్వంలో నిర్మించడానికి ముందు బాగా ఆసక్తి చూపించిన సురేష్ బాబు తర్వాత ఎందుకో వెనక్కి తగ్గారు. గుణశేఖర్ శాకుంతలం మీదికి వెళ్లిపోయాడు. కట్ చేస్తే తర్వాత సురేష్ బాబు తర్వాత పెద్ద షాక్ ఇచ్చారు. హిరణ్య కశ్యప సినిమా తమ ప్రొడక్షన్లోనే తెరకెక్కుతుందని.. కానీ దర్శకుడు వేరు అని ఆయన వెల్లడించారు. ఆ తర్వాత నెలలు గడిచినా ఈ ప్రాజెక్టుపై ఏ అప్డేట్ లేదు.
ఐతే ఇప్పుడు ఎట్టకేలకు హిరణ్యకశ్యపపై కీలక అప్డేట్ బయటికి వచ్చింది. రానానే ఇందులో హిరణ్యకశ్యపుడి పాత్ర పోషించబోతున్నాడు. స్వయంగా అతనే ఈ ప్రాజెక్టును ప్రకటించాడు. హాలీవుడ్ వేదికగా జరుగుతున్న కామిక్ కాన్ ఫెస్టివల్ కోసం యుఎస్ వెళ్లిన రానా.. అక్కడే హిరణ్యకశ్యప సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాలో తనే లీడ్ రోల్ చేయనున్నట్లు చెప్పాడు.
ఈ సినిమా అమర్ చిత్రకథల స్ఫూర్తితో తెరకెక్కనున్నట్లు వెల్లడించాడు. అన్నింటికీ మించి పెద్ద విశేషం ఏంటంటే.. ఈ సినిమాకు స్క్రిప్టు అందిస్తున్నది స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అట. ఆ విషయం కూడా రానానే ప్రకటించాడు. మరి ఈ మెగా మూవీకి దర్శకుడు ఎవరు అన్నది ఆసక్తికరం. ఈ ప్రాజెక్ట్ స్కేల్ ప్రకారం చూస్తే ఎవరైనా పెద్ద దర్శకుడు తీస్తేనే దాని స్థాయి వేరుగా ఉంటుంది. మరి ఆ బాధ్యత ఎవరు చేపడతారో చూడాలి.
This post was last modified on July 19, 2023 11:25 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…