ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేసిన చిత్రాల్లో ‘దసరా’ ఒకటి. నాని మిడ్ రేంజ్ హీరోనే కానీ.. ఈ సినిమాకు మాత్రం పెద్ద సినిమాల రేంజిలో ఓపెనింగ్స్, థియేటర్లలో హడావుడి కనిపించాయి. ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయం అయిన శ్రీకాంత్ ఓదెల గురువు సుకుమార్కు తగ్గ శిష్యుడినే అనిపించుకున్నాడు. బడ్జెట్ హద్దులు దాటడం వల్ల దసరా సూపర్ హిట్ రేంజికి వెళ్లలేదు కానీ.. శ్రీకాంత్ మాత్రం విషయం ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.
స్టార్ హీరోలను బాగానే డీల్ చేయగలడన్న చర్చ జరిగింది అతడి గురించి. రెండో సినిమాను ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో చేయడానికి ప్రయత్నించాడతను. ‘భోళా శంకర్’ తర్వాత ఏ సినిమా చేయాలనే విషయంలో చిరు కన్ఫ్యూజన్లో ఉండగా.. ఆయన పరిశీలించిన దర్శకుల్లో శ్రీకాంత్ ఓదెల కూడా ఉన్నాడు. శ్రీకాంత్ లాగే మరికొందరు దర్శకులూ చిరుతో సినిమా కోసం ఒకే సమయంలో ప్రయత్నించారు.
ఐతే ముందు నుంచి వర్క్ చేస్తూ, సమయానికి చిరును మెప్పించిన కళ్యాణ్ కృష్ణ కురసాలతో సినిమా ఓకే అయిపోయింది. బింబిసార దర్శకుడు వశిష్ట కూడా చిరును మెప్పించినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్కు చాలినంత సమయం లేకపోవడం, సమయానికి స్క్రిప్టు రెడీ కాకపోవడంతో అతడికి ‘మెగా’ ఛాన్స్ దక్కలేదు. ఐతే ఇందుకు శ్రీకాంత్ ఏమీ నిరాశ చెందలేదు. అతను మరో మెగా హీరోనే టార్గెట్ చేసినట్లు తాజా సమాచారం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో శ్రీకాంత్ ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నాడట. ‘పుష్ప-2’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్తో బన్నీ ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాతి ప్రాజెక్టు విషయంలో క్లారిటీ లేదు. శ్రీకాంత్ ఆ అవకాశం దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడట. మంచి మాస్ కథతో బన్నీని మెప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. బన్నీకి ఒక లైన్ చెప్పి దాని మీద వర్క్ చేస్తున్నాడట. ఫుల్ స్క్రిప్టుతో మెప్పిస్తే సినిమా ఉంటుంది.
This post was last modified on June 30, 2023 4:07 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…