సినిమాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో కోట్ల బడ్జెట్ తో వెబ్ సిరీస్ లు నిర్మించడంలో ఓటిటిలు విపరీతంగా పోటీ పడుతుంటాయి. వాటిలో ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రియాంక చోప్రా ప్రధాన పాత్ర పోషించిన సిటాడెల్ కొన్ని నెలల క్రితమే అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ కు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సుమారు 250 మిలియన్ డాలర్ల దాకా ఖర్చు పెట్టారు. అంటే మన కరెన్సీలో అక్షరాలా 2 వేల కోట్లన్న మాట. ఎవెంజర్స్ తీసిన రస్సో బ్రదర్స్ కథను అందించడం వల్ల దీనికి ఇంత క్రేజ్ వచ్చింది. ప్రైమ్ దీని మీద బోలెడు ఆశలు పెట్టుకుంది.
తీరా చూస్తే సిటాడెల్ అంచనాలు అందుకోలేదు. మిక్స్డ్ రివ్యూస్, బ్యాడ్ టాక్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. దీంతో మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని ప్రైమ్ పెద్దలు తెగ బాధపడుతున్నారని టాక్. దీన్నే ఇండియన్ వెర్షన్ కోసం దర్శకులు రాజ్ అండ్ డికెలు వరుణ్ ధావన్, సమంతాతో రీమేక్ చేశారు. ఇటీవలే షూటింగ్ పూర్తయ్యింది. ప్రధాన కథ అదే కానీ మన ఆడియన్స్ కి తగ్గట్టు కొన్ని కీలక మార్పులు చేస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తలు కావడంతో అంచనాలు మాములుగా లేవు. అయితే ఒరిజినల్ వెర్షన్ ఫ్లాప్ కావడం ఎవరూ ఊహించలేదు.
ఈ పరిణామాల పట్ల అమెజాన్ ప్రైమ్ బాగా సీరియస్ గా తీసుకుని ఇలాంటి రిజల్ట్ ఇచ్చిన వెబ్ సిరీస్ లను రెన్యువల్ చేయడం ఆపాలని నిర్ణయం తీసుకుందని సమాచారం. అంతే కాదు కంటెంట్ సెలక్షన్ లో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగులకు ఉద్వాసన పలికే ప్రోగ్రాం కూడా పెట్టిందని వినికిడి. కరోనా టైంలో ఇలాగే ముందు వెనుకా చూడకుండా కోట్లు కుమ్మరించి కొన్న భారతీయ సినిమాలు డిజాస్టరై పెద్ద షాక్ ఇవ్వడంతో ఆ తర్వాత తొందరపడి కొనడం ఆపేసింది. చాలా క్యాలికులేషన్లతో నిర్మాతలతో బేరాలు పెడుతోంది. ఏదైనా వాత పడితేనే కదా తెలిసేది నొప్పి ఎలా ఉంటుందో
This post was last modified on July 7, 2023 11:01 am
2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్రదాడి భారత దేశ చరిత్రలో మరిచిపోలేని దారుణం. ఆ దాడిలో 170 మందికిపైగా…
అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రముఖ సీఈఓ అనురాగ్ బాజ్పాయ్ అరెస్టయ్యారు. బోస్టన్ సమీపంలో ఉన్న వ్యభిచార గృహాల వ్యవహారంలో…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిపిన పర్యటన…
ఒకపక్క విడుదల తేదీ మే 9 ముంచుకొస్తోంది. రిలీజ్ కౌంట్ డౌన్ నెల నుంచి 29 రోజులకు తగ్గిపోయింది. ఇంకోవైపు…
ముఖ్యమంత్రుల 'బ్రాండ్స్'పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుందన్నారు. "రెండు…
బీఆర్ఎస్ నాయకుడు, బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టయ్యారు. రెండేళ్ల కిందట జరిగిన ఘటనలో తన కుమారుడిని సదరు…