ఏడాదిగా ప్రచారంలో ఉన్న విషయమే నిజమని తేలిపోయింది. లాంఛనం అనుకున్న పరిణామం జరిగిపోయింది. మెగా ఫ్యామిలీ అమ్మాయి, నాగబాబు తనయురాలు కొణిదెల నిహారిక.. తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకున్న విషయం అధికారికం అయింది. రెండు రోజుల ముందే వీరి విడాకులకు సంబంధించిన దరఖాస్తులు సోషల్ మీడియాలోకి వచ్చేశాయి.
చైతన్య, నిహారిక వేర్వేరుగా తమ విడాకుల గురించి స్టేట్మెంట్లు మీడియాకు రిలీజ్ చేశారు. విడిపోతూ కూడా ఇద్దరూ ఒకే రకమైన మెసేజ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం. మంచి జంట అవుతారనుకున్న వీళ్లిద్దరూ పెళ్లయి మూడేళ్లు తిరక్కుండానే ఇలా విడాకులు పొందడం మెగా అభిమానులకు బాధ కలిగిస్తోంది. కానీ వాళ్లిద్దరికీ కుదరనపుడు ఎవరూ చేసేదేమీ లేదు.
ఇదిలా ఉంటే.. నిహారికకు విడాకులు ఇప్పించిన లాయర్ ఎవరనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. జనసేన మద్దతుదారుడు, సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన కళ్యాణ్ దిలీప్ సుంకర.. ఈ విడాకుల కేసులో నిహారిక తరఫున లాయర్గా వ్యవహరించడం విశేషం. విడాకుల డాక్యుమెంట్లో నిహారిక లాయర్గా తన పేరే ఉంది. ఒకప్పుడు జనసేనలో సభ్యుడిగా ఉన్న దిలీప్ సుంకర.. కొన్ని వివాదాల వల్ల బయటికి వెళ్లిపోయాడు.
కానీ ఆ పార్టీ మద్దతుదారుగానే కొనసాగుతున్నాడు. ఓవైపు హైదరాబాద్లో ప్రాక్టీస్ చేసుకుంటూనే కామనర్ లైబ్రరీ పేరుతో యూట్యూబ్ ఛానెల్ పెట్టి జనసేన వైరి వర్గాల మీద విరుచుకుపడుతుంటాడు దిలీప్. ఆ పార్టీ మద్దతుదారుల కేసులు కూడా అతను వాదిస్తుంటాడు. నిహారిక తండ్రి నాగబాబుతో దిలీప్కు సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలోనే ఆయన కూతురి విడాకుల కేసును టేకప్ చేశాడని అర్థమవుతోంది.
This post was last modified on July 6, 2023 7:05 am
షాప్లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…
ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…
మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…
కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…
అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొందరు నాయకులు తమ పంథాను మార్చుకోవడం లేదు.…