Movie News

యాత్ర 2 అంతా ప్లాన్ ప్రకారమే

అధికారికంగా ప్రకటించకపోయినా యాత్ర 2 పోస్టర్ బయటికి వచ్చేసింది.  ఇంకా షూటింగ్ మొదలుకాలేదు కానీ కాన్సెప్ట్ రూపంలో రివీల్ చేద్దామని ప్లాన్ చేసుకున్న టీమ్ కు తెలిసో తెలియకుండానో ఈ రూపంలో మొత్తానికి లీకైపోయి సోషల్ మీడియాని చుట్టేస్తోంది. నిజానికి ఈ మూవీ గురించి సైతాన్ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో దర్శకుడు మహి వి రాఘవ్ చూచాయగా చెప్పారు తప్ప ఖచ్చితంగా ఫలానా డేట్ కి మొదలుపెట్టబోతున్నామని అనలేదు. అఫీషియల్ గా వచ్చే వారం ఈవెంట్ ద్వారా చేద్దామనుకున్నారు కానీ మొత్తానికి కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. టైటిల్ రోల్ తమిళ హీరో జీవా చేయబోతున్నట్టు వారాల క్రితమే లీక్ ఉంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి ఇందులో చూపించబోతున్నట్టు ఆల్రెడీ టాక్ ఉంది. ముఖ్యంగా వైసిపి పార్టీ అధికారంలోకి రావడానికి దోహదం చేసిన పాదయాత్రను ఇందులో హైలైట్ చేయబోతున్నారు. విడుదలని ఫిబ్రవరి 2024 ఫిక్స్ చేసేశారు. అంటే ఎన్నికలు ఇంకో రెండు మూడు నెలల్లో జరగబోతుండగా రిలీజ్ ని ప్లాన్ చేయడమంటే రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి. మొదటిది జగన్ గొప్పదాన్ని స్క్రీన్ మీద చూపించవచ్చు. ఎలక్షన్ల కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు బోలెడన్ని ఫ్రీషోలు వేసినా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు,

రెండోది యాత్ర మొదటి భాగం సమయంలో దాని ప్రభావం ఎంతో కొంత ఓటర్ల మీద పడిందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఉంది. ఇది ఒకరకంగా సెంటిమెంట్ గా భావిస్తున్నారు. ఒకవైపు రామ్ గోపాల్ వర్మ వ్యూహం పేరుతో వైఎస్ చనిపోయాక జగన్ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పడానికి సినిమా తీయగా, ఇటు సైడు యాత్ర 2 రూపంలో జగన్ వ్యక్తిత్వాన్ని హైలైట్ చేస్తారన్న మాట. వీటిలో కించిత్ కూడా నెగటివ్ ప్రస్తావనలు ఉండవని వేరే చెప్పనక్కర్లేదు. నాలుగేళ్లు సైలెంట్ గా ఉండి హఠాత్తుగా యాత్ర 2ని స్టార్ట్ చేయడం పక్కా ప్లాన్ కాక వేరే ఇంకేముంటుంది. 

This post was last modified on October 8, 2023 4:38 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

4 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

5 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

6 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

7 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

8 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

8 hours ago