టాప్ కమెడియన్స్ లో కొందరు మిమిక్రీ ఇమిటేషన్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బ్రహ్మానందం, ఆలీ , వేణుమాధవ్ ఇలా చాలా మంది మిమిక్రీ, ఇమిటేషన్ తో పేరు తెచ్చుకున్న వారే. పలాన వ్యక్తి ఎలా మాట్లాడతారో చూసి ఐదు నిమిషాల్లో పట్టేసి ఇమిటేట్ చేయడంలో వీరు దిట్ట. అయితే తాజాగా కమెడియన్ సత్య కూడా ఇలాంటి ఇమిటేషన్ మిమిక్రీ టాలెంట్ తో ప్రేక్షకులకి షాక్ ఇచ్చాడు. సత్య కామెడీ టైమింగ్ గురించి అందరికీ తెలిసిందే. ‘రంగబలి’ సినిమా ప్రమోషన్ కోసం నాగ శౌర్య తో కలిసి ఓ డిఫరెంట్ ఇంటర్వ్యూ చేశాడు సత్య. అందులో భాగంగా కొంతమంది జర్నలిస్టులను ఇంటర్వ్యూలను ఇమిటేట్ చేసిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. సత్యలో ఉన్న మరో కోణాన్ని ఈ ఇంటర్వ్యూ బయటపెట్టి మంచి వినోదం పంచింది.
సత్య ఇమిటేట్ చేసిన ఇంటర్వ్యూ తాలూకు ప్రోమో ఇలా విడుదలయిందో లేదో అలా కొన్ని నిమిషాలకే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. నెటిజన్లు ప్రోమో పదేపదే చూస్తూ ఫుల్ ఇంటర్వ్యూ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అలా సత్య చేసిన నాగ శౌర్య ఫుల్ ఇంటర్వ్యూ వెయిట్ చేస్తున్న అందరికీ టీం తీసుకున్న నిర్ణయం షాక్ ఇచ్చేలా ఉంది. ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సత్య ఒక పత్రికా ,టివీ ఛానెల్ అధిపతి, వెబ్ మీడియా జర్నలిస్ట్ కం ఇంటర్వ్యూవర్ , లేడీ న్యూస్ యాంకర్ , అలాగే నిత్యం కాంట్రవర్సీ ప్రశ్నలతో వైరల్ అవుతున్న ఓ పత్రికాదిపతి ను ఇలా ట్రెండింగ్ లో ఉండే వ్యక్తులను ఇమిటేట్ చేస్తూ వారి వేషధారణలో కనిపించాడు.
దీంతో ట్రెండ్ పట్టుకొని కొందరు వ్యక్తులను సత్య ఇమిటేట్ చేసిన ఇంటర్వ్యూ ప్రోమో విపరీతంగా వైరల్ అయింది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఫుల్ ఇంటర్వ్యూ ఇక బయటికి రాదని తెలుస్తోంది. ప్రోమో వైరల్ అవ్వడంతో సదరు వ్యక్తుల్లో ఇద్దరు ముగ్గురు బాగా హర్ట్ అయ్యారని టీమ్ ను సంప్రదించి ఫుల్ ఇంటర్వ్యూ రావడానికి వీల్లేదని చెప్పారని సమాచారం.
దీంతో ఆ వ్యక్తుల మనో భావాలని దెబ్బతీయడం వారి మనసు కష్ట పెట్టడం ఇష్టం లేక టీమ్ ఈ ఇంటర్వ్యూ ను బయటికి రాకుండా ఓ నిర్ణయం తీసుకున్నారట. మరి సదరు వ్యక్తులు టీమ్ ను రిక్వెస్ట్ చేశారా ? లేదా తమ మీడియా సంస్థల్లో సినిమాను ప్రమోట్ చేయకుండా దుష్ప్రచారం చేస్తామని భయపెట్టారా తెలియదు. ఏదేమైనా ఫుల్ ఇంటర్వ్యూ వచ్చినా, రాకపోయినా ప్రోమోతో సినిమాకు కావాల్సిన ప్రమోషనల్ బజ్ వచ్చేసింది.
This post was last modified on July 1, 2023 6:10 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…