ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేసిన చిత్రాల్లో ‘దసరా’ ఒకటి. నాని మిడ్ రేంజ్ హీరోనే కానీ.. ఈ సినిమాకు మాత్రం పెద్ద సినిమాల రేంజిలో ఓపెనింగ్స్, థియేటర్లలో హడావుడి కనిపించాయి. ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయం అయిన శ్రీకాంత్ ఓదెల గురువు సుకుమార్కు తగ్గ శిష్యుడినే అనిపించుకున్నాడు. బడ్జెట్ హద్దులు దాటడం వల్ల దసరా సూపర్ హిట్ రేంజికి వెళ్లలేదు కానీ.. శ్రీకాంత్ మాత్రం విషయం ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.
స్టార్ హీరోలను బాగానే డీల్ చేయగలడన్న చర్చ జరిగింది అతడి గురించి. రెండో సినిమాను ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో చేయడానికి ప్రయత్నించాడతను. ‘భోళా శంకర్’ తర్వాత ఏ సినిమా చేయాలనే విషయంలో చిరు కన్ఫ్యూజన్లో ఉండగా.. ఆయన పరిశీలించిన దర్శకుల్లో శ్రీకాంత్ ఓదెల కూడా ఉన్నాడు. శ్రీకాంత్ లాగే మరికొందరు దర్శకులూ చిరుతో సినిమా కోసం ఒకే సమయంలో ప్రయత్నించారు.
ఐతే ముందు నుంచి వర్క్ చేస్తూ, సమయానికి చిరును మెప్పించిన కళ్యాణ్ కృష్ణ కురసాలతో సినిమా ఓకే అయిపోయింది. బింబిసార దర్శకుడు వశిష్ట కూడా చిరును మెప్పించినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్కు చాలినంత సమయం లేకపోవడం, సమయానికి స్క్రిప్టు రెడీ కాకపోవడంతో అతడికి ‘మెగా’ ఛాన్స్ దక్కలేదు. ఐతే ఇందుకు శ్రీకాంత్ ఏమీ నిరాశ చెందలేదు. అతను మరో మెగా హీరోనే టార్గెట్ చేసినట్లు తాజా సమాచారం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో శ్రీకాంత్ ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నాడట. ‘పుష్ప-2’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్తో బన్నీ ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాతి ప్రాజెక్టు విషయంలో క్లారిటీ లేదు. శ్రీకాంత్ ఆ అవకాశం దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడట. మంచి మాస్ కథతో బన్నీని మెప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. బన్నీకి ఒక లైన్ చెప్పి దాని మీద వర్క్ చేస్తున్నాడట. ఫుల్ స్క్రిప్టుతో మెప్పిస్తే సినిమా ఉంటుంది.
This post was last modified on June 30, 2023 4:07 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…