అధికారికంగా ప్రకటించకపోయినా యాత్ర 2 పోస్టర్ బయటికి వచ్చేసింది. ఇంకా షూటింగ్ మొదలుకాలేదు కానీ కాన్సెప్ట్ రూపంలో రివీల్ చేద్దామని ప్లాన్ చేసుకున్న టీమ్ కు తెలిసో తెలియకుండానో ఈ రూపంలో మొత్తానికి లీకైపోయి సోషల్ మీడియాని చుట్టేస్తోంది. నిజానికి ఈ మూవీ గురించి సైతాన్ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో దర్శకుడు మహి వి రాఘవ్ చూచాయగా చెప్పారు తప్ప ఖచ్చితంగా ఫలానా డేట్ కి మొదలుపెట్టబోతున్నామని అనలేదు. అఫీషియల్ గా వచ్చే వారం ఈవెంట్ ద్వారా చేద్దామనుకున్నారు కానీ మొత్తానికి కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. టైటిల్ రోల్ తమిళ హీరో జీవా చేయబోతున్నట్టు వారాల క్రితమే లీక్ ఉంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి ఇందులో చూపించబోతున్నట్టు ఆల్రెడీ టాక్ ఉంది. ముఖ్యంగా వైసిపి పార్టీ అధికారంలోకి రావడానికి దోహదం చేసిన పాదయాత్రను ఇందులో హైలైట్ చేయబోతున్నారు. విడుదలని ఫిబ్రవరి 2024 ఫిక్స్ చేసేశారు. అంటే ఎన్నికలు ఇంకో రెండు మూడు నెలల్లో జరగబోతుండగా రిలీజ్ ని ప్లాన్ చేయడమంటే రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి. మొదటిది జగన్ గొప్పదాన్ని స్క్రీన్ మీద చూపించవచ్చు. ఎలక్షన్ల కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు బోలెడన్ని ఫ్రీషోలు వేసినా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు,
రెండోది యాత్ర మొదటి భాగం సమయంలో దాని ప్రభావం ఎంతో కొంత ఓటర్ల మీద పడిందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఉంది. ఇది ఒకరకంగా సెంటిమెంట్ గా భావిస్తున్నారు. ఒకవైపు రామ్ గోపాల్ వర్మ వ్యూహం పేరుతో వైఎస్ చనిపోయాక జగన్ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పడానికి సినిమా తీయగా, ఇటు సైడు యాత్ర 2 రూపంలో జగన్ వ్యక్తిత్వాన్ని హైలైట్ చేస్తారన్న మాట. వీటిలో కించిత్ కూడా నెగటివ్ ప్రస్తావనలు ఉండవని వేరే చెప్పనక్కర్లేదు. నాలుగేళ్లు సైలెంట్ గా ఉండి హఠాత్తుగా యాత్ర 2ని స్టార్ట్ చేయడం పక్కా ప్లాన్ కాక వేరే ఇంకేముంటుంది.
This post was last modified on October 8, 2023 4:38 pm
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…