Movie News

వివాదంలో సాయి ధరమ్ తేజ్

పవన్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ల కాంబోలో తెరకెక్కిన ‘బ్రో’ చిత్రం ఈ నెల 28న విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తేజూ శ్రీకాళహస్తి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వెళ్లారు. తన చిత్రం ఘన విజయం సాధించాలని ప్రార్థించారు. అయితే, ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ వివాదంలో చిక్కుకున్నారు. శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో పూజల సందర్భంగా స్వామికి సాయి ధరమ్ తేజ్ స్వయంగా హారతి ఇచ్చిన వైనం వివాదానికి దారి తీసింది. దీంతో, నిబంధనలకు విరుద్ధంగా స్వామికి హారతి ఇచ్చిన తేజూపై పండితులు, భక్తులు మండిపడుతున్నారు.

దేవుడికి హారతిచ్చేందుకు సాయి ధరమ్ తేజ్ కు అనుమతిని ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఉపాలయంలోని చంగల్ రాయ స్వామిని తేజూ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేతికి హారతి పళ్లాన్ని ఆలయ అర్చకులు ఇచ్చారు. స్వామి వారికి స్వయంగా తేజూతో అర్చకులు హారతి ఇప్పించారు. దీంతో, ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ నిబంధనలను, ఆచారాలను పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. ఇతరులు పూజలు చేయడం ఇక్కడ నిషిద్ధం అని, తేజూ ఎలా చేస్తారని కొందరు పూజారులు కూడా ప్రశ్నిస్తున్నారు.

అంతకుముందు, క‌డ‌పలోని పెద్ద ద‌ర్గాలో తేజూ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. ఇది త‌నకు దేవుడిచ్చిన పున‌ర్జ‌న్మ అని అన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే త‌న‌కు ప్రాణమని, ఆయ‌న‌తో క‌లిసి న‌టించ‌డం జీవితంలో మ‌ర‌చిపోలేని అనుభూతి అని చెప్పారు. ఇది ఓ అదృష్టం అని ఆనందం వ్యక్తం చేశారు. అయితే, రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉంటేనే రాజ‌కీయ ప్ర‌వేశం చేయాల‌ని ప‌వ‌న్ మామ‌య్య చెప్పార‌ని, అటు వైపు వెళ్లే ఆలోచ‌న తనకు లేదని అన్నారు. మరో రెండు వారాల్లో బ్రో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇలా చేశావేంటి బ్రో అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

This post was last modified on July 15, 2023 3:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

15 minutes ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

40 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

42 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

1 hour ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

3 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago