టాప్ కమెడియన్స్ లో కొందరు మిమిక్రీ ఇమిటేషన్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బ్రహ్మానందం, ఆలీ , వేణుమాధవ్ ఇలా చాలా మంది మిమిక్రీ, ఇమిటేషన్ తో పేరు తెచ్చుకున్న వారే. పలాన వ్యక్తి ఎలా మాట్లాడతారో చూసి ఐదు నిమిషాల్లో పట్టేసి ఇమిటేట్ చేయడంలో వీరు దిట్ట. అయితే తాజాగా కమెడియన్ సత్య కూడా ఇలాంటి ఇమిటేషన్ మిమిక్రీ టాలెంట్ తో ప్రేక్షకులకి షాక్ ఇచ్చాడు. సత్య కామెడీ టైమింగ్ గురించి అందరికీ తెలిసిందే. ‘రంగబలి’ సినిమా ప్రమోషన్ కోసం నాగ శౌర్య తో కలిసి ఓ డిఫరెంట్ ఇంటర్వ్యూ చేశాడు సత్య. అందులో భాగంగా కొంతమంది జర్నలిస్టులను ఇంటర్వ్యూలను ఇమిటేట్ చేసిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. సత్యలో ఉన్న మరో కోణాన్ని ఈ ఇంటర్వ్యూ బయటపెట్టి మంచి వినోదం పంచింది.
సత్య ఇమిటేట్ చేసిన ఇంటర్వ్యూ తాలూకు ప్రోమో ఇలా విడుదలయిందో లేదో అలా కొన్ని నిమిషాలకే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. నెటిజన్లు ప్రోమో పదేపదే చూస్తూ ఫుల్ ఇంటర్వ్యూ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అలా సత్య చేసిన నాగ శౌర్య ఫుల్ ఇంటర్వ్యూ వెయిట్ చేస్తున్న అందరికీ టీం తీసుకున్న నిర్ణయం షాక్ ఇచ్చేలా ఉంది. ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సత్య ఒక పత్రికా ,టివీ ఛానెల్ అధిపతి, వెబ్ మీడియా జర్నలిస్ట్ కం ఇంటర్వ్యూవర్ , లేడీ న్యూస్ యాంకర్ , అలాగే నిత్యం కాంట్రవర్సీ ప్రశ్నలతో వైరల్ అవుతున్న ఓ పత్రికాదిపతి ను ఇలా ట్రెండింగ్ లో ఉండే వ్యక్తులను ఇమిటేట్ చేస్తూ వారి వేషధారణలో కనిపించాడు.
దీంతో ట్రెండ్ పట్టుకొని కొందరు వ్యక్తులను సత్య ఇమిటేట్ చేసిన ఇంటర్వ్యూ ప్రోమో విపరీతంగా వైరల్ అయింది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఫుల్ ఇంటర్వ్యూ ఇక బయటికి రాదని తెలుస్తోంది. ప్రోమో వైరల్ అవ్వడంతో సదరు వ్యక్తుల్లో ఇద్దరు ముగ్గురు బాగా హర్ట్ అయ్యారని టీమ్ ను సంప్రదించి ఫుల్ ఇంటర్వ్యూ రావడానికి వీల్లేదని చెప్పారని సమాచారం.
దీంతో ఆ వ్యక్తుల మనో భావాలని దెబ్బతీయడం వారి మనసు కష్ట పెట్టడం ఇష్టం లేక టీమ్ ఈ ఇంటర్వ్యూ ను బయటికి రాకుండా ఓ నిర్ణయం తీసుకున్నారట. మరి సదరు వ్యక్తులు టీమ్ ను రిక్వెస్ట్ చేశారా ? లేదా తమ మీడియా సంస్థల్లో సినిమాను ప్రమోట్ చేయకుండా దుష్ప్రచారం చేస్తామని భయపెట్టారా తెలియదు. ఏదేమైనా ఫుల్ ఇంటర్వ్యూ వచ్చినా, రాకపోయినా ప్రోమోతో సినిమాకు కావాల్సిన ప్రమోషనల్ బజ్ వచ్చేసింది.
This post was last modified on July 1, 2023 6:10 am
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…