సినిమా థియేటర్లు మూసి వుండడంతో, ఒకవేళ థియేటర్లు తెరిచినా మునుపటి మాదిరిగా జనం థియేటర్లకు వస్తారనే నమ్మకం లేకపోవడంతో నిర్మాతలు ఓటిటి రిలీజ్కి హీరోలని ఒప్పించేస్తున్నారు. అలాగే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సంగతి కూడా చూడాలని ఆ చిత్ర నిర్మాతలు భావించారు. ఇందునిమిత్తం నాగార్జునకు కాల్ చేయగా… అలాంటి ఆలోచనే వద్దని చెప్పేసారట. అసలే అఖిల్కి ఇంతవరకు హిట్ లేదు. ఇప్పుడు అతడి సినిమా థియేటర్లో కాకుండా ఓటిటిలో రిలీజ్ అయితే ఇక అతనికి కచ్చితమైన మార్కెట్ ఏర్పడదు.
పైగా తదుపరి చిత్రాలను కూడా ఓటిటిలో విడుదల చేయాలనే ఆలోచనను నిర్మాతలు చేయవచ్చు. అందుకే ఆ రిస్క్ తీసుకునేందుకు నాగార్జున ససేమీరా అనేసారట. ఒకవేళ ఆర్థిక భారమయితే తాను కూడా భాగం పంచుకుంటాను గానీ థియేటర్లు తెరుచుకున్న తర్వాతే సినిమా విడుదల చేయాలని చెప్పారట. ఒకవేళ సంక్రాంతికి విడుదల చేయడం కుదరకపోతే వచ్చే వేసవిలో విడుదల చేయవచ్చు కానీ ప్రత్యామ్నాయాల కోసం చూడవద్దని ఖచ్చితంగా చెప్పడంతో ఇక ఆ నిర్మాతలు షూటింగ్ త్వరగా మొదలు పెట్టి, ముగించేద్దాం అనే తొందర కూడా లేకుండా పరిస్థితి మామూలు అయ్యేవరకు వేచి చూడాలని డిసైడ్ అయ్యారట.
This post was last modified on August 14, 2020 4:29 am
మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…
ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు…
బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్…
ఏపీ అధికార పార్టీ వైసీపీ కీలక నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ ఉందని…
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…