కరోనా-లాక్డౌన్ టైంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అందరికీ పెదద్ షాకే ఇచ్చింది. తన స్నేహితుడైన గౌతమ్ కిచ్లును ఆమె పెళ్లాడింది. ఇంకా కెరీర్ బాగా సాగుతుండగానే.. చేతిలో పెద్ద సినిమాలు ఉండగానే కాజల్ ఉన్నట్లుండి పెళ్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఐతే కాజల్ ఆ టైంలో పెళ్లి చేసుకోవడమే కాదు.. రెండేళ్ల లోపే ఒక బిడ్డను కూడా కనేసింది. ఆపై మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి బిజీ అయ్యే ప్రయత్నంలో ఉంది.
ఐతే తన పెళ్లికి సంబంధించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో చందమామ ఆసక్తికర విషయం వెల్లడించింది. గౌతమ్తో ఆమె పెళ్లి తన తండ్రికి ఇష్టమే లేదట. ఆయన్ని అతి కష్టం మీద ఒప్పించాల్సి వచ్చిందట. ఇందుకు కారణమేంటో కాజల్ మాటల్లోనే తెలుసుకుందాం పదండి. ‘‘గౌతమ్ నాకు కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యాడు. ఏడేళ్ల పాటు మా స్నేహం సాగింది. ఈ క్రమంలో ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది.
కానీ ఎవ్వరూ మనసులో మాటను బయటపెట్టలేదు. ఇద్దరం మనసులోనే ప్రేమను దాచుకున్నాం. కానీ కరోనా మా ఇద్దరినీ కలిపింది. ఆ టైంలో ఒకరినొకరు విడిచి ఉండలేని స్థితికి చేరుకున్నాం. అప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఇద్దరం మా ఇళ్లలో విషయం చెప్పాం. మా అమ్మ సులువుగానే ఒప్పుకుంది. కానీ నాన్న పెళ్లికి ససేమిరా అన్నారు.
మా ఇద్దరి ప్రొఫెషన్లు వేరు కావడంతో మేం కలిసి ఉండగలమా.. పెళ్లి తర్వాత ఏమవుతుందో అని ఆయన కంగారు పడ్డారు. కానీ మా అమ్మ ఆయనకు నచ్చజెప్పి పెళ్లికి ఒప్పించింది. కొన్ని రోజుల తర్వాత మా పెళ్లికి లైన్ క్లియర్ అయింది. ఐతే పెళ్లి తర్వాత గౌతమ్ ఆయనకు చాలా నచ్చాడు. ఇప్పుడు తనను కొడుకులా చూసుకుంటున్నారు. వాళ్ల అనుబంధం చూస్తే నాకెంతో ఆశ్చర్యం కలుగుతుంది’’ అని కాజల్ వెల్లడించింది.
Show quoted text
This post was last modified on July 3, 2023 7:54 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…