మొత్తానికి కొన్ని నెలలుగా నెలకొన్న ప్రతిష్ఠంభనకు తెరపడింది. హిందీ, తమిళం, మలయాళం లాంటి భాషల్లో పేరున్న సినిమాలు నేరుగా ఓటీటీల్లో రిలీజవుతుంటే.. తెలుగు నిర్మాతలు మాత్రం మార్పును స్వీకరించకుండా మడి కట్టుకుని కూర్చున్నారనే అభిప్రాయాలు వినిపించాయి. మన దగ్గర 47 డేస్, కృష్ణ అండ్ హిజ్ లీల, భానుమతి రామకృష్ణ, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి చిన్న సినిమాలు మినహాయిస్తే.. కాస్త పేరున్న సినిమాలేవీ నేరుగా ఓటీటీల్లో రిలీజ్ కాలేదు. అలాగని విడుదలకు సిద్ధంగా ఉన్న మీడియం, పెద్ద రేంజ్ సినిమాలు లేవా అంటే అదేం కాదు. వి, ఉప్పెన, రెడ్ లాంటి చిత్రాలు ఫస్ట్ కాపీతో రెడీ అయిన స్థితిలో ఉన్నాయి.
కానీ తాము ఆశించిన స్థాయిలో రేటు రాలేదో.. లేక తమ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తేనే బాగుంటందనో.. లేక అలా చేస్తేనే ఎక్కువ ఆదాయం వస్తుందో.. ఇలా వివిధ కారణాలతో మన నిర్మాతలు ఆగిపోయారు. హిందీలో అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ లాంటి హీరోలు నటించిన సినిమాలే ఓటీటీల్లో నేరుగా రిలీజవుతుంటే మనవాళ్లు ఆలోచించేదేంటి అన్న ప్రశ్నలు తలెత్తినా మన నిర్మాతలు వెనుకంజ వేయలేదు. థియేటర్లు త్వరలో తెరుచుకుంటాయి అనుకుంటూ ఎదురు చూశారు. కానీ ఇలాగే ఐదు నెలలు గడిచిపోయాయి. ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుని మామూలుగా నడిచే పరిస్థితి లేదని అర్థమైంది.
వడ్డీల భారం లెక్కలు కట్టాక ఇంకొన్ని నెలలు ఎదురు చూసి థియేటర్లలో రిలీజ్ చేసినా ప్రయోజనం లేదని బోధ పడింది. ఈ నేపథ్యంలోనే ముందుగా దిల్ రాజు ధైర్యం చేసి ‘వి’ చిత్రాన్న అమేజాన్ ప్రైమ్ వాళ్లకు అమ్మేశారన్నది తాజా సమాచారం. రాజే పట్టు వీడాక మిగతా వాళ్ల సంగతి చెప్పేదేముంది. దీంతో ఇంకో మూడు మీడియం రేంజ్ సినిమాల నిర్మాతలు కూడా తమ చిత్రాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయారని.. వీళ్లందరూ ఉమ్మడిగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని.. త్వరలోనే ‘వి’ సహా మరో మూడు చిత్రాల ఓటీటీ రిలీజ్ గురించి అధికారికంగా ప్రకటన చేస్తారని సమాచారం.
This post was last modified on August 13, 2020 8:21 pm
వేసవి సీజన్లో కొంచెం ముందుగానే రేసులోకి దిగింది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. కానీ ఈ చిత్రం టాలీవుడ్కు శుభారంభాన్ని అందించలేకపోయింది.…
మావిగన్.. నిన్న మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్న పదం. ఇప్పటిదాకా ఎన్నడూ వినని ఈ పదం…
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…