ఈ ఏడాది జనవరి 25కు ముందు షారుఖ్ ఖాన్ పరిస్థితి అగమ్యం గోచరం. గత పదేళ్లలో నిఖార్సయిన హిట్ ఒక్కటీ లేక షారుఖ్ ఎంత ఇబ్బంది పడ్డాడో తెలిసిందే. ముఖ్యంగా గత ఐదారేళ్లలో అయితే షారుఖ్ పరిస్థితి దయనీయంగా మారింది. జీరో సినిమా అతడి మార్కెట్ను దారుణంగా దెబ్బ తీసింది. ఆ సినిమా ఫలితం చూసి షారుఖ్ పనైపోయినట్లే అని చాలామంది తీర్మానించేశారు.
కానీ ఈ ఏడాది రిపబ్లిక్ డే వీకెండ్లో రిలీజైన పఠాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మామూలు మోత మోగించలేదు. సినిమాలో ఉన్న కంటెంట్ను మించి ఈ సినిమా వసూళ్లు రాబట్టింది. ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్బులో అడుగు పెట్టింది. దీందో కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ షారుఖ్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ ఒక్క సినిమా షారుఖ్ కెరీర్ను ఒక్కసారిగా గొప్ప మలుపు తిప్పిందనే చెప్పాలి.
మంచి హైప్ తెచ్చుకుని థియేటర్లలో ఇరగాడేసిన పఠాన్ సినిమాకు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఏకంగా రూ.210 కోట్ల ఆదాయం రావడం విశేషం. బాలీవుడ్లో అత్యంత పెద్ద నాన్ థియేట్రికల్ డీల్స్లో ఇది ఒకటి. షారుఖ్ హంగామా ఇంతటితో అయిపోలేదు. పఠాన్ ఆయన తర్వాతి సినిమాల బిజినెస్కు కూడా మంచి బూస్ట్ ఇచ్చింది. కింగ్ ఖాన్ తర్వాతి సినిమా జవాన్ నాన్ థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.250 కోట్లు పలికినట్లు సమాచారం. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం.. నయనతార, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలు పోషించడంతో సౌత్లో కూడా ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది.
దీంతో నాన్ థియేట్రికల్స్ అనూహ్యమైన రేటు తెచ్చాయి. తాజా సమాచారం ఏంటంటే.. షారుఖ్ చేస్తున్న కొత్త సినిమా డంకికి ఆరంభ దశలోనే నాన్ థియేట్రికల్ డీల్ పూర్తయిందట. రాజ్ కుమార్ హిరాని రూపొందిస్తున్న ఈ సినిమాకు రూ.230 కోట్ల రేటు పలికిందట. ఈ డీల్స్ అన్నీ ఏడాది వ్యవధిలో జరిగినవి. మొత్తం మూడు సినిమాలకు కలిపి దాదాపు రూ.700 కోట్లు నాన్ థియేట్రికల్స్ ద్వారా రావడం అంటే షారుఖ్ సత్తా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on July 6, 2023 10:00 am
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…