హాలీవుడ్ సినిమాలంటే ఎంత పిచ్చి ఉన్నా మన మూవీ లవర్స్ కి ఆయా దర్శకుల గురించి తెలిసింది తక్కువే. చాలా అరుదుగా వాళ్ళను గుర్తు పెట్టుకుంటారు. కానీ కొన్ని పేర్లు మాత్రం శాశ్వత ముద్ర వేసి తిరుగులేని ఫాలోయింగ్ ని సృష్టించి పెడతాయి. స్టీవెన్ స్పీల్బర్గ్ మంచి ఉదాహరణగా చెప్పొచ్చు. కానీ ఇప్పటి జనరేషన్ మాత్రం క్రిస్టోఫర్ నోలన్ కు ఫిదా అవుతున్నారు. మెదడుని మెలితిప్పే క్లిష్టమైన స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దిట్టగా పొగడబడే ఆయన కొత్త మూవీ ఓపెన్ హెయిమర్ ఈ నెల 21న విడుదల కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా దీని కోసం ఎదురు చూపులు మాములుగా లేవు.
ఇండియాలో రెండు వారాలకు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ పెడితే టికెట్లు నిమిషాల్లో అయిపోతున్నాయి. ముఖ్యంగా పెద్ద స్క్రీన్లున్న ఐమాక్స్ లకు చకచకా సోల్డ్ అవుట్ లు పడుతున్నాయి. న్యూక్లియర్ ప్రయోగాలు ఎంతటి వినాశనానికి దారి తీస్తాయో చూపించే పాయింట్ మీద ఓపెన్ హెయిమర్ ని రూపొందించారు. మూడు గంటల ఎనిమిది నిమిషాల సుదీర్ఘ నిడివితో నోలన్ కెరీర్ లోనే అతి పెద్ద సినిమాగా ఇది ప్రత్యేకత సంతరించుకుంది. ట్రేడ్ టాక్ ప్రకారం కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే ఇప్పటిదాకా ముప్పై వేల టికెట్లు పైగానే అమ్ముడుపోయాయట.
ఇది అరుదైన రికార్డు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఆ సమయానికి మతి పోయే ఫిగర్స్ నమోదు కావడం ఖాయమే. గతంలో ఇంటర్ స్టెల్లార్, టెనెట్ లాంటి కాంప్లికేటెడ్ చిత్రాలను సైతం భారతీయులు బ్రహ్మాండంగా ఆదరించారు. నోలన్ మీద ఇంత ఆరాధనా భావం రావడానికి కారణం ఇన్సెప్షన్ తో పాటు డార్క్ నైట్ సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు. ఇవి మాములు బ్లాక్ బస్టర్ అవ్వలేదు. అప్పటి నుంచి ఈ క్రియేటివ్ జీనియస్ కి ఫాలోయింగ్ పెరిగిపోయించి. అన్నట్టు ఈ ఓపెన్ హెయిమర్ ని చూసేందుకు సెలబ్రిటీలు కూడా ఎగబడుతున్నారు. వాళ్ళ కోసం ప్రత్యేక షోల ప్లాన్నింగ్ జరుగుతోంది
This post was last modified on July 5, 2023 7:47 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…