థియేట్రికల్ రిలీజ్ను స్కిప్ చేసి హాట్ స్టార్లో నేరుగా రిలీజ్ చేసిన సినిమాకు ఇంకా థియేట్రికల్ రిలీజ్ ఏంటి అని.. ఈ హెడ్డింగ్ చూసి ఆశ్చర్యం కలుగుతోందా? ఇది నిజం.
ఇండియాలో థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటే అప్పుడు ఈ చిత్రాన్ని వాటిలో ప్రదర్శిస్తే ప్రదర్శించొచ్చు కానీ.. ఈలోపే సుశాంత్ చివరి సినిమాను వెండితెరపై చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఆ అవకాశం న్యూజిలాండ్లోని భారతీయ సినీ ప్రేక్షకులకు దక్కుతోంది.
కరోనా దేశంలోకి అడుగు పెట్టి కూడా.. దాని ప్రభావం నుంచి చాలా త్వరగా, తక్కువ నష్టంతో బయటపడ్డ దేశాల్లో న్యూజిలాండ్ పేరే ముందు చెప్పుకోవాలి. కట్టుదిట్టమైన చర్యలతో, ప్రజల క్రమశిక్షణతో అక్కడి నుంచి కరోనాను పారదోలారు.
న్యూజిలాండ్ కరోనా ఫ్రీ కంట్రీగా మారి మూడు నెలలు దాటింది. అక్కడ ఆల్రెడీ థియేటర్లు సహా అన్నీ తెరిచారు. బాలీవుడ్ పాత, కొత్త సినిమాలు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే సుశాంత్ చివరి సినిమా ‘దిల్ బేచారా’ను వెండితెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
దీని తర్వాత ఆస్ట్రేలియాలో సైతం ‘దిల్ బేచారా’ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కరోనా ప్రభావం తక్కువగా ఉండి, థియేటర్లు నడుస్తున్న వివిధ దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలున్నాయి.
ఇండియాలో ఈ ఏడాది ఆఖరుకు థియేటర్లు తెరుచుకుంటాయని భావిస్తున్నారు. అప్పుడు ఈ చిత్రాన్ని సెలక్టివ్గా థియేటర్లలో రిలీజ్ చేసే అవకాశముంది. గత 24న హాట్ స్టార్లో రిలీజైన ‘దిల్ బేచారా’ అద్భుతమైన స్పందన రాబట్టుకున్న సంగతి తెలిసిందే.
This post was last modified on August 15, 2020 10:36 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…