రైట్‍ టైమ్‍లో మకాం మార్చేసింది!

లాక్‍ డౌన్‍కి ముందు రకుల్‍ ప్రీత్‍ సింగ్‍ డిమాండ్‍లో లేదు. చిన్న సినిమాలకు కూడా ఆమెను కన్సిడర్‍ చేసే పరిస్థితి లేదు. నిజానికి రకుల్‍ ప్రీత్‍ సింగ్‍ మంచి ఫామ్‍లో వుండగానే సడన్‍గా అవకాశాలు కోల్పోయింది. నెమ్మదిగా కనిపించకుండా పోయింది. తమిళ చిత్రాలు, హిందీ సినిమాలు కొన్ని చేసినా కానీ తెలుగునాట వచ్చిన పాపులారిటీ ఆమెకి మరెక్కడా రాలేదు.

అందుకే లాక్‍ డౌన్‍ టైమ్‍లో మిగిలిన హీరోయిన్లు ఇప్పట్లో సెట్స్కి రాలేమంటూ నిర్మాతలకు చెప్పేస్తున్న తరుణంలో రకుల్‍ ప్రీత్‍ సింగ్‍ హైదరాబాద్‍కి మకాం మార్చేసింది. ఆమె అనుకున్నట్టుగానే ఈ మూవ్‍ భలేగా వర్కవుట్‍ అయింది. సాయి ధరమ్‍ తేజ్‍ తమ్ముడి చిత్రంలో కథానాయికగా అవకాశం వచ్చింది. క్రిష్‍ నిర్మిస్తున్న ఈ చిత్రంలో యువ హీరో సరసన సీనియర్‍ ఎందుకు అనుకోకుండా, రకుల్‍ ప్రీత్‍ సింగ్‍ వల్ల పుల్‍ పెరుగుతుందని ఆమెను ఫిక్స్ చేసేసారు.

అలాగే నితిన్‍ ‘చెక్‍’లో కూడా రకుల్‍ ప్రీత్‍ సింగ్‍ నటిస్తోంది. మరోసారి నాగ చైతన్యతో జత కట్టనుందని కూడా వినిపిస్తోంది. విక్రమ్‍ కుమార్‍ తీసే సినిమాలో రకుల్‍ ప్రీత్‍ సింగ్‍ పేరు పరిశీలిస్తున్నారని సమాచారం. కేవలం లోకల్‍గా వచ్చేసి, అందుబాటులో వుండడమే కాకుండా పారితోషికం పరంగా పట్టువిడుపులు వుండడం రకుల్‍కి ప్లస్‍ అవుతోంది.