వచ్చే నెల 11న విడుదల కాబోతున్న భోళా శంకర్ కి యానిమల్ వాయిదా పడటం పెద్ద రిలీఫ్ కలిగిస్తోంది. చిరంజీవికి రన్బీర్ కపూర్ కి పోటీ ఏంటనే సందేహం రావొచ్చు కానీ బాక్సాఫీస్ లెక్కలను చూసుకుంటే మ్యాటర్ అర్థమవుతుంది. భోళా శంకర్ రీమేక్ కావడం, దర్శకుడు మెహర్ రమేష్ ట్రాక్ రికార్డు ముందు నుంచే ఒకరకమైన నెగటివిటీని మోసుకొస్తున్నాయి. ఇటీవలే వదిలిన టీజర్ కూడా రొటీన్ గానే ఉంది తప్ప ఎలాంటి ప్రత్యేకమైన ఫీలింగ్ కలిగించలేదనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమయింది. ఇంత ప్రతికూలత ఉండటం చిన్న విషయం కాదు.
ఏపీ, తెలంగాణల సంగతి పక్కనపెడితే సందీప్ రెడ్డి వంగా బ్రాండ్ ఓవర్సీస్ లో చాలా బలంగా ఉంది. అర్జున్ రెడ్డి తాలూకు ఎఫెక్ట్ అది. యానిమల్ మీద యుఎస్ లాంటి దేశాల్లో విపరీతమైన అంచనాలున్నాయి. రెగ్యులర్ భోళా శంకర్ కన్నా వైల్డ్ కంటెంట్ ఉన్న రన్బీర్ కే ఓటేద్దామని ప్రవాసీయులు నిర్ణయించుకుంటే దెబ్బ తప్పదు. చిరు మార్కెట్ ఎంత లాకొచ్చినా కాంపిటీటర్ బలంగా ఉన్నప్పుడు వ్యవహారం ఆషామాషీగా ఉండదు. పైగా కర్ణాటక తప్ప తెలుగు రాష్ట్రాల బయట మెగాస్టార్ బ్రాండ్ అంతగా పని చేయదు. అలాంటప్పుడు యానిమల్ ని తేలికగా తీసుకోవడానికి లేదు.
ఇంత జరిగినా గండం పూర్తిగా తొలగలేదు. ఆగస్ట్ 10 రజనీకాంత్ జైలర్ వచ్చేస్తుంది. 11న సన్నీ డియోల్ గదర్ ఏక్ ప్రేమ్ కథ 2 రాబోతోంది. దీని మీద మాస్ వర్గాల్లో బజ్ ఉంది. యానిమల్ తో పోల్చుకుంటే యూత్ లో వీటి మీద హైప్ తక్కువే కాబట్టి మరీ ఆందోళన చెందాల్సిన పని లేదు. క్రేజ్ ఎక్కువ తక్కువల సంగతి పక్కనపెడితే భోళా శంకర్ బిజినెస్ మాత్రం జోరుగానే సాగుతోందని ట్రేడ్ టాక్. నైజాం, ఆంధ్రా హక్కులను నిర్మాత ఎక్కువ డిమాండ్ చేస్తున్నా డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారట. వాల్తేరు వీరయ్య సక్సెస్ పుణ్యమాని రేట్లు అటుఇటుగా ఉన్నా సిద్ధపడుతున్నారట
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…