మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత లెజెండరీ డైరెక్టర్ శంకర్తో మొదలుపెట్టిన గేమ్ ఛేంజర్ మూవీ అనుకున్నంత వేగంగా ముందుకు సాగట్లేదు. మధ్యలో శంకర్ ఇండియన్-2ను పూర్తి చేయాల్సిన పని పడటంతో ఈ సినిమా షూటింగ్ ఆగి ఆగి సాగుతోంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలవుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే బుచ్చిబాబు సానాతో చేయాల్సిన కొత్త సినిమాకు సంబంధించి స్క్రిప్టును ఫైనలైజ్ చేసి వీలైనంత త్వరగా సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నాడు చరణ్.
స్క్రిప్టు దాదాపుగా పూర్తయినట్లే చెబుతున్నారు. కాస్ట్ అండ్ క్రూ ఎంపిక జరుగుతోందట ప్రస్తుతం. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర అప్డేట్స్ గురించి చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. బుచ్చిబాబు తొలి సినిమా ఉప్పెనలో విజయ్ సేతుపతి విలన్ పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు ఆ పాత్ర అతి పెద్ద బలంగా నిలిచింది. సేతుపతికి తెలుగులో ఇదొక మరపురాని పాత్రగా నిలిచింది. ఆ అభిమానంతోనే బుచ్చిబాబు తర్వాతి చిత్రంలోనూ ఓ ముఖ్య పాత్ర చేయడానికి సేతుపతి ఓకే చెప్పాడట.
బహుశా ఇది విలన్ పాత్రే అయ్యుంటుందని భావిస్తున్నారు. ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చనున్నాడట. ముందు ఎన్టీఆర్తో సినిమా చేయాలని అనుకున్నపుడే బుచ్చిబాబు రెహమాన్ను సంప్రదించడం తెలిసిందే. మరి కథ మారిందా అదేనా అన్నది తెలియదు కానీ.. ఈ సినిమాకు రెహమానే సంగీతం అందించనున్నాడట. ఇదొక స్పోర్ట్స్ డ్రామా అని అంటున్నారు. ఈ చిత్రానికి జాన్వి కపూర్ను కథానాయికగా పరిగణిస్తున్నారట.
This post was last modified on July 9, 2023 10:12 am
ఏపీలో కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించి.. ఏడు మాసాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఫీడ్ బ్యాక్ ఏంటి?…
పాతికేళ్ల క్రితం 2001 సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చిన శ్రియ టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడింది. చిరంజీవి, బాలకృష్ణతో మొదలుపెట్టి ప్రభాస్,…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్.. లండన్ నుంచి ఇలా వచ్చారో లేదో.. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు,…
జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ ని కలుసుకోవడానికి త్వరలోనే ఒక వేడుక ఏర్పాటు చేస్తానని, అప్పటిదాకా ఓపిగ్గా ఎదురు చూడమని…
బెంగళూరులో ఇటీవల అరెస్టైన ఓ దొంగ కథ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 37 ఏళ్ల పంచాక్షరి స్వామి అనే…
కూటమి ప్రభుత్వంలో కలిసి మెలిసి ఉండాలని.. నాయకులు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు పదే పదే…