సినిమాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో కోట్ల బడ్జెట్ తో వెబ్ సిరీస్ లు నిర్మించడంలో ఓటిటిలు విపరీతంగా పోటీ పడుతుంటాయి. వాటిలో ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రియాంక చోప్రా ప్రధాన పాత్ర పోషించిన సిటాడెల్ కొన్ని నెలల క్రితమే అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ కు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సుమారు 250 మిలియన్ డాలర్ల దాకా ఖర్చు పెట్టారు. అంటే మన కరెన్సీలో అక్షరాలా 2 వేల కోట్లన్న మాట. ఎవెంజర్స్ తీసిన రస్సో బ్రదర్స్ కథను అందించడం వల్ల దీనికి ఇంత క్రేజ్ వచ్చింది. ప్రైమ్ దీని మీద బోలెడు ఆశలు పెట్టుకుంది.
తీరా చూస్తే సిటాడెల్ అంచనాలు అందుకోలేదు. మిక్స్డ్ రివ్యూస్, బ్యాడ్ టాక్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. దీంతో మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని ప్రైమ్ పెద్దలు తెగ బాధపడుతున్నారని టాక్. దీన్నే ఇండియన్ వెర్షన్ కోసం దర్శకులు రాజ్ అండ్ డికెలు వరుణ్ ధావన్, సమంతాతో రీమేక్ చేశారు. ఇటీవలే షూటింగ్ పూర్తయ్యింది. ప్రధాన కథ అదే కానీ మన ఆడియన్స్ కి తగ్గట్టు కొన్ని కీలక మార్పులు చేస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తలు కావడంతో అంచనాలు మాములుగా లేవు. అయితే ఒరిజినల్ వెర్షన్ ఫ్లాప్ కావడం ఎవరూ ఊహించలేదు.
ఈ పరిణామాల పట్ల అమెజాన్ ప్రైమ్ బాగా సీరియస్ గా తీసుకుని ఇలాంటి రిజల్ట్ ఇచ్చిన వెబ్ సిరీస్ లను రెన్యువల్ చేయడం ఆపాలని నిర్ణయం తీసుకుందని సమాచారం. అంతే కాదు కంటెంట్ సెలక్షన్ లో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగులకు ఉద్వాసన పలికే ప్రోగ్రాం కూడా పెట్టిందని వినికిడి. కరోనా టైంలో ఇలాగే ముందు వెనుకా చూడకుండా కోట్లు కుమ్మరించి కొన్న భారతీయ సినిమాలు డిజాస్టరై పెద్ద షాక్ ఇవ్వడంతో ఆ తర్వాత తొందరపడి కొనడం ఆపేసింది. చాలా క్యాలికులేషన్లతో నిర్మాతలతో బేరాలు పెడుతోంది. ఏదైనా వాత పడితేనే కదా తెలిసేది నొప్పి ఎలా ఉంటుందో
This post was last modified on July 7, 2023 11:01 am
వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…
90వ దశకంలో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన కథానాయిక.. మీనా. ఇటు తెలుగులో, అటు తమిళంలో ఆమె…
ముందు సౌత్ సినిమాల్లో నటించి, ఆ తర్వాత బాలీవుడ్లో స్థిరపడ్డ హీరోయిన్లు చాలామంది.. ఇక్కడి సినిమాలు, పరిస్థితుల గురించి విమర్శలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంటే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్కు ఉన్న వ్యతిరేకత ఎలాంటిదో తెలిసిందే. ‘జస్ట్ ఆస్కింగ్’…
పదేళ్లకు పైగా 33 మంది పసి బాలురపై పునరావృత లైంగిక దాడులకు పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్ బందా ప్రత్యేక పోక్సో…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటిస్తే.. అది అమలు కావాల్సిందే!. అది గిరిజన ప్రాంతమైనా.. మైదాన ప్రాంతమైనా.. చెప్పినట్టు…