సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయి రెండు నెలలు దాటిగా అతడి గురించి చర్చ ఆగట్లేదు. ఓవైపు అతడిది ఆత్మహత్యా కాదా అనే విషయంలో విచారణ సాగుతోంది. ముందు ముంబయి పోలీసులు విచారణ చేపట్టగా.. తర్వాత సుశాంత్ సొంత రాష్ట్రం బీహార్ నుంచి పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పుడు అతడి మృతి కేసును సీబీఐ టేకప్ చేసి విచారణ జరుపుతోంది. ఇదిలా ఉంటే సుశాంత్ బతికుండగా అతడి గురించి పెద్దగా తెలియని విషయాలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. సుశాంత్కు స్పేస్ సైన్స్ పట్ల ఉన్న ఆసక్తి, అతను అంతరిక్షంలో స్థలం కొనడం, అంతరిక్ష పరిశోధనల పట్ల అమితాసక్తిని ప్రదర్శించడం, ఆ నేపథ్యంలో ఓ సినిమా కూడా చేయాలనుకోవడం లాంటి విషయాలు బయటికి వచ్చాయి.
అలాగే సినిమా నటుడిగా తన పరిధిని విస్తరించుకునే దిశగా కూడా సుశాంత్కు అనేక కలలు ఉన్న సంగతి వెల్లడవుతోంది. తన లక్ష్యాల గురించి అతను డైరీలో రాసుకున్న విషయాలు కొన్ని బయటికి వచ్చాయి. సుశాంత్ చేతి రాతతో ఉన్న డైరీ పేజీలు ఆసక్తి రేపుతున్నాయి. 2020లో తాను హాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నట్లు అతను అందులో సంకేతాలు ఇచ్చాడు. అలాగే ప్రొడక్షన్ హౌజ్ మొదలుపెట్టి.. మంచి రైటింగ్ టీంను ఏర్పాటు చేసుకోవడం, అనుభవజ్ఞులతో పాటు కొత్త తరహా ఆలోచనలున్న వారితో కలిసి పని చేయడం.. స్టార్టప్ ఏర్పాటు చేయడం గురించి కూడా అందులో అతను ప్రణాళికలు వేసుకున్నాడు. ఇంకా సినిమాతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవడం, పర్యావరణంపై అవగాహన పెంచుకోవడం లాంటి అంశాల గురించి అతను డైరీలో రాసుకున్నాడు. ఇంతగా 2020ని ప్లాన్ చేసుకున్నవాడు.. ఇలా అర్ధంతరంగా తనువు చాలించడం విషాదమే.
This post was last modified on August 13, 2020 8:24 pm
ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న తమిళ స్టార్ హీరో ధనుష్, అగ్ర కథానాయిక నయనతార.. కొన్ని కారణాల వల్ల శత్రువులుగా…
ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. తమిళ కుర్రాడు ప్రదీప్ రంగనాథన్కు... నాలుగేళ్ల ముందు వరకు తమిళనాడులోనే…
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఈ నెలలో…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ల విధ్వంసం ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తోకముడిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో…
ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…