ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమాకు ఎంత ప్రమోషన్ చేసినా జనాలు థియేటర్లకు ఖచ్చితంగా వస్తారన్న గ్యారెంటీ లేదు. టాక్ చూస్తే కానీ బయట కాలు పెట్టడం కష్టమైంది. అందుకే ఫస్ట్ డే మార్నింగ్ షో, మ్యాట్నీలను నింపడం గురించి దర్శక నిర్మాతలు చాలా కసరత్తులు చేస్తున్నారు. వచ్చే శుక్రవారం విడుదల కాబోతున్న రంగబలి మీద ట్రేడ్ లో మంచి అంచనాలున్నాయి. యూత్ తో పాటు మాస్ బాగా కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉందని ట్రైలర్ నమ్మకాన్ని ఇవ్వడంతో ఆ వారం ఎంత పోటీ ఉన్నా ఎడ్జ్ దీనికే దక్కుతుందని భావిస్తున్నారు. నాగశౌర్య కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో కమెడియన్ సత్య పలువురు మీడియా సెలబ్రిటీలను ఇమిటేట్ చేస్తూ పాల్గొన్న మిమిక్రి ఇంటర్వ్యూ తాలూకు ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. వాస్తవానికి నిర్మాణ సంస్థ చెప్పిన ప్రకారం శనివారం ఉదయం పదకొండు గంటలకు యూట్యూబ్ లో వచ్చేసి ఉండాలి. కానీ అలా జరగలేదు. సత్య ఎవరినైతే ఇమిటేట్ చేశాడో వాళ్లలో కొందరు ఇది స్ట్రీమింగ్ కాకుండా చక్రం తిప్పారనే టాక్ ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా తిరుగుతోంది. అయినా స్పూఫ్ లకు ఇంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదనే అభిప్రాయం జనంలో వ్యక్తమయ్యింది. ఏదైతేనేం ప్రోగ్రాం అయితే రాలేదు.
ప్రస్తుతం దీని గురించి రంగబలి టీమ్ మల్లగుల్లాలు పడుతోంది. ఒకపక్క నెటిజెన్లు ఫుల్ వెర్షన్ ఎప్పుడు పెడతారని డిమాండ్ చేస్తున్నారు. ఇది వదలకపోతే సినిమా చూడమని బెదిరించే బాపతు బయలుదేరారు. సత్య లాంటి అప్ కమింగ్ ఆర్టిస్టు చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకొవాల్సింది పోయి ఇలా అణిచేయడం వల్ల మరిన్ని అవకాశాలకు అడ్డుకట్ట వేసినట్టు అవుతుందని వస్తున్న కామెంట్స్ లో నిజం లేకపోలేదు. ఏది ఏమైనా చేసింది నేరమేమీ కాదు కాబట్టి రంగబలి బృందం ఈ ఛాన్స్ వదలకుండా ఎంతో కొంత ఎడిటింగ్ చేసి ఇంటర్వ్యూని రిలీజ్ చేసే ఆలోచనలో ఉందట. చూద్దాం.
This post was last modified on July 1, 2023 10:51 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…