వేసవి తీవ్ర నిరాశకు గురి చేశాక టాలీవుడ్ బాక్సాఫీస్లో జూన్ నెల కొంత సందడి తెచ్చింది. ఆదిపురుష్ డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తొలి వీకెండ్లో భారీ వసూళ్లే రాబట్టింది. ఇక చివరి వారంలో వచ్చిన స్పైకి కూడా ఓపెనింగ్స్ బాగున్నాయి. సామజవరగమన సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తోంది.
జులైలో పెద్ద సంఖ్యలోనే చిన్న, మీడియం రేంజ్ సినిమాలు రాబోతున్నాయి. ఆగస్టులో ఇండిపెండెన్స్ డే వీకెండ్కు పెద్ద సినిమాల సందడి చూడబోతున్నాం. అంతకంటే ముందు ఒక క్రేజీ మూవీ రిలీజ్కు డేట్ ఫిక్సయింది. తెలుగు ప్రేక్షకులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఆగస్టు 4న విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు తెలిసింది.
లేడీ సూపర్ స్టార్ అనుష్క, క్రేజీ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టిల ఆసక్తికర కలయికలో తెరకెక్కిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఎప్పుడోషూటింగ్ పూర్తి చేసుకుంది. కొన్ని నెలల నుంచి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా టీజర్ చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అనుష్క, నవీన్ల కలయికే సినిమాకు పెద్ద ఎసెట్ కాగా.. టీజర్ మంచి ఎంటర్టైనర్ చూడబోతున్న సంకేతాలు ఇచ్చింది.
యువ దర్శకుడు మహేష్ బాబు రూపొందించిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ నిర్మించింది. ఇండిపెండెన్స్ డే వీకెండ్లో భోళా శంకర్, జైలర్, యానిమల్ లాంటి భారీ చిత్రాలు రాబోతుండగా.. ముందు వారం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ బాక్సాఫీస్ను టేకోవర్ చేయబోతోంది. క్రేజీ కాంబినేషన్, ఆసక్తికర ప్రోమోల వల్ల ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్సే వచ్చే అవకాశముంది. నిశ్శబ్దం తర్వాత అనుష్క నుంచి, జాతిరత్నాలు తర్వాత నవీన్ నుంచి రాబోతున్న సినిమా ఇదే.
This post was last modified on July 1, 2023 5:19 pm
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…