అధికారికంగా ప్రకటించకపోయినా యాత్ర 2 పోస్టర్ బయటికి వచ్చేసింది. ఇంకా షూటింగ్ మొదలుకాలేదు కానీ కాన్సెప్ట్ రూపంలో రివీల్ చేద్దామని ప్లాన్ చేసుకున్న టీమ్ కు తెలిసో తెలియకుండానో ఈ రూపంలో మొత్తానికి లీకైపోయి సోషల్ మీడియాని చుట్టేస్తోంది. నిజానికి ఈ మూవీ గురించి సైతాన్ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో దర్శకుడు మహి వి రాఘవ్ చూచాయగా చెప్పారు తప్ప ఖచ్చితంగా ఫలానా డేట్ కి మొదలుపెట్టబోతున్నామని అనలేదు. అఫీషియల్ గా వచ్చే వారం ఈవెంట్ ద్వారా చేద్దామనుకున్నారు కానీ మొత్తానికి కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. టైటిల్ రోల్ తమిళ హీరో జీవా చేయబోతున్నట్టు వారాల క్రితమే లీక్ ఉంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి ఇందులో చూపించబోతున్నట్టు ఆల్రెడీ టాక్ ఉంది. ముఖ్యంగా వైసిపి పార్టీ అధికారంలోకి రావడానికి దోహదం చేసిన పాదయాత్రను ఇందులో హైలైట్ చేయబోతున్నారు. విడుదలని ఫిబ్రవరి 2024 ఫిక్స్ చేసేశారు. అంటే ఎన్నికలు ఇంకో రెండు మూడు నెలల్లో జరగబోతుండగా రిలీజ్ ని ప్లాన్ చేయడమంటే రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి. మొదటిది జగన్ గొప్పదాన్ని స్క్రీన్ మీద చూపించవచ్చు. ఎలక్షన్ల కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు బోలెడన్ని ఫ్రీషోలు వేసినా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు,
రెండోది యాత్ర మొదటి భాగం సమయంలో దాని ప్రభావం ఎంతో కొంత ఓటర్ల మీద పడిందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఉంది. ఇది ఒకరకంగా సెంటిమెంట్ గా భావిస్తున్నారు. ఒకవైపు రామ్ గోపాల్ వర్మ వ్యూహం పేరుతో వైఎస్ చనిపోయాక జగన్ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పడానికి సినిమా తీయగా, ఇటు సైడు యాత్ర 2 రూపంలో జగన్ వ్యక్తిత్వాన్ని హైలైట్ చేస్తారన్న మాట. వీటిలో కించిత్ కూడా నెగటివ్ ప్రస్తావనలు ఉండవని వేరే చెప్పనక్కర్లేదు. నాలుగేళ్లు సైలెంట్ గా ఉండి హఠాత్తుగా యాత్ర 2ని స్టార్ట్ చేయడం పక్కా ప్లాన్ కాక వేరే ఇంకేముంటుంది.
This post was last modified on October 8, 2023 4:38 pm
వైసీపీ అధినేత జగన్ నివాసం కమ్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్యాలస్కు గుర్తు తెలియని…
విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘లైగర్’ సినిమాపై విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. కానీ…
ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు సీఈవో నారా భువనేశ్వరి.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మ్యూజికల్…
వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, ఇది…
తండేల్ ప్రమోషన్లలో భాగంగా అల్లు అరవింద్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మగధీర తన మేనల్లుడు రామ్ చరణ్ కు ఎలాగైనా…
రైల్వేలలో కొత్త జోన్ కోసం జరిగిన ప్రయత్నాలు.. ఒత్తిళ్లు ఎట్టకేలకు ఫలించాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో విశాఖ కేంద్రంగా జోన్…