సినిమాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో కోట్ల బడ్జెట్ తో వెబ్ సిరీస్ లు నిర్మించడంలో ఓటిటిలు విపరీతంగా పోటీ పడుతుంటాయి. వాటిలో ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రియాంక చోప్రా ప్రధాన పాత్ర పోషించిన సిటాడెల్ కొన్ని నెలల క్రితమే అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ కు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సుమారు 250 మిలియన్ డాలర్ల దాకా ఖర్చు పెట్టారు. అంటే మన కరెన్సీలో అక్షరాలా 2 వేల కోట్లన్న మాట. ఎవెంజర్స్ తీసిన రస్సో బ్రదర్స్ కథను అందించడం వల్ల దీనికి ఇంత క్రేజ్ వచ్చింది. ప్రైమ్ దీని మీద బోలెడు ఆశలు పెట్టుకుంది.
తీరా చూస్తే సిటాడెల్ అంచనాలు అందుకోలేదు. మిక్స్డ్ రివ్యూస్, బ్యాడ్ టాక్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. దీంతో మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని ప్రైమ్ పెద్దలు తెగ బాధపడుతున్నారని టాక్. దీన్నే ఇండియన్ వెర్షన్ కోసం దర్శకులు రాజ్ అండ్ డికెలు వరుణ్ ధావన్, సమంతాతో రీమేక్ చేశారు. ఇటీవలే షూటింగ్ పూర్తయ్యింది. ప్రధాన కథ అదే కానీ మన ఆడియన్స్ కి తగ్గట్టు కొన్ని కీలక మార్పులు చేస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తలు కావడంతో అంచనాలు మాములుగా లేవు. అయితే ఒరిజినల్ వెర్షన్ ఫ్లాప్ కావడం ఎవరూ ఊహించలేదు.
ఈ పరిణామాల పట్ల అమెజాన్ ప్రైమ్ బాగా సీరియస్ గా తీసుకుని ఇలాంటి రిజల్ట్ ఇచ్చిన వెబ్ సిరీస్ లను రెన్యువల్ చేయడం ఆపాలని నిర్ణయం తీసుకుందని సమాచారం. అంతే కాదు కంటెంట్ సెలక్షన్ లో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగులకు ఉద్వాసన పలికే ప్రోగ్రాం కూడా పెట్టిందని వినికిడి. కరోనా టైంలో ఇలాగే ముందు వెనుకా చూడకుండా కోట్లు కుమ్మరించి కొన్న భారతీయ సినిమాలు డిజాస్టరై పెద్ద షాక్ ఇవ్వడంతో ఆ తర్వాత తొందరపడి కొనడం ఆపేసింది. చాలా క్యాలికులేషన్లతో నిర్మాతలతో బేరాలు పెడుతోంది. ఏదైనా వాత పడితేనే కదా తెలిసేది నొప్పి ఎలా ఉంటుందో
This post was last modified on July 7, 2023 11:01 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…