సామజవరగమన అనే చిన్న సినిమా వారం రోజుల నుంచి బాక్సాఫీస్ దగ్గర రేపుతున్న సంచలనం గురించి అందరికీ తెలిసిందే. చిన్న సినిమాలకు ప్రేక్షకులను ఓ మోస్తరుగా కూడా థియేటర్లకు రప్పించడం చాలా కష్టమైపోతున్న ఈ రోజుల్లో అప్పుడప్పుడూ కొన్ని సినిమాలు ఇరగాడేస్తుంటాయి. తమ స్థాయికి మించిన వసూళ్లు రాబడుతుంటాయి.
సామజవరగమన అలాగే వసూళ్ల మోత మోగిస్తూ సాగిపోతోంది. వారం తిరిగేసరికి 30 కోట్ల గ్రాస్.. దాదాపు 20 కోట్ల షేర్ అంటే చిన్న విషయం కాదు. మంచి టాక్కు తోడు బాక్సాఫీస్ పరిస్థితులు కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయి. గత వారం దీనికి పోటీగా రిలీజైన సినిమాలేవీ నిలబడకపోవడంతో అడ్వాంటేజ్ను బాగా ఉపయోగించుకుంది. రెండో వారంలో కూడా ఈ సినిమాకు భలేగా కలిసొస్తోంది. వీక్ డేస్లో కొంచెం స్లో అయిన సామజవరగమన.. శుక్రవారం సాయంత్రం షోల నుంచి మళ్లీ బలంగా పుంజుకుంది.
ఇక శుక్రవారం పేరుకు చాలా సినిమాలే రిలీజయ్యాయి కానీ.. ఏవీ కూడా ఆశించిన టాక్ తెచ్చుకోలేకపోయాయి. మంచి క్రేజ్ సంపాదించిన నాగశౌర్య సినిమా రంగబలికి నెగెటివ్ టాకే వచ్చింది. తొలి రోజు వసూళ్లు బానే ఉన్నా.. సినిమా ఏమాత్రం నిలబడుతుందో అన్నది సందేహంగానే ఉంది. భాగ్ సాలే అయితే పూర్తిగా నెగెటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర వాషౌట్ అయ్యే దిశగా అడుగులు వేస్తోంది.
జగపతిబాబు సినిమా రుద్రంగికి కూడా టాక్ బాగా లేదు. భాగ్ సాలే, రుద్రంగి సినిమాలకు మినిమం ఓపెనింగ్స్ లేవు. చాలా చోట్ల జనాల్లేక షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితి ఉంది. ఇక 7:11 పీఎం, సర్కిల్ లాంటి చిన్న సినిమాల గురించి ప్రేక్షకులు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. రెండో వారంలో కూడా కొత్త సినిమాలను పక్కకు నెట్టి సామజవరగమననే బాక్సాఫీస్ లీడర్ అయ్యేలా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే ఈ సినిమాకు మామూలుగా కలిసి రావడం లేదనే చెప్పాలి.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…