Movie News

మాఫియాకు దూరంగా ఎన్టీఆర్ 31

కెజిఎఫ్ తో పన్నెండు వందల కోట్ల సినిమాని శాండల్ వుడ్ కు ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న సలార్ మీద ఏ స్థాయిలో అంచనాలు పెట్టాడో చూస్తున్నాం. సెప్టెంబర్ 28 విడుదల కాబోతున్న ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ మీద భారీ ఎత్తున బిజినెస్ జరుగుతోంది. సెకండ్ పార్ట్ సమాంతరంగా పూర్తి చేశారనే టాక్ వినిపిస్తోంది నిజానికి సీక్వెల్ లోని కీలక భాగం డిసెంబర్  నుంచి మొదలుపెడతారట. దీని సంగతలా  ఉంచితే నీల్ దీని తర్వాత ఎన్టీఆర్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే.  దీనికి సంబంధించిన స్టోరీ లీక్స్ ఇప్పటిదాకా బయటికి రాలేదు.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈసారి ప్రశాంత్ నీల్ మాఫియా జోలికి పోవడం లేదట. ఇప్పటిదాకా తీసినవి నాలుగు అవే జానర్ కావడంతో పూర్తిగా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ ఎంచుకోబోతున్నట్టు తెలిసింది. స్వాతంత్రం రాకముందు ఇండియా పాకిస్థాన్ సరిహద్దుల్లో జరిగిన పోరాటం ఆధారంగా ఒక కథను తయారు చేశారట. తారక్ వీర దేశభక్తుడిగా హై వోల్టేజ్ పాత్రను పోషించబోతున్నట్టు తెలిసింది. ఆర్ఆర్ఆర్ తరహాలో అనిపించినా అది కేవలం ఒక పాప చుట్టూ నడిచే డ్రామా కాబట్టి దీంతో ఎలాంటి పోలిక ఉండదని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈ ఏడాదిలోనే ఫోటో షూట్ చేయబోతున్నారు.

ఇది నిజమైతే అంతకన్నా శుభవార్త అభిమానులకు ఇంకేం ఉండదు. మాములుగా ప్రశాంత్ నీల్ హీరోయిజం ఓ రేంజ్ లో ఉంటుంది. దానికి దేశభక్తి తోడైతే ఎలా పేలుతుందో ఊహించుకోవడం కష్టం. ప్రస్తుతం దేవర కోసం డిసెంబర్ దాకా డేట్లు ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఆ లోగానే వార్ 2 కోసం హృతిక్ రోషన్ తో కలిసి సెట్లో అడుగుపెడతాడు. ఈ రెండు అయ్యేలోపు 2024 వేసవి దాటిపోతుంది. అప్పటికంతా సలార్ 2 ఫినిష్ చేసుకున్న ప్రశాంత్ చిన్న గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ 31కి ముహూర్తం పెట్టేస్తాడు. బడ్జెట్ కూడా ఊహించని షాకింగ్ ఫిగర్ తో ఉంటుందని ఫిలిం నగర్ టాక్ 

This post was last modified on July 11, 2023 1:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

6 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

8 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

9 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

9 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

10 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

12 hours ago