సినిమా థియేటర్లు మూసి వుండడంతో, ఒకవేళ థియేటర్లు తెరిచినా మునుపటి మాదిరిగా జనం థియేటర్లకు వస్తారనే నమ్మకం లేకపోవడంతో నిర్మాతలు ఓటిటి రిలీజ్కి హీరోలని ఒప్పించేస్తున్నారు. అలాగే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సంగతి కూడా చూడాలని ఆ చిత్ర నిర్మాతలు భావించారు. ఇందునిమిత్తం నాగార్జునకు కాల్ చేయగా… అలాంటి ఆలోచనే వద్దని చెప్పేసారట. అసలే అఖిల్కి ఇంతవరకు హిట్ లేదు. ఇప్పుడు అతడి సినిమా థియేటర్లో కాకుండా ఓటిటిలో రిలీజ్ అయితే ఇక అతనికి కచ్చితమైన మార్కెట్ ఏర్పడదు.
పైగా తదుపరి చిత్రాలను కూడా ఓటిటిలో విడుదల చేయాలనే ఆలోచనను నిర్మాతలు చేయవచ్చు. అందుకే ఆ రిస్క్ తీసుకునేందుకు నాగార్జున ససేమీరా అనేసారట. ఒకవేళ ఆర్థిక భారమయితే తాను కూడా భాగం పంచుకుంటాను గానీ థియేటర్లు తెరుచుకున్న తర్వాతే సినిమా విడుదల చేయాలని చెప్పారట. ఒకవేళ సంక్రాంతికి విడుదల చేయడం కుదరకపోతే వచ్చే వేసవిలో విడుదల చేయవచ్చు కానీ ప్రత్యామ్నాయాల కోసం చూడవద్దని ఖచ్చితంగా చెప్పడంతో ఇక ఆ నిర్మాతలు షూటింగ్ త్వరగా మొదలు పెట్టి, ముగించేద్దాం అనే తొందర కూడా లేకుండా పరిస్థితి మామూలు అయ్యేవరకు వేచి చూడాలని డిసైడ్ అయ్యారట.
This post was last modified on August 14, 2020 4:29 am
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…