మొత్తానికి కొన్ని నెలలుగా నెలకొన్న ప్రతిష్ఠంభనకు తెరపడింది. హిందీ, తమిళం, మలయాళం లాంటి భాషల్లో పేరున్న సినిమాలు నేరుగా ఓటీటీల్లో రిలీజవుతుంటే.. తెలుగు నిర్మాతలు మాత్రం మార్పును స్వీకరించకుండా మడి కట్టుకుని కూర్చున్నారనే అభిప్రాయాలు వినిపించాయి. మన దగ్గర 47 డేస్, కృష్ణ అండ్ హిజ్ లీల, భానుమతి రామకృష్ణ, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి చిన్న సినిమాలు మినహాయిస్తే.. కాస్త పేరున్న సినిమాలేవీ నేరుగా ఓటీటీల్లో రిలీజ్ కాలేదు. అలాగని విడుదలకు సిద్ధంగా ఉన్న మీడియం, పెద్ద రేంజ్ సినిమాలు లేవా అంటే అదేం కాదు. వి, ఉప్పెన, రెడ్ లాంటి చిత్రాలు ఫస్ట్ కాపీతో రెడీ అయిన స్థితిలో ఉన్నాయి.
కానీ తాము ఆశించిన స్థాయిలో రేటు రాలేదో.. లేక తమ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తేనే బాగుంటందనో.. లేక అలా చేస్తేనే ఎక్కువ ఆదాయం వస్తుందో.. ఇలా వివిధ కారణాలతో మన నిర్మాతలు ఆగిపోయారు. హిందీలో అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ లాంటి హీరోలు నటించిన సినిమాలే ఓటీటీల్లో నేరుగా రిలీజవుతుంటే మనవాళ్లు ఆలోచించేదేంటి అన్న ప్రశ్నలు తలెత్తినా మన నిర్మాతలు వెనుకంజ వేయలేదు. థియేటర్లు త్వరలో తెరుచుకుంటాయి అనుకుంటూ ఎదురు చూశారు. కానీ ఇలాగే ఐదు నెలలు గడిచిపోయాయి. ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుని మామూలుగా నడిచే పరిస్థితి లేదని అర్థమైంది.
వడ్డీల భారం లెక్కలు కట్టాక ఇంకొన్ని నెలలు ఎదురు చూసి థియేటర్లలో రిలీజ్ చేసినా ప్రయోజనం లేదని బోధ పడింది. ఈ నేపథ్యంలోనే ముందుగా దిల్ రాజు ధైర్యం చేసి ‘వి’ చిత్రాన్న అమేజాన్ ప్రైమ్ వాళ్లకు అమ్మేశారన్నది తాజా సమాచారం. రాజే పట్టు వీడాక మిగతా వాళ్ల సంగతి చెప్పేదేముంది. దీంతో ఇంకో మూడు మీడియం రేంజ్ సినిమాల నిర్మాతలు కూడా తమ చిత్రాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయారని.. వీళ్లందరూ ఉమ్మడిగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని.. త్వరలోనే ‘వి’ సహా మరో మూడు చిత్రాల ఓటీటీ రిలీజ్ గురించి అధికారికంగా ప్రకటన చేస్తారని సమాచారం.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…