టాలీవుడ్లో ఇప్పుడు పాత సినిమాలను రీ రిలీజ్ చేయడమే కాక.. కొత్త సినిమాలకు రిలీజ్ ముందు రోజే పెయిడ్ ప్రిమియర్స్ వేయడం ట్రెండుగా మారింది. కొన్ని సినిమాలు దీని వల్ల ప్రయోజనం పొందితే.. కొన్ని దెబ్బ తిన్నాయి. రెండు వారాల కిందట శ్రీ విష్ణు మూవీ ‘సామజవరగమన’ సినిమాకు ఇలాగే స్పెషల్ ప్రివ్యూలు వేస్తే పాజిటివ్ టాక్ వచ్చి సినిమాకు బాగా కలిసొచ్చింది. ముందే పాజిటివ్ టాక్ రావడంతో తొలి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర ఆ చిత్రం దూసుకెళ్లింది.
కానీ గత వారం నాగశౌర్య సినిమా ‘రంగబలి’కి ఇలాగే పెయిడ్ ప్రిమియర్స్ వేస్తే తేడా కొట్టింది. ఆ షోల నుంచే నెగెటివ్ టాక్ బాగా స్ప్రెడ్ కావడంతో తొలి రోజు ఓపెనింగ్స్ మీద ప్రతికూల ప్రభావం పడింది. సినిమా తర్వాత కోలుకోలేకపోయింది. ఇలా పెయిడ్ ప్రిమియర్స్ ప్లస్ అయిన, మైనస్ అయిన ఉదాహరణలు కనిపిస్తుండగా.. మరో సినిమా ఈ బాటలోనే నడవబోతోంది. అదే.. బేబి.
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ముఖ్య పాత్రల్లో సాయిరాజేష్ రూపొందించిన ‘బేబీ’కి ప్రేక్షకుల్లోనే కాక ట్రేడ్ వర్గాల్లోనూ మంచి అంచనాలున్నాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. సినిమా మీద చాలా ధీమాగా ఉన్న చిత్ర బృందం.. రిలీజ్ ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్కు రెడీ అయిపోయింది.
ఆల్రెడీ హైదరాబాద్లో, అలాగే కర్నూలులో ప్రిమియర్స్కు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇంకా పలు నగరాల్లో.. ప్రిమియర్స్ పడబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో పెద్ద సంఖ్యలోనే షోలు ఉంటాయట. ఈ షోల నుంచి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సినిమా ఊహించని రేంజికి వెళ్లడం ఖాయం. ఒకవేళ టాక్ తేడా కొడితే మాత్రం సినిమాకున్న బజ్ దెబ్బ తింటుంది. ఓపెనింగ్స్ మీద ప్రభావం పడుతుంది. వచ్చే వారం రిలీజయ్యే ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’కు కూడా ఇలాగే స్పెషల్ ప్రివ్యూలు ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on July 11, 2023 5:05 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…