సినిమాను ప్రమోట్ చేసుకోవడం ఒక కళని ఊరికే అనలేదు పెద్దలు. ముఖ్యంగా డబ్బింగ్ మూవీస్ కి ఇది చాలా కీలకం. ఎల్లుండి విడుదల కాబోతున్న మామన్నన్ తెలుగు వెర్షన్ నాయకుడుని ఒరిజినల్ నిర్మించిన రెడ్ జాయింట్ తో పాటు ఏషియన్, సురేష్ సంస్థలు సంయుక్తంగా ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నాయి. థియేటర్ల కేటాయింపు దాదాపు అయిపోయింది. కొన్ని నగరాలకు ఆన్ లైన్ బుకింగ్స్ కూడా మొదలుపెట్టారు. కానీ విచిత్రంగా ఈ పేరుతో ఓ మూవీ వస్తోందని ఎవరికీ తెలియనంత నీరసంగా పబ్లిసిటీ చేస్తున్నారు. మరి ఓపెనింగ్స్ ఎలా వస్తాయి.
తమిళనాడులో మామన్నన్ కు మంచి విజయం దక్కింది. బడుగువర్గాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేగా వడివేలు, అగ్ర కుల మదంతో విర్రవీగే విలన్ పాత్రలో ఫహద్ ఫాసిల్ విశ్వరూపం చూపించారు. హీరో ఉదయనిధి స్టాలిన్ ని ఇద్దరూ కలిసి డామినేట్ చేశారు. హీరోయిన్ కీర్తి సురేష్ వల్ల ఇక్కడి మార్కెట్ లో కొంత బజ్ ని తెచ్చుకునే ఛాన్స్ ఉంది. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చిన సంగతి సైతం మూవీ లవర్స్ కు రిజిస్టర్ కాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. యూట్యూబ్ లో పాటలు వదల్లేదు. మొన్న ట్రైలర్ రిలీజ్ చేయడం తప్ప ఇంకే యాక్టివిటీ లేదు.
కనీసం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, మెయిన్ క్యాస్టింగ్ ని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు ఇప్పించడం లాంటివి చేస్తే బజ్ పెరుగుతుంది. అసలే బాక్సాఫీస్ పోటీ తీవ్రంగా ఉంది. మిషన్ ఇంపాజిబుల్ 7, బేబీ, మహావీరుడులు రేస్ లో నిలుచుని కవ్విస్తున్నాయి. కేవలం క్యాస్టింగ్ ని చూసే టికెట్ కొందామనే పరిస్థితులు ఇక్కడ లేవు. ఆ మధ్య వెట్రిమారన్ విడుదల పార్ట్ 1 విషయంలో ఇలాగే నిర్లిప్తత చూపించడం వల్ల జనాలకు చేరలేకపోయింది. అలాంటప్పుడు నాయకుడుకి తగినన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సోషల్ డ్రామాని రజనీకాంత్ స్వయంగా మెచ్చుకున్నారు
This post was last modified on July 12, 2023 1:20 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…