‘కస్టడీ’ తో నిరాశ పరిచిన నాగ చైతన్య నెక్స్ట్ చందూ మొండేటి డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ‘తండేల్(వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు. ఇంకా ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ను అల్లు అరవింద్ దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇప్పటికే కథ పూర్తయింది. కార్తీక్ అనే రైటర్ అందించిన కథతో ఈ సినిమా తెరకెక్కనుంది.
ప్రస్తుతం చందూ మొండేటి మిగతా కాస్టింగ్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. చైతు సరసన కీర్తి సురేష్ ను హీరోయిన్ గా అనుకుంటున్నారు. దసరాలో వెన్నెల పాత్రను పోలి ఉండటంతో ఈ సినిమాకు ఆమె పర్ఫెక్ట్ అని, అలాగే చైతుకి కూడా కొత్త కాంబినేషన్ గా ఉంటుందని భావిస్తున్నారట. డేట్స్ అడ్జస్ట్ అయితే కీర్తిను ఫిక్స్ చేసుకోవడం ఖాయం.
ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుద్ ను తీసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అనిరుద్ ఫిక్స్ అయితే బడ్జెట్ మరో పది కోట్లు పెరగనుంది. అనిరుద్ కాకుంటే రెహ్మాన్ లాంటి అగ్ర సంగీత దర్శకుల వైపు చూస్తున్నారు. శ్రీకాకుళంలో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ తో ఫిక్షనల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందని ఇన్సైడ్ టాక్. శ్రీకాకుళం నుండి గుజరాత్ వలస వెళ్ళిన మత్స్య కారుడిగా చైతు కనిపించనున్నాడు.
ప్రస్తుతం చై తన లుక్ పై శ్రద్ద తీసుకుంటూ వర్క్ చేస్తున్నాడు. ఇప్పటి వరకూ చైతు ని చూడని విధంగా ప్రెజెంట్ చేసేందుకు చందూ మొండేటి ప్రయత్నిస్తున్నాడు. కార్తికేయ 2 తర్వాత చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. ఈ సినిమా చైతు కి బిగ్గెస్ట్ హిట్ ఇస్తుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
This post was last modified on July 19, 2023 11:01 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…