తమిళ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకడైన అజిత్ కుమార్కు వివాద రహితుడిగా పేరుంది. చాలామంది స్టార్ హీరోల్లా అతను హడావుడి చేయడు. సినిమాల్లో నటించడం.. ఇంటికి పరిమితం కావడం.. అంతే అన్నట్లు ఉంటాడు. మీడియా ముందుకే రాడు. కనీసం తన సినిమాల ప్రమోషన్లలో కూడా కనిపించడు. నిర్మాతలకు అత్యంత సహకారం అందించే హీరోగా కూడా అజిత్కు పేరుంది.
అలాంటి హీరో మీద మాణిక్యం నారాయణన్ అనే సీనియర్ నిర్మాత సంచలన ఆరోపణలు చేశాడు. అందరూ అనుకున్నట్లు అజిత్ జెంటిల్మ్యాన్ కాదని.. అతను మోసగాడని.. తనను మోసం చేశాడని మాణిక్యం ఆరోపించాడు. కొన్నేళ్ల ముందు తన తల్లిదండ్రులను విదేశీ యాత్రకు పంపించేందుకు గాను అజిత్ తన దగ్గర డబ్బు తీసుకున్నాడని.. ఆ సందర్భంగా తనకు సినిమా చేస్తానని హామీ ఇచ్చాడని.. తాను ఇచ్చిన డబ్బునే రెమ్యూనరేషన్ అడ్వాన్సుగా తీసుకున్నట్లు తాను భావించానని మాణిక్యం తెలిపాడు.
కానీ అజిత్ తర్వాత తనకు సినిమానే చేయలేదని.. డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని మాణిక్యం ఆరోపించాడు. ఏళ్లు గడుస్తున్నా ఈ డబ్బు సంగతే అజిత్ మాట్లాడట్లేదని.. 50 కోట్లకు పైగా పారితోషకం తీసుకునే అజిత్కు ఇలా మోసం చేయడం ఏంటి అని మాణిక్యం ప్రశ్నించాడు. ఐతే గతంలో కమల్ హాసన్తో వేట్టయాడు విలయాడు సహా కొన్ని పెద్ద సినిమాలు నిర్మించిన మాణిక్యం.. ఈ మధ్య అటెన్షన్ కోసం, వార్తల్లో నిలిచేందుకు ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తున్నాడనే విమర్శలు ఉన్నాయి. షారుఖ్ ఖాన్తో అట్లీ తీసిన జవాన్ సినిమా తన నిర్మాణంలో వచ్చిన పేరరసుకు కాపీ అంటూ ఆ మధ్య ఆయన కోర్టుకు ఎక్కడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…