Movie News

బ్రో ప్రీ రిలీజ్ .. అతిథి ఎవరంటే

ఇంకో పన్నెండు రోజుల్లో విడుదల కాబోతున్న బ్రో ప్రమోషన్ల పట్ల అభిమానుల అసంతృప్తి కొనసాగుతూనే ఉంది. వారాహి యాత్ర సక్సెస్ కావడంతో  అందరూ పవన్ స్పీచ్ లను ఆస్వాదించే మూడ్ లో ఉన్నారు. దీని వల్ల బ్రో మీద ఆశించిన స్థాయిలో బజ్ రావడం లేదు. ముఖ్యంగా వదిలిన రెండు పాటలు కనీస అంచనాలు అందుకోలేకపోవడం మరో దెబ్బ కొట్టింది. దర్శకుడు సముతిరఖని చివరి దశలో ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటంతో బయటికి రావడం లేదు. నిర్మాత నాగవంశీ దీంతో పాటు గుంటూరు కారం చూసుకుంటూ తీరిక దొరికే పరిస్థితిలో లేరు.

ఇదంతా ఎలా ఉన్నా కీలకమైన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రంగం సిద్ధమయ్యింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో 25 సాయంత్రం గ్రాండ్ గా ఈ వేడుక నిర్వహించబోతున్నారు. ఛీఫ్ గెస్టుగా ఎవరు వస్తారనే విషయం మీద పెద్దగా సస్పెన్స్ అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ తో పాటు సినిమాలో నటించిన తారాగణం తప్ప ఇంకెవరూ ముఖ్య అతిథులు ఉండరని ఇప్పటిదాకా ఉన్న అప్ డేట్. ఎవరు వచ్చినా మూవీతో పాటు జనసేన గురించి ప్రస్తావించాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళను ఇబ్బంది పెట్టడం కన్నా కేవలం క్యాస్టింగ్ కే పరిమితం చేయాలని పవన్ కోరినట్టు ఇన్ సైడ్ టాక్.

బిజినెస్ మాత్రం క్రేజీగానే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇంకో రెండు మూడు రోజుల్లో రేట్లు అగ్రిమెంట్లు పూర్తవుతాయి. బయ్యర్లు ఆఫర్ చేస్తున్న మొత్తం చూస్తుంటే టికెట్ రేట్లు పెంచుకుంటేనే వర్కౌట్ అయ్యేలా ఉంది. మరి ఏపీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా పవన్ ఏం చెబుతారో చూడాలి. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లు హైక్ లేకపోయినా తొంబై కోట్ల దాకా రాబట్టాయి. బ్రో సైతం ఇదే దారి పట్టక తప్పేలా లేదు. సాయి ధరమ్ తేజ్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా ప్రియా వారియర్ చెల్లి పాత్రలో కనిపించనుంది. త్రివిక్రమ్ రచన మీదే అందరి చూపంతా 

This post was last modified on July 17, 2023 6:30 am

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

6 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

6 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

7 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

8 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

8 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

8 hours ago