Movie News

బాలయ్య ఖాతాలో అరుదైన రికార్డు

ఒకప్పటిలా ఇప్పుడు వంద రోజులు, సిల్వర్ జూబ్లీలు చూడటం అరుదైపోయింది కానీ స్టార్ హీరోల అభిమానుల వల్ల కొన్ని అరుదైన మైలురాళ్ళు సాధ్యమవుతున్నాయి. బాలయ్యకు అలాంటి ఓ రికార్డు సొంతమైంది. సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డి వసూళ్ల పరంగా ఆయన కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా 175 రోజులు దాటేసిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, ఆలూరు పట్టణం శ్రీ లక్ష్మినరసింహా థియేటర్ లో రోజు 4 ఆటలతో జూలై 5వ తేదీన ఈ లాంఛనం పూర్తి చేసుకుంది. ఒక సి సెంటర్లో ఈ రన్ దక్కడం ఘనతే.

అయితే అసలు విశేషం ఇది కాదు. వరసగా డబుల్ యాక్షన్ చేసిన ఒకే హీరో రెండు సినిమాలు సిల్వర్ జూబ్లీ చేసుకోవడం మాత్రం ఇదే మొదటిసారి. గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, కృష్ణ లాంటి స్టార్ల చిత్రాలు నూటా డెబ్భై అయిదు రోజులు చాలానే ఆడాయి కానీ బ్యాక్ టు బ్యాక్ ద్విపాత్రాభినయాలు ఆడటం మాత్రం ఇండియాలోనే ఇది మొదటిసారని అభిమానులు అంటున్నారు. వెనక్కు వెళ్లి చూస్తే ఇద్ నిజమే అనిపిస్తోంది. వీరసింహారెడ్డి హాట్ స్టార్ ఓటిటిలో వచ్చి నెలలు దాటేసింది. అయినా కూడా కొత్త సినిమాల తాకిడిలో ఇంత లాంగ్ రన్ అనూహ్యం.

ఫ్యాన్స్ అండదండలతో ఇది సాధ్యమయ్యిందేమో అనుకున్నా సినిమా ఆడుతున్నన్ని రోజులు జనాలు బాగానే వచ్చారని లోకల్ రిపోర్ట్. మొత్తానికి బాలయ్య ఖాతాలో దగ్గరి భవిష్యత్తులో ఇంకెవరికి సాధ్యం కాని ఒక అరుదైన రికార్డు దక్కింది. అఖండ, వీరసింహారెడ్డిల తర్వాత ఇప్పుడు మరింత జోష్ తో భగవంత్ కేసరిగా అక్టోబర్ లో రాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ హ్యాట్రిక్ గ్యారెంటీ అనే నమ్మకంతో ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, అర్జున్ రామ్ పాల్ విలన్ గా, శ్రీలీల మరో ప్రధాన పాత్ర పోషించిన ఈ మాస్ ఎంటర్ టైనర్ కి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. 

This post was last modified on July 6, 2023 12:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

2 hours ago

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

3 hours ago

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…

4 hours ago

‘పవన్ పదవి వదిలి గుడులూ.. గోపురాల చుట్టూ తిరగొచ్చు’

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆ ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ డిమాండ్…

4 hours ago

ప్రభుత్వ ఉద్యోగాల్లో తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే మ‌రో 40 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు.…

5 hours ago

మళ్ళీ పాద‌యాత్ర చేసి సాధించేది ఏమన్నా ఉందా జగన్?

అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న ప‌రిస్థితిలో చెప్పడం కష్టంగా…

6 hours ago