ఇప్పుడు భారతీయ సినీ సంగీత ప్రియులందరిదీ ఒకటే కోరిక. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఏం కాకూడదు. ఆయన కోలుకోవాలి. ఇంటికి తిరిగి రావాలి. సంపూర్ణ ఆరోగ్యవంతుడై మళ్లీ మన కోసం పాట పాడాలి. దేశంలో ఎంతోమందిని బలిగొని, ఎన్నో జీవితాల్ని నాశనం చేసిన కరోనా మహమ్మారి బాలును కూడా సోకింది. ముందు తనకేం కాలేదని.. కొన్ని రోజుల్లో డిశ్చార్జ్ అయిపోతానని బాలునే స్వయంగా వీడియో సందేశం ఇవ్వడంతో ఏం పర్వాలేదులే అనుకున్నారంతా. కానీ శుక్రవారం సాయంత్రం వచ్చిన అప్ డేట్ అంరదినీ కలవరపాటుకు గురి చేసింది. బాలు పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెన్నైలో ఆయన చికిత్స పొందుతున్న ఎంజీఎం హెల్త్ కేర్ హాస్పిటల్ ప్రకటించింది. ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
బాలు లైఫ్ సపోర్ట్ మీద ఉన్నారన్న వార్త అందరినీ కుంగుబాటుకు గురి చేసింది. దీంతో ఆయన కోసం అందరూ ప్రార్థిస్తున్నారు. ఆయన వాస్తవ పరిస్థితి ఏంటా అని ఆందోళన చెందుతున్నారు. ఐతే ఈ ఆందోళనను కొంత తగ్గిస్తూ బాలు కొడుకు ఎస్పీ చరణ్ ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టారు. బాలు పరిస్థితి కొంచెం క్రిటికల్ అయినప్పటికీ.. ఎంజీఎం ఆసుపత్రి వైద్యుల రక్షణలో ఆయన ఉన్నారని.. మరీ కంగారు పడాల్సిన పరిస్థితి లేదని.. ఆయన కోలుకుని అతి త్వరలోనే బయటికి వస్తారని ధీమా వ్యక్తం చేశాడు చరణ్. బాలు ఇతర కుటుంబ సభ్యులు సైతం ఆయన పరిస్థితి మరీ విషమంగా ఏమీ లేదని తమను సంప్రదించిన వారికి చెబుతున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి చరణ్ అందరికీ ధైర్యం చెప్పడానికి ఈ మాటలన్నారా.. నిజంగా బాలు పరిస్థితి పర్వాలేదా అన్నది సమయం గడిచాక కానీ తెలియదు. కరోనా లక్షణాలతో బాలు ఈ నెల 5న ఆస్పత్రిలో చేరారు.
This post was last modified on August 15, 2020 12:21 am
అడిగింతే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…