ఆదిపురుష్ ఫలితం నిరాశపరిచినా ప్రభాస్ స్టామినాని రుజువు చేయడంలో మాత్రం ఫెయిల్ కాలేదు. డిజాస్టర్ తో కూడా రెండు మూడు వందల కోట్లు మంచి నీళ్లు తగినంత సులభంగా రాబట్టగలనని మరోసారి నిరూపించాడు. ఇప్పుడు అందరి కళ్ళు సలార్ మీదే ఉన్నాయి. కెజిఎఫ్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ కావడంతో అంచనాలు మాములుగా లేవు. బిజినెస్ ఆఫర్లు క్రేజీగా వస్తున్నాయి. లీకైన వీడియోలు, స్టిల్స్ చూసే ఫ్యాన్స్ ఆకాశమే హద్దుగా దీని గురించి ఊహించుకుంటున్నారు. ఇప్పుడు ప్రమోషన్లలో మొదటి అడుగు పడబోతోంది.
సలార్ టీజర్ ఈ జూలై 6 తెల్లవారుఝామున 5 గంటల 12 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు. ఏదో ముహూర్తం చూసి ఫిక్స్ చేయించినట్టున్నారు. మాములుగా విడుదల రోజు బెనిఫిట్ షోలు ఈ టైంకి మొదలవుతాయి. అలాంటిది టీజర్ కి ఈ సమయాన్ని లాక్ చేయడం ఆశ్చర్యమే. అంటే ఫ్యాన్స్, మీడియా వర్గాలు, మూవీ లవర్స్ అందరూ అలారం పెట్టుకుని లేవాల్సిందే. తర్వాతైనా చూసుకోవచ్చు కానీ ఎగ్జైట్ మెంట్ మిస్ అయిపోతుంది. ఈలోగా ట్విట్టర్, ఇన్స్ టా, ఫేస్ బుక్స్ లో మోత మ్రోగిపోతుంది. అలా జరగకూడదంటే లేవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు
ఈ వీడియో ద్వారానే బిజినెస్ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోతుందని నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలిమ్స్ ఆశిస్తోంది. ఇంకా ఏరియాల వారిగా హక్కులను పూర్తిగా విక్రయించలేదు. డిస్ట్రిబ్యూటర్ల మధ్య పోటీని విశ్లేషించి నిర్ణయం తీసుకోబోతున్నారు. బాహుబలి తర్వాత మళ్ళీ ఆ స్థాయి విజయం చూడలేకపోయిన ప్రభాస్ కి ఆ లోటు సలార్ పూర్తిగా తీరుస్తుందనే నమ్మకం హీరోతో పాటు అభిమానుల్లోనూ బలంగా కనిపిస్తోంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన సలార్ లో పృథ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు మెయిన్ విలన్లు. ఒక భాగమా లేక సీక్వెల్ ఉంటుందానే సస్పెన్స్ కూడా మూడు రోజుల్లో తేలిపోతుంది
This post was last modified on July 3, 2023 4:31 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…