కరోనా-లాక్డౌన్ టైంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అందరికీ పెదద్ షాకే ఇచ్చింది. తన స్నేహితుడైన గౌతమ్ కిచ్లును ఆమె పెళ్లాడింది. ఇంకా కెరీర్ బాగా సాగుతుండగానే.. చేతిలో పెద్ద సినిమాలు ఉండగానే కాజల్ ఉన్నట్లుండి పెళ్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఐతే కాజల్ ఆ టైంలో పెళ్లి చేసుకోవడమే కాదు.. రెండేళ్ల లోపే ఒక బిడ్డను కూడా కనేసింది. ఆపై మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి బిజీ అయ్యే ప్రయత్నంలో ఉంది.
ఐతే తన పెళ్లికి సంబంధించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో చందమామ ఆసక్తికర విషయం వెల్లడించింది. గౌతమ్తో ఆమె పెళ్లి తన తండ్రికి ఇష్టమే లేదట. ఆయన్ని అతి కష్టం మీద ఒప్పించాల్సి వచ్చిందట. ఇందుకు కారణమేంటో కాజల్ మాటల్లోనే తెలుసుకుందాం పదండి. ‘‘గౌతమ్ నాకు కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యాడు. ఏడేళ్ల పాటు మా స్నేహం సాగింది. ఈ క్రమంలో ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది.
కానీ ఎవ్వరూ మనసులో మాటను బయటపెట్టలేదు. ఇద్దరం మనసులోనే ప్రేమను దాచుకున్నాం. కానీ కరోనా మా ఇద్దరినీ కలిపింది. ఆ టైంలో ఒకరినొకరు విడిచి ఉండలేని స్థితికి చేరుకున్నాం. అప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఇద్దరం మా ఇళ్లలో విషయం చెప్పాం. మా అమ్మ సులువుగానే ఒప్పుకుంది. కానీ నాన్న పెళ్లికి ససేమిరా అన్నారు.
మా ఇద్దరి ప్రొఫెషన్లు వేరు కావడంతో మేం కలిసి ఉండగలమా.. పెళ్లి తర్వాత ఏమవుతుందో అని ఆయన కంగారు పడ్డారు. కానీ మా అమ్మ ఆయనకు నచ్చజెప్పి పెళ్లికి ఒప్పించింది. కొన్ని రోజుల తర్వాత మా పెళ్లికి లైన్ క్లియర్ అయింది. ఐతే పెళ్లి తర్వాత గౌతమ్ ఆయనకు చాలా నచ్చాడు. ఇప్పుడు తనను కొడుకులా చూసుకుంటున్నారు. వాళ్ల అనుబంధం చూస్తే నాకెంతో ఆశ్చర్యం కలుగుతుంది’’ అని కాజల్ వెల్లడించింది.
Show quoted text
This post was last modified on July 3, 2023 7:54 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…