ఒక చిన్న సినిమాకు ఎంత ప్రమోషన్లు చేసినా ఆడియన్స్ అటెన్షన్ తీసుకోవడం సులభం కాదు. అలాంటిది మ్యూజిక్ ఆల్బమ్ తో బజ్ తెచ్చుకోవడం అంటే విశేషమే. బేబీ టీమ్ ఈ విషయంలో బాగా సక్సెస్ అయ్యింది. కలర్ ఫోటో నిర్మాతగా నేషనల్ అవార్డు అందుకున్న సాయి రాజేష్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్కెఎన్ నిర్మించిన ఈ ఎమోషనల్ డ్రామా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా అమీర్ పేట్ ఏఏఏ మల్టీప్లెక్స్ లో వంశీ పైడిపల్లి, మారుతీ ముఖ్య అతిథులుగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేశారు. యూత్ లో దీని మీద మంచి అంచనాలున్నాయి.
స్కూల్ వయసులోనే ప్రేమించుకుంటుంది ఓ జంట. అమ్మాయి(వైష్ణవి చైతన్య)కి రంగు తక్కువ. అయినా నిండైన కళ. అబ్బాయి(ఆనంద్ దేవరకొండ)కి చదువు అబ్బదు. పదో తరగతి తప్పి ఆటో డ్రైవర్ గా మారతాడు. అయినా స్నేహం కొనసాగుతుంది. ఈలోగా ధనికుడైన మరో కుర్రాడు(విరాజ్ అశ్విన్)వీళ్ళ జీవితాల్లోకి వచ్చాక ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ బేబీ కలర్ మారిపోయి గొప్ప అందగత్తెగా నిలుస్తుంది. అప్పుడు మొదలవుతుంది కన్ఫ్యూజన్. ఇంతకీ ఈ రెండు కథలు సమాంతరంగా జరిగేవా లేక ట్విస్టు ఏదైనా పెట్టారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
యువతను లక్ష్యంగా పెట్టుకున్న ఈ ముక్కోణపు ప్రేమకథలో విజువల్స్, ఎమోషన్స్ వాళ్లకు తగ్గట్టుగానే ఉన్నాయి. డైలాగులు బాగా రాసుకున్నారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ముందే హింట్ ఇచ్చే దేవుడు అమ్మాయి విషయంలో మాత్రం ఎందుకు ఇవ్వడని చెప్పడం, గుండెల మీద తన్నాలంటే మాకంటే ఎవరూ ఆ పని చేయలేరని వైష్ణవితో చెప్పించడం పేలాయి. ముందు నుంచి బేబీ హైప్ లో ప్రధాన పిల్లర్ గా నిలుస్తున్న విజయ్ బుల్గనిన్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలకంగా మారబోతున్నాయి. ఆలస్యమైనా మంచి టైమింగ్ చూసుకుని వస్తున్న బేబీలో క్లిక్ అయ్యే కంటెంట్ కనిపిస్తోంది
This post was last modified on July 7, 2023 8:12 pm
విద్యాబాలన్.. బాలీవుడ్లో మంచి స్థాయి ఉన్న కథానాయిక. ఆమె కథానాయికగా మంచి ఫాంలో ఉన్న టైంలో తెలుగులో నటింపజేయడానికి ప్రయత్నాలు…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఈ ఏడాది సెప్టెంబరు 17తో 75 ఏళ్లు వస్తాయి. ప్రస్తుతం ఆయన వయసు 74…
రాబిన్ హుడ్ అంటే పెద్దోళ్లను దోచుకుని పేదోళ్లకు పెట్టేవాడు. ఈ పేరుతో ఓ తెలుగు సినిమా తెరకెక్కింది. రెండుసార్లు వాయిదా…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వేత్తల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం…
గత దశాబ్ద కాలంలో బహు భాషల్లో విజయాలు అందుకుని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద రేంజికి ఎదిగిన కథానాయిక రష్మిక…
కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఏది చేసినా వైరల్ అయిపోతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం కేంద్రంగా రాజకీయం చేస్తున్న కేతిరెడ్డి..…