గత కొన్నేళ్లలో బాక్సాఫీస్ దగ్గర సర్ప్రైజ్ హిట్ అంటే బలగం అనే చెప్పాలి. కమెడియన్ వేణు యెల్దండి రూపొందించిన ఈ చిత్రం విమర్శల ప్రశంసలు అందుకోవడంతో పాటు మంచి వసూళ్లు కూడా సాధించింది. తెలంగాణ సంస్కృతి, గ్రామీణ జీవనాన్ని కళ్లకు కట్టేలా చూపించి.. వినోదంలో ముంచెత్తి.. ఎమోషన్లలో తడిసి ముద్దయ్యేలా చేసిన చిత్రమిది.
తెలంగాణ వాసులనే కాక తెలుగు ప్రేక్షకులందరినీ కూడా ఈ సినిమా ఆకట్టుకుంది. గ్రామాల్లో తెరలు కట్టి ఈ సినిమాను ప్రదర్శించారంటే అదెంత సంచలనం రేపిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సినిమాకు మరో గౌరవం దక్కింది. శనివారం తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-4 పరీక్షలో బలగం సినిమాకు సంబంధించి ఒక ప్రశ్న వేయడం విశేషం.
బలగం సినిమాకు సంబంధించి ఈ కింద జత చేసిన వివరాల్లో ఏది సరైంది అని ప్రశ్న అడగ్గా.. కింద సమాధానాల్లో దర్శకుడు- వేణు యెల్దండి, నిర్మాత- దిల్ రాజు, హర్షితా రెడ్డి, హర్షిత్ రెడ్డి.. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో.. కొమరయ్య పాత్రను పోషించినవారు- అరుసం మధుసూదన్ అనే ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో తొలి మూడు సరైన ఎంపికలు కాగా.. చివరిది తప్పు.
ఇందులో కొమరయ్య పాత్ర చేసిన నటుడి పేరు సుధాకర్ రెడ్డి పోషించారు. దీని మీద ఆప్షన్లు ఇచ్చి ప్రశ్న అడిగారు. తమ సినిమా గురించి గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్న అడగడం పట్ల చిత్ర బృందం అమితానందాన్ని వ్యక్తం చేసింది. దర్శకుడు వేణు ఈ విషయాన్ని సోసల్ మీడియాలో షేర్ చేసి ఇది తమకు దక్కిన గౌరవమని పేర్కొన్నాడు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టిన సినిమాను ఇలా గౌరవించడం మంచి విషయమని హర్షం వ్యక్తమవుతోంది.
సాంకేతికంగా మనిషి ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. వాటిని తన జీవన విధానంలో భాగం చేసుకున్నాడు. సుఖమయ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే…
ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్ష వైసీపీ బారీ అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.…
పెద్ది ప్రీమియర్ల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో క్లారిటీ వచ్చేసింది. రాత్రి 8…
దృశ్యం 3 ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల గ్రాస్ దాటేసింది. కేవలం పది రోజుల్లోపే ఈ ఫీట్ సాధించడం అనూహ్యం.…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాలకు కొత్తే. సినిమా నటుడిగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్న…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరు దాసరి నారాయణరావు. అగ్ర దర్శకుడిగా ఉంటూ 150 సినిమాలు తీయడం…