ఈ మధ్యకాలంలో అసలు విడుదల తేదీకి ఒకటి రెండు రోజుల ముందే స్పెషల్ ప్రీమియర్లు వేయడం మంచి ఫలితాన్ని ఇస్తోంది. హీరో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికంటే ముందుగా చూస్తున్నామనే ఫీలింగ్ ఆడియన్స్ ని థియేటర్లకు తీసుకొస్తోంది. అందులోనూ ఇవన్నీ ఈవెనింగ్ షోలు కావడంతో హౌస్ ఫుల్స్ కి ఢోకా ఉండటం లేదు. సామజవరగమన, మేం ఫేమస్, మేజర్, రైటర్ పద్మభూషణ్, బలగం, ఇంటింటి రామాయణం, 777 ఛార్లీ వగైరాలు ఎర్లీ స్క్రీనింగ్ కి వెళ్ళినవే. ఒకటి రెండు తప్ప దాదాపు అన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు నమోదు చేసుకున్నాయి.
అందుకే రంగబలి కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవ్వాలని డిసైడ్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన నగరాల్లో స్పెషల్ షోలు వేయాలని హఠాత్తుగా నిర్ణయం తీసుకుని బుధవారం రాత్రి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టారు. నిజానికి ఈ ప్రమోషన్ ఏదో ఇంకాస్త ముందే చేసి ఉంటే రీచ్ పెరిగేది. నాగశౌర్య ఇమేజ్ ఉన్న హీరోనే కాబట్టి రెస్పాన్స్ కి సంబంధించి టెన్షన్ లేదు కానీ ఈ రోజు అర్ధరాత్రిలోపే టాక్ రావడం రేపటి ఓపెనింగ్స్ కి కీలకంగా మారనుంది. కమెడియన్ సత్య స్పూఫ్ ఇంటర్వ్యూ, శౌర్యతో డాన్స్ మాస్టర్ జానీలు కలిసి చేసిన పవన్ పాట రీమిక్స్ పబ్లిసిటీలో ఉపయోగపడ్డాయి
రేపు ఎంతపోటీ ఉన్నా కమర్షియల్ ఎంటర్ టైన్మెంట్ ఉన్న సినిమా ఇదొక్కటేననే నమ్మకంతో నాగశౌర్య టీమ్ ప్రీమియర్లకు రెడీ అయిపోయింది. ఊహించని సర్ప్రైజులు సినిమాలో చాలానే ఉంటాయని ఊరిస్తోంది. పవన్ బసంశెట్టి దర్శకత్వంలో రూపొందిన రంగబలిలో దసరా ఫేమ్ షైన్ టామ్ చాకో విలన్ గా నటిస్తున్నాడు. అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగానే ఉన్నప్పటికీ పికప్ అయ్యే టాక్ మీదే వసూళ్లు ఆధారపడి ఉంటాయి. గత కొంత కాలంగా సరైన హిట్టు లేక ఇబ్బంది పడుతున్న నాగ శౌర్య రంగబలి విషయంలో మాత్రం బ్లాక్ బస్టర్ కి తగ్గదంటున్నాడు. చూడాలి మరి.
This post was last modified on July 6, 2023 10:04 am
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…