ఇటీవలే అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన రాకేష్ మాస్టర్ విషయంలో యూట్యూబ్ ఛానెల్స్ తీరు మారాలని ఆయన శిష్యుడు, ప్రస్తుత టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ విన్నవించాడు. రాకేష్ మాస్టర్ చనిపోయినప్పటి నుంచి యూట్యూబ్ ఛానెల్స్ ఇష్టం వచ్చిన థంబ్ నైల్స్ పెట్టి నోటికొచ్చింది రాసేస్తున్నారని.. వాళ్లకు విషయం తెలిస్తేనే రాయాలని.. అలా కాకుండా ఏదేదో ఊహించి రాయడం కరెక్ట్ కాదని.. ఇకనైనా ఇలాంటివి ఆపేయాలని శేఖర్ కోరాడు.
రాకేష్ మాస్టర్ మీద తన అభిమానం ఎలాంటిదో.. తమ మధ్య ఎంతటి అనుబంధం ఉందో ఆయన పెద కర్మ కార్యక్రమంలో శేఖర్ వెల్లడించాడు. రాకేష్ మాస్టర్ను తన గురువు అని చెప్పుకోవడానికి ఎప్పుడూ తాను గర్వపడతానని.. తాను కష్టాల్లో ఉన్నపుడు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నది ఆయనే అని శేఖర్ తెలిపాడు.
తాను ప్రభుదేవాను చూసి స్ఫూర్తి పొంది ఇండస్ట్రీకి వచ్చానని.. కానీ తనకు ఆశ్రయం ఇచ్చి డ్యాన్స్ నేర్పింది మాత్రం రాకేష్ మాస్టరే అని శేఖర్ తెలిపాడు. తనతో పాటు సత్యం మాస్టర్కు ఆయన ఇన్స్టిట్యూట్లో అవకాశం దక్కిందని.. తాము ఫీజ్ లేకుండా అక్కడ డ్యాన్స్ నేర్చుకున్నామని.. అలాగే తర్వాత ఇన్స్టిట్యూట్లో పిల్లలకు క్లాసులు చెప్పేవాళ్లమని శేఖర్ తెలిపాడు.
అప్పట్లో తమకు డ్యాన్స్ తప్ప మరో లోకం తెలియదని.. రాకేష్ మాస్టర్ పెళ్లి చేసింది కూడా తామే అని శేఖర్ వెల్లడించాడు. మాస్టర్ ఎక్కడున్నా బాగుండాలని కోరుకునేవాడినని.. కానీ ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని శేఖర్ ఆవేదన వ్యక్తం చేశాడు. రాకేష్ మాస్టర్ డ్యాన్సుల్లో 5 శాతం మాత్రమే యూట్యూబ్ ఛానెళ్లలో చూశారని.. ఆయన అంతకుమించి గొప్ప డ్యాన్సర్ అని.. అలాంటి వ్యక్తి ఇంత త్వరగా అందరినీ విడిచి వెళ్లిపోవడం బాధాకరమని శేఖర్ అన్నాడు.
This post was last modified on June 29, 2023 5:28 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…