‘కస్టడీ’ తో నిరాశ పరిచిన నాగ చైతన్య నెక్స్ట్ చందూ మొండేటి డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ‘తండేల్(వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు. ఇంకా ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ను అల్లు అరవింద్ దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇప్పటికే కథ పూర్తయింది. కార్తీక్ అనే రైటర్ అందించిన కథతో ఈ సినిమా తెరకెక్కనుంది.
ప్రస్తుతం చందూ మొండేటి మిగతా కాస్టింగ్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. చైతు సరసన కీర్తి సురేష్ ను హీరోయిన్ గా అనుకుంటున్నారు. దసరాలో వెన్నెల పాత్రను పోలి ఉండటంతో ఈ సినిమాకు ఆమె పర్ఫెక్ట్ అని, అలాగే చైతుకి కూడా కొత్త కాంబినేషన్ గా ఉంటుందని భావిస్తున్నారట. డేట్స్ అడ్జస్ట్ అయితే కీర్తిను ఫిక్స్ చేసుకోవడం ఖాయం.
ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుద్ ను తీసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అనిరుద్ ఫిక్స్ అయితే బడ్జెట్ మరో పది కోట్లు పెరగనుంది. అనిరుద్ కాకుంటే రెహ్మాన్ లాంటి అగ్ర సంగీత దర్శకుల వైపు చూస్తున్నారు. శ్రీకాకుళంలో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ తో ఫిక్షనల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందని ఇన్సైడ్ టాక్. శ్రీకాకుళం నుండి గుజరాత్ వలస వెళ్ళిన మత్స్య కారుడిగా చైతు కనిపించనున్నాడు.
ప్రస్తుతం చై తన లుక్ పై శ్రద్ద తీసుకుంటూ వర్క్ చేస్తున్నాడు. ఇప్పటి వరకూ చైతు ని చూడని విధంగా ప్రెజెంట్ చేసేందుకు చందూ మొండేటి ప్రయత్నిస్తున్నాడు. కార్తికేయ 2 తర్వాత చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. ఈ సినిమా చైతు కి బిగ్గెస్ట్ హిట్ ఇస్తుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
This post was last modified on July 19, 2023 11:01 pm
వైసీపీ చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక రాజకీయాలను మంత్రులు అస్సలు ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎక్కడా వెనుకాడవద్దని ఆయన…
అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్, అమరావతి నిర్మాణం గురించి వచ్చిన కథనం…
జైలులో శిక్ష అనుభవిస్తున్న కొందరు వీఐపీ ఖైదీలు అక్కడ కూడా రాజభోగాలు అనుభవిస్తున్న ఘటనలు అనేకం చూశాం. జైలులోనే ఫైవ్…
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…