ఏడాదిగా ప్రచారంలో ఉన్న విషయమే నిజమని తేలిపోయింది. లాంఛనం అనుకున్న పరిణామం జరిగిపోయింది. మెగా ఫ్యామిలీ అమ్మాయి, నాగబాబు తనయురాలు కొణిదెల నిహారిక.. తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకున్న విషయం అధికారికం అయింది. రెండు రోజుల ముందే వీరి విడాకులకు సంబంధించిన దరఖాస్తులు సోషల్ మీడియాలోకి వచ్చేశాయి.
చైతన్య, నిహారిక వేర్వేరుగా తమ విడాకుల గురించి స్టేట్మెంట్లు మీడియాకు రిలీజ్ చేశారు. విడిపోతూ కూడా ఇద్దరూ ఒకే రకమైన మెసేజ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం. మంచి జంట అవుతారనుకున్న వీళ్లిద్దరూ పెళ్లయి మూడేళ్లు తిరక్కుండానే ఇలా విడాకులు పొందడం మెగా అభిమానులకు బాధ కలిగిస్తోంది. కానీ వాళ్లిద్దరికీ కుదరనపుడు ఎవరూ చేసేదేమీ లేదు.
ఇదిలా ఉంటే.. నిహారికకు విడాకులు ఇప్పించిన లాయర్ ఎవరనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. జనసేన మద్దతుదారుడు, సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన కళ్యాణ్ దిలీప్ సుంకర.. ఈ విడాకుల కేసులో నిహారిక తరఫున లాయర్గా వ్యవహరించడం విశేషం. విడాకుల డాక్యుమెంట్లో నిహారిక లాయర్గా తన పేరే ఉంది. ఒకప్పుడు జనసేనలో సభ్యుడిగా ఉన్న దిలీప్ సుంకర.. కొన్ని వివాదాల వల్ల బయటికి వెళ్లిపోయాడు.
కానీ ఆ పార్టీ మద్దతుదారుగానే కొనసాగుతున్నాడు. ఓవైపు హైదరాబాద్లో ప్రాక్టీస్ చేసుకుంటూనే కామనర్ లైబ్రరీ పేరుతో యూట్యూబ్ ఛానెల్ పెట్టి జనసేన వైరి వర్గాల మీద విరుచుకుపడుతుంటాడు దిలీప్. ఆ పార్టీ మద్దతుదారుల కేసులు కూడా అతను వాదిస్తుంటాడు. నిహారిక తండ్రి నాగబాబుతో దిలీప్కు సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలోనే ఆయన కూతురి విడాకుల కేసును టేకప్ చేశాడని అర్థమవుతోంది.
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…