శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటించిన బయోపిక్ ‘గుంజన్ సక్సేనా’ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఒక ధీరోదాత్త మహిళ కథను హృద్యంగా చెప్పారంటూ భారతదేశంలోని క్రిటిక్స్లో అత్యధికులు ఈ చిత్రానికి మంచి మార్కులు వేసారు. అయితే ఈ చిత్రానికి ‘నెపోటిజమ్’ సెగ తగిలింది.
ఈ చిత్రానికి నిర్మాత కరణ్ జోహార్ కావడంతో అతడిపై వున్న ద్వేషం ఈ చిత్రంపై ప్రేక్షకులు చూపిస్తున్నారు. హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కావడంతో నెపోటిజమ్ వారియర్స్ మరింతగా ఈ చిత్రాన్ని టార్గెట్ చేస్తున్నారు. సినిమాలోని మంచి, చెడు చూడకుండా జాన్వీ ముఖంలో ఎక్స్ప్రెషన్లు పలకలేదని, కేవలం బంధుప్రీతితో ఇలాంటి టాలెంట్ లేని వారిని బాలీవుడ్ ఎంకరేజ్ చేస్తోందని సగటు ఆడియన్స్తో పాటు సుషాంత్ సింగ్ ఫాన్స్ ఈ చిత్రాన్ని ఎటాక్ చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని మాత్రమే కాదు ఆలియా నటించిన సడక్ 2 ట్రెయిలర్ రిలీజ్ అయితే ఇంతవరకు ఇండియాలో ఏ వీడియోకీ రానన్ని డిస్లైక్స్ దానికి వచ్చాయి. సుషాంత్ సింగ్ మరణం గురించి జనం మరచిపోయే వరకు బాలీవుడ్లో కొందరికి ఈ బాధ తప్పేలా లేదు పాపం.
This post was last modified on August 14, 2020 7:35 am
వీవీఐపీలు…ప్రత్యేకించి ముఖ్యమంత్రుల కాన్వాయ్ లు వెళ్లే దారిలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. అనుకోని కారణాల వల్ల సీఎం వెళ్లడం కాస్తంత…
తమిళనాడు రాజకీయం రంజుగా సాగుతోంది. గతంలో ఎన్నడూ లేనన్ని ట్విస్టులు అక్కడ చోటుచేసుకుంటున్నాయి. ఇందుకు కారణం నిన్నటిదాకా అక్కడ ఉన్నవి…
దేశంలో అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలు ముగిశాయి. మూడు రాష్ట్రాల్లో అధికార పార్టీలు పరాజయం…
అవును.. దళపతి విజయ్ ఏడ్చేశాడు. అవేమీ తమిళనాడు ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు వచ్చిన ఆనంద భాష్పాలు కావు. తన…
అందరూ తమిళ రాజకీయాలు, విజయ్ గెలుపు ముచ్చట్లలో పడిపోయారు కానీ పెద్ది ఇంకో ఇరవై ఎనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న…
భాగ్యనగరం హైదరాబాద్లో మహిళల దుస్థితి ఎలా ఉందో.. ఒంటరి మహిళల పట్ల సమాజం ఎలా వ్యవహరిస్తోందో తెలుసుకునే ప్రయత్నం చేసిన…