Movie News

బిచ్చగాడి మీద భారం వేసిన హత్య

తెలుగు రాష్ట్రాల్లో విజయ్ ఆంటోనీ క్రేజ్ పెద్దగా లేకపోయినా బిచ్చగాడు బ్రాండ్ వేల్యూ మాత్రం చాలా పెద్దది. ఎంతగా అంటే ఆ మధ్య సీక్వెల్ రిలీజైతే ఒరిజినల్ తమిళనాడు కన్నా ఏపీ తెలంగాణలో కలెక్షన్లు ఎక్కువొచ్చాయి. దెబ్బకు అతను టీమ్ తో సహా తెలుగు రాష్ట్రాల్లోనే ఉండిపోయి విస్తృతంగా ప్రమోషన్లు చేసుకున్నాడు. సీక్వెల్ కూడా ప్లానింగ్ లో ఉంది. ఇదిలా ఉండగా ఇతని కొత్త సినిమా హత్య వచ్చే వారం జూలై 21 విడుదలకు రెడీ అవుతోంది. సురేష్, ఏషియన్ సంస్థలు సంయుక్తంగా అందించబోతున్నాయి. థియేటర్లు కూడా గట్టిగానే ప్లాన్ చేశారట.

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందిన హత్య నెలల క్రితమే పూర్తయ్యింది. ఏవో కారణాల వల్ల వాయిదా వేసుకుంటూ వచ్చారు. రితికా సింగ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సీనియర్ నటి రాధికా కీలక పాత్ర పోషించారు. అప్పుడెప్పుడో ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు చిన్న టీజర్ లాంటిది వదిలి హడావిడి చేశారు కానీ ఆ తర్వాత పూర్తిగా వదిలేశారు. బాలాజీ కుమార్ దర్శకత్వం వహించగా గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం అందించారు. మురళి శర్మ లాంటి తెలుగు నటులు కూడా ఉన్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ తక్కువ టైంలో హైప్ తీసుకురావడం పెద్ద సవాలే.

సోమవారం నుంచి విజయ్ ఆంటోనీ మళ్ళీ హైదరాబాద్ వచ్చి హత్యను ప్రమోట్ చేసుకోబోతున్నాడు. చేతిలో కేవలం ఆరు రోజులు మాత్రమే ఉంది. ఆపై 28న పవన్ కళ్యాణ్ బ్రో వచ్చేస్తుంది కాబట్టి వీలైనంత రాబట్టుకుని సేఫ్ అవ్వాలి. మొత్తం థియేటర్లన్నీ దానికే ఇవ్వకపోయినా జనాల దృష్టి బ్రో మీదే ఉంటుంది. హత్యకు పాజిటివ్ టాక్ వస్తే ఇబ్బంది లేదు కానీ ఏ మాత్రం అటుఇటు అయినా లెక్కలు మారిపోతాయి. బిచ్చగాడు పేరుతో ఏళ్ళ తరబడి తెలుగు డబ్బింగులు బిజినెస్ చేస్తున్న విజయ్ ఆంటోనీకి అది తప్ప వేరే సినిమా హిట్ అయిన దాఖలాలు లేకపోవడం అసలు ట్విస్టు. 

This post was last modified on July 15, 2023 1:03 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

4 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

5 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

5 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

5 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

6 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

6 hours ago