ఒకప్పటిలా ఇప్పుడు వంద రోజులు, సిల్వర్ జూబ్లీలు చూడటం అరుదైపోయింది కానీ స్టార్ హీరోల అభిమానుల వల్ల కొన్ని అరుదైన మైలురాళ్ళు సాధ్యమవుతున్నాయి. బాలయ్యకు అలాంటి ఓ రికార్డు సొంతమైంది. సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డి వసూళ్ల పరంగా ఆయన కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా 175 రోజులు దాటేసిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, ఆలూరు పట్టణం శ్రీ లక్ష్మినరసింహా థియేటర్ లో రోజు 4 ఆటలతో జూలై 5వ తేదీన ఈ లాంఛనం పూర్తి చేసుకుంది. ఒక సి సెంటర్లో ఈ రన్ దక్కడం ఘనతే.
అయితే అసలు విశేషం ఇది కాదు. వరసగా డబుల్ యాక్షన్ చేసిన ఒకే హీరో రెండు సినిమాలు సిల్వర్ జూబ్లీ చేసుకోవడం మాత్రం ఇదే మొదటిసారి. గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, కృష్ణ లాంటి స్టార్ల చిత్రాలు నూటా డెబ్భై అయిదు రోజులు చాలానే ఆడాయి కానీ బ్యాక్ టు బ్యాక్ ద్విపాత్రాభినయాలు ఆడటం మాత్రం ఇండియాలోనే ఇది మొదటిసారని అభిమానులు అంటున్నారు. వెనక్కు వెళ్లి చూస్తే ఇద్ నిజమే అనిపిస్తోంది. వీరసింహారెడ్డి హాట్ స్టార్ ఓటిటిలో వచ్చి నెలలు దాటేసింది. అయినా కూడా కొత్త సినిమాల తాకిడిలో ఇంత లాంగ్ రన్ అనూహ్యం.
ఫ్యాన్స్ అండదండలతో ఇది సాధ్యమయ్యిందేమో అనుకున్నా సినిమా ఆడుతున్నన్ని రోజులు జనాలు బాగానే వచ్చారని లోకల్ రిపోర్ట్. మొత్తానికి బాలయ్య ఖాతాలో దగ్గరి భవిష్యత్తులో ఇంకెవరికి సాధ్యం కాని ఒక అరుదైన రికార్డు దక్కింది. అఖండ, వీరసింహారెడ్డిల తర్వాత ఇప్పుడు మరింత జోష్ తో భగవంత్ కేసరిగా అక్టోబర్ లో రాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ హ్యాట్రిక్ గ్యారెంటీ అనే నమ్మకంతో ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, అర్జున్ రామ్ పాల్ విలన్ గా, శ్రీలీల మరో ప్రధాన పాత్ర పోషించిన ఈ మాస్ ఎంటర్ టైనర్ కి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.
This post was last modified on July 6, 2023 12:48 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…