ఏడాదిగా ప్రచారంలో ఉన్న విషయమే నిజమని తేలిపోయింది. లాంఛనం అనుకున్న పరిణామం జరిగిపోయింది. మెగా ఫ్యామిలీ అమ్మాయి, నాగబాబు తనయురాలు కొణిదెల నిహారిక.. తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకున్న విషయం అధికారికం అయింది. రెండు రోజుల ముందే వీరి విడాకులకు సంబంధించిన దరఖాస్తులు సోషల్ మీడియాలోకి వచ్చేశాయి.
చైతన్య, నిహారిక వేర్వేరుగా తమ విడాకుల గురించి స్టేట్మెంట్లు మీడియాకు రిలీజ్ చేశారు. విడిపోతూ కూడా ఇద్దరూ ఒకే రకమైన మెసేజ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం. మంచి జంట అవుతారనుకున్న వీళ్లిద్దరూ పెళ్లయి మూడేళ్లు తిరక్కుండానే ఇలా విడాకులు పొందడం మెగా అభిమానులకు బాధ కలిగిస్తోంది. కానీ వాళ్లిద్దరికీ కుదరనపుడు ఎవరూ చేసేదేమీ లేదు.
ఇదిలా ఉంటే.. నిహారికకు విడాకులు ఇప్పించిన లాయర్ ఎవరనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. జనసేన మద్దతుదారుడు, సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన కళ్యాణ్ దిలీప్ సుంకర.. ఈ విడాకుల కేసులో నిహారిక తరఫున లాయర్గా వ్యవహరించడం విశేషం. విడాకుల డాక్యుమెంట్లో నిహారిక లాయర్గా తన పేరే ఉంది. ఒకప్పుడు జనసేనలో సభ్యుడిగా ఉన్న దిలీప్ సుంకర.. కొన్ని వివాదాల వల్ల బయటికి వెళ్లిపోయాడు.
కానీ ఆ పార్టీ మద్దతుదారుగానే కొనసాగుతున్నాడు. ఓవైపు హైదరాబాద్లో ప్రాక్టీస్ చేసుకుంటూనే కామనర్ లైబ్రరీ పేరుతో యూట్యూబ్ ఛానెల్ పెట్టి జనసేన వైరి వర్గాల మీద విరుచుకుపడుతుంటాడు దిలీప్. ఆ పార్టీ మద్దతుదారుల కేసులు కూడా అతను వాదిస్తుంటాడు. నిహారిక తండ్రి నాగబాబుతో దిలీప్కు సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలోనే ఆయన కూతురి విడాకుల కేసును టేకప్ చేశాడని అర్థమవుతోంది.
This post was last modified on July 6, 2023 7:05 am
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…