ఇంకో రెండు వారాల్లోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా బ్రో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మధ్య ప్రతి పెద్ద సినిమాకూ తెలంగాణలోనే కాక ఏపీలో కూడా టికెట్ల ధరల పెంపుకి అనుమతి ఇస్తున్నారు. అలాగే స్పెషల్ షోలకు కూడా పర్మిషన్ ఇస్తున్నారు. గత నెలలో ప్రభాస్ సినిమా ఆదిపురుష్కు కూడా ఈ సౌలభ్యం దక్కింది. ఏపీలో 20 శాతం షూటింగ్ చేస్తేనే ఈ సౌలభ్యాలు అంటూ ఇంతకుముందు ఇచ్చిన జీవోనేమీ పట్టించుకోవడం లేదు.
అలాంటపుడు పవన్ సినిమాకు కూడా రేట్ల పెంపు, అదనపు షోలకు అవకాశం ఇవ్వాల్సిందే. కానీ జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవన్ సినిమాలను ఎలా టార్గెట్ చేస్తున్నారో తెలిసిందే. కేవలం వకీల్ సాబ్ అనే సినిమాను దెబ్బ కొట్టే క్రమంలో పాత జీవోలేవో చూపించి మొత్తంగా అన్ని సినిమాలకూ టికెట్ల ధరలు తగ్గించేయడం.. ఏడాదికి పైగా ఈ వ్యవహారాన్ని సాగదీసి చివరికి ఇండస్ట్రీ ప్రముఖులు వచ్చి విన్నపాలు చేశాక కానీ రేట్ల పెంపుకి అవకాశం ఇవ్వకపోవడం గుర్తుండే ఉంటుంది.
నిబంధనలు మారాక రిలీజవుతున్న పవన్ సినిమా బ్రోనే. మరి ఈ సినిమా విషయంలో ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మామూలుగానే పవన్ అంటే జగన్కు, వైసీపీ వాళ్లకు పడదు. పైగా ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ మీద పవన్ చేసిన వ్యాఖ్యలతో జనసేనాని మీద మరింత మంటెత్తిపోతున్నారు. ఈ వ్యవహారం రెండు రోజులుగా ఏపీలో కాక రేపుతోంది. దీంతో పవన్ సినిమాను టార్గెట్ చేయడం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రేట్ల పెంపు, అదనపు షోల విషయంలో అడ్డంకులు సృష్టించడమే కాక.. సినిమా ప్రదర్శనలకూ ఇబ్బందులు కలిగేలా చేస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇలా కక్షపూరిత రాజకీయాలు చేస్తే ప్రజల్లోకి వేరే సంకేతాలు వెళ్తాయి. జనసైనికులు రగిలిపోతారు. వారిలో కసి పెరుగుతుంది. అలాగే వకీల్ సాబ్ రోజుల నుంచి పవన్ను ఎలా ఇబ్బంది పెడుతున్నదీ జనానికి మళ్లీ గుర్తు చేసినట్లవుతుంది. అది జగన్ సర్కారుకు చేటే అనడంలో సందేహం లేదు.
This post was last modified on October 8, 2023 4:36 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…