ఈ ఏడాది జనవరి 25కు ముందు షారుఖ్ ఖాన్ పరిస్థితి అగమ్యం గోచరం. గత పదేళ్లలో నిఖార్సయిన హిట్ ఒక్కటీ లేక షారుఖ్ ఎంత ఇబ్బంది పడ్డాడో తెలిసిందే. ముఖ్యంగా గత ఐదారేళ్లలో అయితే షారుఖ్ పరిస్థితి దయనీయంగా మారింది. జీరో సినిమా అతడి మార్కెట్ను దారుణంగా దెబ్బ తీసింది. ఆ సినిమా ఫలితం చూసి షారుఖ్ పనైపోయినట్లే అని చాలామంది తీర్మానించేశారు.
కానీ ఈ ఏడాది రిపబ్లిక్ డే వీకెండ్లో రిలీజైన పఠాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మామూలు మోత మోగించలేదు. సినిమాలో ఉన్న కంటెంట్ను మించి ఈ సినిమా వసూళ్లు రాబట్టింది. ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్బులో అడుగు పెట్టింది. దీందో కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ షారుఖ్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ ఒక్క సినిమా షారుఖ్ కెరీర్ను ఒక్కసారిగా గొప్ప మలుపు తిప్పిందనే చెప్పాలి.
మంచి హైప్ తెచ్చుకుని థియేటర్లలో ఇరగాడేసిన పఠాన్ సినిమాకు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఏకంగా రూ.210 కోట్ల ఆదాయం రావడం విశేషం. బాలీవుడ్లో అత్యంత పెద్ద నాన్ థియేట్రికల్ డీల్స్లో ఇది ఒకటి. షారుఖ్ హంగామా ఇంతటితో అయిపోలేదు. పఠాన్ ఆయన తర్వాతి సినిమాల బిజినెస్కు కూడా మంచి బూస్ట్ ఇచ్చింది. కింగ్ ఖాన్ తర్వాతి సినిమా జవాన్ నాన్ థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.250 కోట్లు పలికినట్లు సమాచారం. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం.. నయనతార, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలు పోషించడంతో సౌత్లో కూడా ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది.
దీంతో నాన్ థియేట్రికల్స్ అనూహ్యమైన రేటు తెచ్చాయి. తాజా సమాచారం ఏంటంటే.. షారుఖ్ చేస్తున్న కొత్త సినిమా డంకికి ఆరంభ దశలోనే నాన్ థియేట్రికల్ డీల్ పూర్తయిందట. రాజ్ కుమార్ హిరాని రూపొందిస్తున్న ఈ సినిమాకు రూ.230 కోట్ల రేటు పలికిందట. ఈ డీల్స్ అన్నీ ఏడాది వ్యవధిలో జరిగినవి. మొత్తం మూడు సినిమాలకు కలిపి దాదాపు రూ.700 కోట్లు నాన్ థియేట్రికల్స్ ద్వారా రావడం అంటే షారుఖ్ సత్తా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…