రంగబలి ప్రమోషన్లలో భాగంగా టీవీ, మీడియా సెలబ్రిటీలను అనుకరిస్తూ కామెడీ సత్య చేసిని స్పూఫ్ ఇంటర్వ్యూ ప్రోమో ఎంత వైరల్ అయ్యిందో చూశాం. దెబ్బకు అతను ఎవరినైతే ఇమిటేట్ చేశాడో వాళ్లలో ఒకరిద్దరు హర్ట్ అయ్యారని, అందుకే యూట్యూబ్ స్ట్రీమింగ్ ఆగిపోయిందని పెద్ద ప్రచారమే జరిగింది. అందులో నిజం ఉండొచ్చు కానీ వాళ్ళు ఎవరనేది మాత్రం బయటికి తెలియలేదు. నాలుగు రోజుల క్రితమే రావాల్సిన ఫుల్ వెర్షన్ కేవలం ఈ వివాదం వల్ల ఆగిపోయింది. ఇది వదిలితే కానీ రంగబలి సినిమా చూడమని కొందరు ట్వీట్లు చేయడం వైరల్ గా మారింది.
ఎట్టకేలకు నిర్మాణ సంస్థ పూర్తి ఇంటర్వ్యూను రిలీజ్ చేసింది. కాకపోతే ఎడిట్ చేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ లో కేవలం 8 నిమిషాల ఫుటేజ్ మాత్రమే ఉంది. ఓపెన్ హార్ట్ విత్ సత్య అంటూ ఓ మీడియా అధిపతిని, ఇంటర్వ్యూ విత్ దేవీప్రియా అంటూ మరో వెబ్ యాంకర్ ని అనుకరించిన రెండు ఎపిసోడ్లు ఇందులో పెట్టారు. రెండో పార్ట్ రేపో ఎల్లుండో విడుదల చేస్తారు. సత్య బాడీ లాంగ్వేజ్, మిమిక్రి అనుకరణ అచ్చం దిగిపోయింది. ప్రశ్నలు అడిగే తీరు, కొన్ని వివాదాస్పద అంశాలను ప్రస్తావించినప్పుడు ఆ హావభావాలను అనుకరించడం మొత్తం పర్ఫెక్ట్ గా వచ్చాయి.
కమెడియన్ గా ఈ ప్రమోషన్ తనకు బాగా ఉపయోగపడుతుందని సత్య నమ్ముతున్నాడు. దానికి తగ్గట్టే ట్విట్టర్, ఇన్స్ టాలో ఈ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ఇంకో మూడు రోజుల్లో రాబోతున్న రంగబలి పబ్లిసిటీ పరంగా ఏ అవకాశాన్ని వదిలేందుకు సిద్ధంగా లేరు. బాక్సాఫీస్ వద్ద పోటీ ఉన్నప్పటికీ అన్నీ చిన్న చిన్న సినిమాలే కావడంతో పాజిటివ్ టాక్ వస్తే డామినేట్ చేయొచ్చు. నాగ శౌర్య మాత్రం యావరేజ్ హిట్టు కాదని ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతామని నమ్మకంగా చెబుతున్నాడు. షైన్ టామ్ చాకో విలనీతో పాటు పవన్ కళ్యాణ్ రెఫెరెన్సులు కంటెంట్ కి తోడ్పడుతున్నాయి.
This post was last modified on July 4, 2023 2:33 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…