అధికారికంగా ప్రకటించకపోయినా యాత్ర 2 పోస్టర్ బయటికి వచ్చేసింది. ఇంకా షూటింగ్ మొదలుకాలేదు కానీ కాన్సెప్ట్ రూపంలో రివీల్ చేద్దామని ప్లాన్ చేసుకున్న టీమ్ కు తెలిసో తెలియకుండానో ఈ రూపంలో మొత్తానికి లీకైపోయి సోషల్ మీడియాని చుట్టేస్తోంది. నిజానికి ఈ మూవీ గురించి సైతాన్ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో దర్శకుడు మహి వి రాఘవ్ చూచాయగా చెప్పారు తప్ప ఖచ్చితంగా ఫలానా డేట్ కి మొదలుపెట్టబోతున్నామని అనలేదు. అఫీషియల్ గా వచ్చే వారం ఈవెంట్ ద్వారా చేద్దామనుకున్నారు కానీ మొత్తానికి కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. టైటిల్ రోల్ తమిళ హీరో జీవా చేయబోతున్నట్టు వారాల క్రితమే లీక్ ఉంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి ఇందులో చూపించబోతున్నట్టు ఆల్రెడీ టాక్ ఉంది. ముఖ్యంగా వైసిపి పార్టీ అధికారంలోకి రావడానికి దోహదం చేసిన పాదయాత్రను ఇందులో హైలైట్ చేయబోతున్నారు. విడుదలని ఫిబ్రవరి 2024 ఫిక్స్ చేసేశారు. అంటే ఎన్నికలు ఇంకో రెండు మూడు నెలల్లో జరగబోతుండగా రిలీజ్ ని ప్లాన్ చేయడమంటే రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి. మొదటిది జగన్ గొప్పదాన్ని స్క్రీన్ మీద చూపించవచ్చు. ఎలక్షన్ల కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు బోలెడన్ని ఫ్రీషోలు వేసినా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు,
రెండోది యాత్ర మొదటి భాగం సమయంలో దాని ప్రభావం ఎంతో కొంత ఓటర్ల మీద పడిందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఉంది. ఇది ఒకరకంగా సెంటిమెంట్ గా భావిస్తున్నారు. ఒకవైపు రామ్ గోపాల్ వర్మ వ్యూహం పేరుతో వైఎస్ చనిపోయాక జగన్ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పడానికి సినిమా తీయగా, ఇటు సైడు యాత్ర 2 రూపంలో జగన్ వ్యక్తిత్వాన్ని హైలైట్ చేస్తారన్న మాట. వీటిలో కించిత్ కూడా నెగటివ్ ప్రస్తావనలు ఉండవని వేరే చెప్పనక్కర్లేదు. నాలుగేళ్లు సైలెంట్ గా ఉండి హఠాత్తుగా యాత్ర 2ని స్టార్ట్ చేయడం పక్కా ప్లాన్ కాక వేరే ఇంకేముంటుంది.
This post was last modified on October 8, 2023 4:38 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…