కరోనా-లాక్డౌన్ టైంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అందరికీ పెదద్ షాకే ఇచ్చింది. తన స్నేహితుడైన గౌతమ్ కిచ్లును ఆమె పెళ్లాడింది. ఇంకా కెరీర్ బాగా సాగుతుండగానే.. చేతిలో పెద్ద సినిమాలు ఉండగానే కాజల్ ఉన్నట్లుండి పెళ్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఐతే కాజల్ ఆ టైంలో పెళ్లి చేసుకోవడమే కాదు.. రెండేళ్ల లోపే ఒక బిడ్డను కూడా కనేసింది. ఆపై మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి బిజీ అయ్యే ప్రయత్నంలో ఉంది.
ఐతే తన పెళ్లికి సంబంధించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో చందమామ ఆసక్తికర విషయం వెల్లడించింది. గౌతమ్తో ఆమె పెళ్లి తన తండ్రికి ఇష్టమే లేదట. ఆయన్ని అతి కష్టం మీద ఒప్పించాల్సి వచ్చిందట. ఇందుకు కారణమేంటో కాజల్ మాటల్లోనే తెలుసుకుందాం పదండి. ‘‘గౌతమ్ నాకు కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యాడు. ఏడేళ్ల పాటు మా స్నేహం సాగింది. ఈ క్రమంలో ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది.
కానీ ఎవ్వరూ మనసులో మాటను బయటపెట్టలేదు. ఇద్దరం మనసులోనే ప్రేమను దాచుకున్నాం. కానీ కరోనా మా ఇద్దరినీ కలిపింది. ఆ టైంలో ఒకరినొకరు విడిచి ఉండలేని స్థితికి చేరుకున్నాం. అప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఇద్దరం మా ఇళ్లలో విషయం చెప్పాం. మా అమ్మ సులువుగానే ఒప్పుకుంది. కానీ నాన్న పెళ్లికి ససేమిరా అన్నారు.
మా ఇద్దరి ప్రొఫెషన్లు వేరు కావడంతో మేం కలిసి ఉండగలమా.. పెళ్లి తర్వాత ఏమవుతుందో అని ఆయన కంగారు పడ్డారు. కానీ మా అమ్మ ఆయనకు నచ్చజెప్పి పెళ్లికి ఒప్పించింది. కొన్ని రోజుల తర్వాత మా పెళ్లికి లైన్ క్లియర్ అయింది. ఐతే పెళ్లి తర్వాత గౌతమ్ ఆయనకు చాలా నచ్చాడు. ఇప్పుడు తనను కొడుకులా చూసుకుంటున్నారు. వాళ్ల అనుబంధం చూస్తే నాకెంతో ఆశ్చర్యం కలుగుతుంది’’ అని కాజల్ వెల్లడించింది.
Show quoted text
This post was last modified on July 3, 2023 7:54 pm
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…