నందమూరి బాలకృష్ణ కొన్ని రోజులుగా ఎవరికీ అందుబాటులోకి రావడం లేదన్నది ఇండస్ట్రీ వర్గాల మాట. కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఎవరినీ కలవట్లేదని.. కనీసం కథలు వినడానికి కూడా ఇష్టపడట్లేదని.. షూటింగ్ ఎప్పుడు ఉండొచ్చు, ఆ దిశగా ఎలా ప్రిపేర్ అవ్వలి అన్నది కూడా ఆయన పట్టించుకోవడం లేదని.. ఒక రకంగా ఎవరికీ దొరక్కుండా ఆయన అజ్ఞాతంలో ఉంటున్నారని సన్నిహితులు చెబుతున్నారు.
లాక్ డౌన్ షరతులు సడలించి షూటింగ్లకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినప్పటికీ.. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్న వాళ్లు కొంతమందే. బాలయ్య అయితే ఈ విషయంలో ఏమాత్రం సుముఖంగా లేరు.
షూటింగ్లకు అనుమతులివ్వాలని సినీ పెద్దలు.. ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నపుడు దీని వల్ల ఏం ప్రయోజనం లేదని తేల్చేశాడు బాలయ్య. అనుమతులు వచ్చినా షూటింగ్లు జరగవని ఖరాఖండిగా చెప్పేశారు. చివరికి బాలయ్య చెప్పిందే జరిగింది. అనుమతులు వచ్చిన కొత్తలో బాలయ్య కొత్త సినిమా దర్శకుడు బోయపాటి.. నిర్మాతతో కలిసి నిబంధనల ప్రకారం షూటింగ్ చేసేందుకు ప్రణాళికలు రచించాడు. కానీ బాలయ్య మాత్రం ఆ విషయంలో ఎలాంటి ఆసక్తి ప్రదర్శించట్లేదు.
ఇంకో నెల రోజుల్లో పరిస్థితులు మెరుగుపడతాయని, చిత్రీకరణలు పున:ప్రారంభించవచ్చని చాలామంది భావిస్తుండగా.. అక్టోబరు లోపు అయితే షూటింగ్ చేయడానికి బాలయ్య ఏమాత్రం ఆసక్తిగా లేరని సమాచారం. అంత వరకు ఆయన ఎవరినీ కలిసేలా కూడా లేరని తెలుస్తోంది.
This post was last modified on August 14, 2020 11:00 am
ఏపీ రాజధాని ఏది? అంటే.. ఇప్పుడు చెప్పుకొనే పరిస్థితి లేదు. 2019కి ముందు వరకు రాజధాని అమరావతి అని చెప్పుకొనే…
దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…
సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…
అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…
టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…
వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…