హాలీవుడ్ సినిమాలంటే ఎంత పిచ్చి ఉన్నా మన మూవీ లవర్స్ కి ఆయా దర్శకుల గురించి తెలిసింది తక్కువే. చాలా అరుదుగా వాళ్ళను గుర్తు పెట్టుకుంటారు. కానీ కొన్ని పేర్లు మాత్రం శాశ్వత ముద్ర వేసి తిరుగులేని ఫాలోయింగ్ ని సృష్టించి పెడతాయి. స్టీవెన్ స్పీల్బర్గ్ మంచి ఉదాహరణగా చెప్పొచ్చు. కానీ ఇప్పటి జనరేషన్ మాత్రం క్రిస్టోఫర్ నోలన్ కు ఫిదా అవుతున్నారు. మెదడుని మెలితిప్పే క్లిష్టమైన స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దిట్టగా పొగడబడే ఆయన కొత్త మూవీ ఓపెన్ హెయిమర్ ఈ నెల 21న విడుదల కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా దీని కోసం ఎదురు చూపులు మాములుగా లేవు.
ఇండియాలో రెండు వారాలకు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ పెడితే టికెట్లు నిమిషాల్లో అయిపోతున్నాయి. ముఖ్యంగా పెద్ద స్క్రీన్లున్న ఐమాక్స్ లకు చకచకా సోల్డ్ అవుట్ లు పడుతున్నాయి. న్యూక్లియర్ ప్రయోగాలు ఎంతటి వినాశనానికి దారి తీస్తాయో చూపించే పాయింట్ మీద ఓపెన్ హెయిమర్ ని రూపొందించారు. మూడు గంటల ఎనిమిది నిమిషాల సుదీర్ఘ నిడివితో నోలన్ కెరీర్ లోనే అతి పెద్ద సినిమాగా ఇది ప్రత్యేకత సంతరించుకుంది. ట్రేడ్ టాక్ ప్రకారం కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే ఇప్పటిదాకా ముప్పై వేల టికెట్లు పైగానే అమ్ముడుపోయాయట.
ఇది అరుదైన రికార్డు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఆ సమయానికి మతి పోయే ఫిగర్స్ నమోదు కావడం ఖాయమే. గతంలో ఇంటర్ స్టెల్లార్, టెనెట్ లాంటి కాంప్లికేటెడ్ చిత్రాలను సైతం భారతీయులు బ్రహ్మాండంగా ఆదరించారు. నోలన్ మీద ఇంత ఆరాధనా భావం రావడానికి కారణం ఇన్సెప్షన్ తో పాటు డార్క్ నైట్ సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు. ఇవి మాములు బ్లాక్ బస్టర్ అవ్వలేదు. అప్పటి నుంచి ఈ క్రియేటివ్ జీనియస్ కి ఫాలోయింగ్ పెరిగిపోయించి. అన్నట్టు ఈ ఓపెన్ హెయిమర్ ని చూసేందుకు సెలబ్రిటీలు కూడా ఎగబడుతున్నారు. వాళ్ళ కోసం ప్రత్యేక షోల ప్లాన్నింగ్ జరుగుతోంది
This post was last modified on July 5, 2023 7:47 pm
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18…
ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…
బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి…
తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా…
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…